సముద్రతీర ప్రాంత రక్షణ కమిటీ
సమావేశంలో సీఎస్
రాష్ట్రంలో 974
కిలో మీటర్ల తీర ప్రాంతంలో 9 జిల్లాలు, 64 మండలాలు, మొత్తం 21 తీరప్రాంత రక్షణ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లు,
వాటిలో ఒక్క స్టేషన్ కు మాత్రమే సొంత భవనంలేదని,
19 స్టేషన్లకు కాంపౌండ్
వాల్స్ నిర్మించివలసి ఉందని అధికారులు వివరించారు. పోలీస్ స్టేషన్ల పరిధిని నిర్ణయించవలసి ఉందని
చెప్పారు. ఏపీ మెరైన్ బోర్డు బిల్-2017ని కేంద్రానికి పంపినట్లు తెలిపారు.
హోం శాఖ గత నవంబర్ లో రూపొందించిన జీఓ ప్రకారం జిల్లా
స్థాయి తీరప్రాంత రక్షణ కమిటీలను జిల్లా
కలెక్టర్లు ఏర్పాటు చేస్తారన్నారు. తీర ప్రాంత రక్షణ పథకం ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వం 7 జట్టీల నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 350 నోటిఫైడ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాట్లు తెలిపారు. బోట్ లకు కలర్ కోట్ ఉంటే ఏరియల్ సర్వే తేలికవుతుందని
చెప్పారు. మొత్తం 33,275 బోట్లలో 32,931 బోట్లకు సంబంధించి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీజీపీ ఎం.మాలకొండయ్య, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, విశాఖ పోర్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణ బాబు, కోస్ట్ గార్డ్ కమాండెంట్ ఎస్.ఎస్.సింగ్, ఫిషరీస్ శాఖ డైరెక్టర్ కె.ప్రవీణ్, కెప్టెన్ కె.శ్రీధర్మ, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుధ కోకా, డాక్టర్ బాలకృష్ణన్, కె.గణేశన్, ఏబీవీ శాయి శ్రీనివాస రావు, ఏఎస్ ఖాన్ తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment