Jun 26, 2018


దళితుల దశ, దిశ మార్చిన చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యుడు దేవతోటి

            
   సచివాలయం, జూన్ 26: దళితుల దశ, దిశ మార్చింది ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యుడు దేవతోటి నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ పున్నయ్య చౌదరి సూచనలను కూడా ఆయన అమలు చేశారన్నారు. వైఎస్ హయాంలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పులివెందుల, ఇడుపులపాయ, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వినియోగించారని తెలిపారు. గత ప్రభుత్వం 2007 నుంచి 2014 వరకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ ని నియమించలేదని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ నేత మద్దతు పలుకుతూ దళిత హక్కులను కాలరాయడానికి పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ ఎస్సీలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇన్నొవా కార్లు, ట్రాక్టర్లు, భూమి కొనుగోలు పథకం, చంద్రన్న పెళ్లి కానుక, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం వంటి పథకాలు దళితుల అభ్యున్నతికి  కొనసాగిస్తున్నారని వివరించారు. నవ్యాంధ్ర నిర్మాణంలో దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో దళిత నాయకులు, మేథావులతో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోనే ఈ నెల 30న నెల్లూరులో ‘దళిత తేజం - తెలుగుదేశం పార్టీ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత మేథావులు, కవులు, కళాకారులు, రచయితలు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని దేవతోటి కోరారు.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...