ఆదాయ లక్ష్యాలు సాధించండి
వివిధ శాఖల అధికారులకు మంత్రి యనమల ఆదేశాలు
సచివాలయం, డిసెంబర్ 5: ఆదాయంలో లక్ష్యాలు
సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించమని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖల
అధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జరిగిన వివిధ శాఖాధిపతుల
సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ శాఖలో వినియోగదారులకు సౌకర్యంగా
ఉండేవిధంగా చలానాల ద్వారా చెల్లింపు
నిబంధనలు సులభతరం చేయాలని మంత్రి ఆదేశిచారు.
రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్,
రిజిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్ట్, అటవీ శాఖల ఆదాయ వృద్ధి రేటు పెరుగుదలను
సమీక్షించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులు, రిజిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్ట్ శాఖల ఆదాయం ఆశాజనకంగా ఉండగా, మైనింగ్,
అటవీ శాఖల ఆదాయం వృద్ధి రేటు తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం
పుంజుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. గుంటూరు, అనంతపురం
జిల్లాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. జీఎస్టీ, మైనింగ్
రాయల్టీ, వనరుల లభ్యత, కోర్టు కేసులు,
పెట్రోలియం ఉత్పత్తులపై రాయల్టీ, పన్నులు, సీఎఫ్ఎంఎస్, ఎర్రచందనం, సామాజిక వనాలు తదితర అంశాలను చర్చించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు, రవాణా శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమారు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఎక్సైజ్ కమిషనర్ డాక్టర్ లక్ష్మీ
నరసింహ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment