2వ రోజు జిల్లా
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ -26.10.2018 శుక్రవారం
స్థలం
: ఉండవల్లి కరకట్ట పక్కన ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజావేదిక
ముఖ్య అంశాలు
v తూర్పుగోదావరి, విశాఖపట్నంలో
మలేరియా నివారణపై శ్రద్దపెట్టాలి. విశాఖలో డెంగీ నియంత్రణపై దృష్టి పెట్టాలి.
స్వైన్ ఫ్లూ గత ఏడాది 454 కేసులు వస్తే ఈ ఏడాది 92 కేసులు వచ్చాయి. కర్నూలులో స్వైన్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. పొరుగు
రాష్ట్రాల నుంచి స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా వైద్య సేవలు అందించాలి.మందులు పంపిణీ చేయాలి:
ముఖ్యమంత్రి చంద్రబాబు
v పర్యాటక
రంగంలో కాకినాడ హోప్ ఐలాండ్ ప్రాజెక్టు
రూ.70కోట్లతో పూర్తిచేశారు. స్వదేశ్ దర్శన్ కింద పూర్తిచేసిన తొలి ప్రాజెక్టు ఇది:
సీఎం
v శ్రీకాకుళం, విశాఖపట్నం, అమరావతి బుద్దిస్ట్ పర్యాటక క్షేత్రాల అభివృద్దిపై
నిర్లక్ష్యం చేయడం తగదు: సీఎం
v నెల్లూరులో
కోస్టల్ టూరిజం డెవలప్ మెంట్ ప్రాజెక్టు రూ.59.70 కోట్లకు గాను రూ.41.95 కోట్లు
ఖర్చుచేశారు: సీఎం
v శ్రీశైలం
టెంపుల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు రూ.45.19 కోట్లకు రూ.22.33కోట్లు ఖర్చుచేశారు.
v పశు
సంవర్ధకశాఖలో 20 శాతం లక్ష్యానికి ఇప్పటికి 16
శాతం వరకు చేరుకున్నాం : ముఖ్యమంత్రికి అధికారుల ప్రెజెంటేషన్.
v రెండు త్రైమాసాల్లో మత్స్య రంగంలో 19.89 శాతం వృద్ధి రేటు నమోదు.
v ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను 60 వేల ఎకరాల్లో చేయాలని లక్ష్యం పెట్టుకోగా 70 వేల
ఎకరాలలో మంజూరు చేశాం. 49వేల ఎకరాల్లో గ్రౌడింగ్ జరిగింది.
సైలేస్ పంపిణీ వేగవంతం చేస్తున్నాం. రూ.250 కోట్ల
కన్వర్జెన్స్ నరేగా కింద లక్ష్యం కాగా, 14పథకాల కింద ఆయా పనులను చేపట్టి పాల ఉత్పత్తి పెంచేందుకు
కృషి చేస్తున్నాం.12,150 విఎల్ ఆర్పీలను గుర్తించాం. అన్ని
నియోజకవర్గాలలో డిసెంబర్ కల్లా పశువైద్య శిబిరాల నిర్వహణ పూర్తిచేస్తాం: ముఖ్య
కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గోపాల కృష్ణ ద్వివేది
v మత్స్య ఎగుమతుల్లో ఏపీలో 11.08 వృద్ధి రేటు నమోదు.
ప్రకాశం జిల్లా
వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం
జిల్లాలోని వెలుగొండ, గుండ్లకమ్మ, కొరిశపాడు ప్రాజెక్టులను, వెలుగొండ టెర్నల్ ని
చూసారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు.
వెలుగొండ ప్రాజెక్ట్ వన్ టైమ్ సెటిల్ మెంట్ ఫైల్ ఆర్థిక
శాఖకు పంపినట్లు ఆర్ అండ్ ఆర్ (రిహాబిలేషన్ అండ్ రీ సెటిల్ మెంట్) స్పెషల్ కమిషనర్
జి.రేఖారాణి చెప్పగా, ఆ ఫైల్ వెంటనే
పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారిని ఆదేశించారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు
ఉభయ గోదావరి జిల్లాల్లో డెల్టా మోడరేషన్ చేపట్టాలని,
లిఫ్ట్ ఇరిగేషన్, డ్రైనేజ్ పనులు చేపట్టాలని, వ్యవసాయ కాలవలు మరమ్మతులు చేయాలని
మంత్రి పితాని సత్యనారాయణ అడిగారు. తప్పకుండా ఆ పనులు చేపడతామని మంత్రి ఉమ సమాధానం చెప్పారు.
మూలపాడులో బటర్ ఫ్లై పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. తమ జిల్లాలో ఆర్నమెంటల్ ఫిషెస్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు
ఆయన తెలిపారు.
రాయలసీమ జిల్లాలు
రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు
నీరందిస్తామని మంత్రి ఉమ చెప్పారు. నవంబర్ లో మడకశిర, హిందూపురానికి, డిసెంబర్ లో
చిత్తూరు జిల్లా కుప్పంకు నీరందిస్తామన్నారు.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాకు తెలుగుగంగ నీరు అందడంలేదని, రైతులు చాలా
బాధపడుతున్నారని మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. అక్కడ మచ్చుమర్రి ఉందని, నీరందించి
ఆయకట్టుని కాపాడతామని మంత్రి ఉమ చెప్పారు. ఈ నెల 30న తాను కడప, కర్నూలు వస్తున్నట్లు
చెప్పారు.
కర్నూలు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టి శిశు మరణాలను
గణనీయంగా తగ్గించినట్లు ఆ జిల్లా కలెక్టర్ కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. బాలింతల
ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల మంచి
ఫలితాలు కనిస్తున్నట్లు చెప్పారు.
కడప జిల్లా
ఈ ఏడాది గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కడప
జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ చెప్పారు. అక్కడ రోప్ వే కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన
తెలిపారు. ఉత్సవాలు నిర్వహించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు.
అనంతపురం జిల్లా
ఈ ఏడాది పెనుకొండ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు
అనంతపురం జిల్లా కలెక్టర్ వీర పాండియన్ చెప్పారు. బాగా నిర్వహించండని ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు.
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లాకు శిల్పారామం కేటాయించమని పర్యాటక శాఖ
అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకు తగిన స్థలం
కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్ ప్రద్యమ్నను సీఎం ఆదేశించారు.
విజయనగరం జిల్లా
తుఫానుకు కూలిపోయిన చింతచెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు
నాటాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నట్లు
విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ చెప్పారు. అక్కడ వెంటనే మొక్కలు
నాటమని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
v ఆర్నమెంటల్
ఫిషెస్ పై ఫిషరీస్ శాఖ రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆవిష్కరించారు.
No comments:
Post a Comment