మంత్రి ఆనందబాబు అభినందనలు
సచివాలయం, జనవరి 29: ఆఫ్రికా ఖండంలోని
అతిఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల
విద్యార్థులను సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు అభినందించారు. సచివాలయం
3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో సోమవారం మధ్యాహ్నం మంత్రి ఆ
విద్యార్థినీ, విద్యార్థులను, వారి కోచ్ లను శాలువాలు, పూలమాలలో సత్కరించి,
సర్టిఫికెట్లు అందజేశారు. పది మంది విద్యార్థినులు ఎస్.శిరీష, కె.రమ్యశ్రీ,
బి.ఇందిరాబాయి, వై.కవిత, సీ.పద్మావతి, కె.మహాలక్షి, జీ.హేమలత, బి.సునీత,
కె.అమ్ములు, ఎం.సీ.మహాలక్ష్మి, అయిదుగురు విద్యార్థులు డి.లక్ష్మణ్, బి.రమేష్,
వి.శ్రీకాంత్, డి.కృష్ణ కుమార్, బి.సురేష్ మొత్తం 15 మంది ఆఫ్రికా ఖండం టాంజానియా దేశంలోని 19,341 అడుగుల
కిలిమంజారో పర్వత శిఖరం అధిరోహించి ఈ నెల 26న భారత గణతంత్ర దినోత్సవం రోజు 1350
అడుగుల జాతీయ పతాకాన్ని ఎరుగవేశారు. అంతేకాకుండా గౌరవ సూచకంగా డాక్టర్ బీఆర్
అంబేద్కర్, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి
ఆనందబాబు, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల జెండా చిత్రపటాలను అక్కడ ఉంచారు. విద్యార్థులకు శేఖర్ బాబు, పరమేష్ కుమార్,
రఘునాద్ లు కోచ్ లుగా శిక్షణ ఇచ్చారు. కోచ్ రఘునంద్ టీమ్ లీడర్ గా, నీలిమ గైడ్ గా
వ్యవహరించి వారిని కిలిమంజారో పర్వత శిఖరం వరకు తీసుకువెళ్లి తీసుకువచ్చారు.
ఈ
సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తమ గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులోనే
కాకుండా అనేక సాహస కార్యక్రమాలలో పాల్గొంటూ విజయశిఖరాలను అధిరోహిస్తున్నందుకు తనకు
సంతోషంగా ఉందన్నారు. తమ విద్యార్థులు కూచిపూడి నృత్యంలో, కోలాటంలో, మేరాథన్ లో
గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారని, 9 మంది విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం
అధిరోహించారని గుర్తు చేశారు. తమ విద్యార్థులు అందరూ మట్టిలో మాణిక్యాలన్నారు. ఈ విద్యార్థులు
కిలిమంజారో శిఖరంపైన ప్రపంచంలోనే అత్యంత నిడివి గల 1350 అడుగుల జాతీయ పతాకాన్ని
ఎరుగవేశారని తెలిపారు. గతంలో తెలంగాణ విద్యార్థులు 600 అడుగుల పతాకాన్ని
ఎగురవేశారని చెప్పారు. ఇటువంటి సాహస కార్యక్రమాలకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్న
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీ కార్యదర్శి కల్నల్ వి.రాములు, కోచ్ లను
మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
No comments:
Post a Comment