సచివాలయం, జనవరి 17: ఈ నెల 17వ తేదీన జరగవలసిన మంత్రి మండలి సమావేశం 20వ
తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు వాయిదాపడినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్
మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య
కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమ
నిబంధనలను అనుసరించి సమయానికి ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కోరారు.
No comments:
Post a Comment