వచ్చే బడ్జెట్ లో 7 అంశాలకు ప్రాధాన్యత
2019-20 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి యనమల సమావేశం
v పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి,
ఆర్థిక అసమానతల తొలగింపు, రైతుల
v సంక్షేమం, యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి,
మహిళాభ్యున్నతి
v సామాన్యులపై భారం పడకుండా ఆదాయం పెంపు యోచన
v నగదు నిర్వహణలో నూతన పద్దతుల ద్వారా రూ.వందల కోట్లు ఆదా
సచివాలయం, డిసెంబర్ 5: వచ్చే
ఏడాది బడ్జెట్ లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ రూపొందించాలని ఆర్థిక
మంత్రి యనమల రామకృష్ణుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో బుధవారం ఉదయం 2019-20 బడ్జెట్
రూపకల్పనపై జరిగిన సమావేశంలో మంత్రి కొన్ని అంశాలను నిర్ధేశించారు. బడ్జెట్
తయారీకి సంబంధించి, ప్రాధాన్యతా రంగాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి,
ఆర్థిక అసమానతల తొలగింపు, రైతుల సంక్షేమం,
యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మహిళాభ్యున్నతిని దృష్టిలోపెట్టుకుని బడ్జెట్ రూపొందించాలని మంత్రి
చెప్పారు. సామాన్యులపై భారం పడకుండా ఆదాయ మార్గాల పెంచేయోచన చేయాలన్నారు. పూర్తి
బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చించారు. ఈ ఏడాది
ఇప్పటి వరకు ఆదాయ వ్యయాలను సమీక్షించారు. టాక్స్ రెవెన్యూ, నాన్
టాక్స్ రెవెన్యూ, నగదు నిర్వహణ, నగదు
సర్దుబాట్లు, వడ్డీ చెల్లింపులు, పెట్టుబడి
నిల్వలు, ఇరిగేషన్ బకాయిలు, వివిధ
నియోజకవర్గాల్లో పరిపాలనా అనుమతులు, ఆర్థిక వృద్ధి రేటు
పెరుగుదల, సీఎఫ్ఎంఎస్ తదితర అంశాలను చర్చించారు. నగదు
నిర్వహణలో
కొత్త పద్దతులు, సమర్థ
నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వందల కోట్లు ఆదా చేసినట్లు అధికారులు మంత్రికి
వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర,
కార్యదర్శి పియూష్ కుమార్, ప్రత్యేక
కార్యదర్శి కెవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment