ఎమ్మెల్సీగా గాలి సరస్వతి ప్రమాణస్వీకారం
సచివాలయం, జూన్ 25: గాలి ముద్దు
కృష్ణమ నాయుడు భార్య గాలి సరస్వతి సోమవారం ఉదయం శాసనసభా భవనంలోని బీఏసీ సమావేశ
మందిరంలో శాసనమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ ఫరూక్
ఆమె చేత ప్రమాణం చేయించారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు
కృష్ణమనాయుడు మృతితో ఖాళీ అయిన స్థానంలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతికి, కార్యకర్తల సంక్షేమానికి
కృషి చేస్తానని చెప్పారు. తన భర్త అడుగుజాడల్లో నడిచి పేద, బలహీనవర్గాల
అభివృద్ధికి పాటుపడతానన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడుకు ఆమె కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల
శాఖ మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ ముద్దుకృష్ణమనాయుడిలా పని చేసి
పేరుతెచ్చుకోవలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న,
దొరబాబు, శాసనసభ్యురాలు సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment