Jun 25, 2018


11వ పీఆర్సీ కార్యదర్శిగా పాపారావు నియామకం

                 సచివాలయం, జూన్ 25: 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) కార్యదర్శిగా కెవిఎస్ కెఎస్  పాపారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీకి సహకరించేందుకు ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి కలిగిన కార్యదర్శితోపాటు ఇతర సిబ్బందిని మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి పాపారావుతోపాటు అధికారులు, సిబ్బంది  పీఆర్సీతోపాటు ఆర్థిక శాఖలోని ఇతర అంశాలకు సంబంధించిన పనులను కేటాయించినట్లు ఆయన వివరించారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...