11వ పీఆర్సీ కార్యదర్శిగా పాపారావు నియామకం
సచివాలయం, జూన్ 25: 11వ పే రివిజన్
కమిషన్ (పీఆర్సీ) కార్యదర్శిగా కెవిఎస్ కెఎస్ పాపారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. పీఆర్సీకి సహకరించేందుకు ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి కలిగిన
కార్యదర్శితోపాటు ఇతర సిబ్బందిని మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
ముద్దాడ రవిచంద్ర ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి
పాపారావుతోపాటు అధికారులు, సిబ్బంది పీఆర్సీతోపాటు
ఆర్థిక శాఖలోని ఇతర అంశాలకు సంబంధించిన పనులను కేటాయించినట్లు ఆయన వివరించారు.
No comments:
Post a Comment