సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
దేవాలయ కేశఖండన కార్మికుల జేఏసీ
సచివాలయం, జూన్ 25: తమ సమస్యల పట్ల ప్రభుత్వం
సానుకూలంగా స్పందించిందని దేవాలయ కేశఖండన కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ)
గౌరవాధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లో సోమవారం
సాయంత్రం వారు మీడియాతో మాట్లాడారు. కనీస వేతనాల కోసం తాము జూన్ 1 నుంచి ఆదోళన
చేస్తున్నట్ల తెలిపారు. 15వ తేదీ నుంచి కత్తి డౌన్ కార్యక్రమం మొదలు పెట్టినట్లు
చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రెండవసారి
మాట్లాడినప్పుడు తమ సమస్యలను పరిష్కరిస్తామని, సమస్యలను అధ్యయనం చేయడానికి
ఎమ్మెల్సీ జనార్ధన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ రోజు జనార్ధన్ తమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శి
ఎం.గిరిజా శంకర్ వద్దకు తీసుకువెళ్లారని చెప్పారు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు
జరిగినట్లు తెలిపారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
8 ఆలయాల్లో మిగులు ఆదాయం ఉంటుందని, ఆ దేవాలయాల్లో తమని ఉద్యోగులుగా గుర్తించి
కనీసం రూ.15వేలు వేతనం ఇవ్వమని కోరుతున్నట్లు తెలిపారు. కనీస వేతనాలు ఇస్తే ఈఎస్ఐ,
ఈపీఎఫ్ వస్తాయని చెప్పారు. తమ సమస్యలన్నీ గిరిజా
శంకర్ విన్నారని చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ సెలవులో ఉన్నారని, ఆమె రాగానే
మళ్లీ మరోసారి చర్చలకు పిలుస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం సానుకూలంగా
స్పందించినందున తాము ఆదోళన విరమించినట్లు తెలిపారు. నాయీ బ్రాహ్మణ సంఘాలు
చేస్తున్న ఆందోళనకు, తమకు సంబంధంలేదని బ్రహ్మయ్య స్పష్టం చేశారు. ఈ రోజు గిరిజా
శంకర్ ని కలిసినవారిలో దేవాలయ కేశఖండన కార్మికుల జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి
రామదాసు, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment