చంద్రబాబు పాలన మైనార్టీలకు
స్వర్ణయుగం
మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్
చైర్మన్ హిదాయత్
· మైనార్టీల ఆత్మీయ
బంధువు చంద్రబాబు
సచివాలయం, జూన్ 20 : ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పాలన మైనార్టీలకు స్వర్ణయుగం అని మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్
చైర్మన్ ఎండి హిదాయత్ వర్ణించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం
మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత రెవెన్యూ లోటు
ఉన్నప్పటికీ ఆ ప్రభావం మైనార్టీలపై పడకుండా వారికి సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్నారన్నారు. గడచిన 4 ఏళ్లలో మైనార్టీలకు రూ.2480 కోట్లు ఖర్చు చేసినట్లు
తెలిపారు. 2018-19లో రూ.1106 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన
చూస్తే దేశంలో ఏ రాష్ట్రం ఇన్ని నిధులు కేటాయించలేదన్నారు. అందువల్ల చంద్రబాబు
నాయుడుని మైనార్టీలు ఆత్మీయ బంధువుగా భావిస్తారని పేర్కొన్నారు. మైనార్టీలకు అనేక
పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దుల్హన్ పథకం, రోషిణి పథకం, దుకాణ్-మకాన్ పథకం, ఇమామ్ లకు
గౌరవ వేతనం, స్కాలర్ షిప్ పథకం వంటివి అందజేస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్య కోసం ప్రస్తుతం ఇచ్చే రూ.10లక్షలను
రూ.15 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అందువల్ల మైనార్టీలు అందరూ సీఎంకు అండగా
ఉంటారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏకగ్రీవంగా మద్దతు పలుకుతామన్నారు. రాజకీయంగా
అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ప్రధానిని నిర్ణయించే స్థాయిలో ఉంటారని చెప్పారు. ఆయన
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారన్నారు. మైనార్టీ సమాజం సీఎంకు
అండగా ఉండాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలో ఉన్నత స్థానంలో
ఉందని హిదాయత్ అన్నారు.
No comments:
Post a Comment