Jun 21, 2018


ఆరోగ్యకరమైన సమాజానికి యోగా తప్పనిసరి

ఏపీ ప్రత్యేక రక్షణదళ డీఐజీ ఏసురత్నం
సచివాలయం, జూన్ 21: ఆరోగ్యకరమైన సమాజానికి యోగా తప్పనిసరని ఏపీ ప్రత్యేక రక్షణదళ డీఐజీ సీహెచ్. ఏసురత్నం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్ వద్ద గురువారం ఉదయం  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.కృష్ణమూర్తి, 300 మంది ఏపీ  ఎస్పీఎఫ్ సిబ్బందితో కలసి ఆయన యోగాసనాలు, ద్యానముద్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఒక గంట అయినా యోగా చేస్తే మంచిదన్నారు. నేటి యాత్రిక జీవనంలో శారీరక శ్రమ తగ్గిపోయి చాలా మంది ఆరోగ్యం కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి రోజూ యోగా చేస్తే మానసిక ప్రశాంతత పొందగలుగుతామన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...