భారీ స్థాయిలో ఉచిత రేడియోలజీ
సేవలు
Ø
మారుమూల ప్రాంతాలకూ ప్రత్యేక సేవలు
Ø
10 లక్షల మందికి ప్రయోజనం
సచివాలయం, జూన్ 6: ఎన్టీఆర్
వైద్య పరిషత్ కార్యక్రమం కింద రాష్ట్రంలో మారు మూల ప్రాంతాలకు కూడా ఉచిత రేడియాలజీ
సేవలు భారీ స్థాయిలో అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో
తెలిపింది. దేశంలో ప్రజలు, డాక్లర్ల నిష్పత్తి తక్కువ అని, ఉన్న డాక్టర్లలో కూడా
స్సెషలిస్టులు నగర ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటారని ఆ ప్రకటనలో
పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 8 జిల్లా
ఆస్సత్రులు, 31 ప్రాంతీయ ఆస్పత్రులు, 132 గ్రామీణ ఆస్పత్రులలో ఎక్స్ రే యూనిట్లు
అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అయితే కార్డియాలజిస్ట్ లు తక్కువగా ఉన్నట్లు
పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ డైయాగ్నస్టిక్ సెంటర్లకు వెళుతున్నారని,
అందువల్ల వారికి వ్యయం ఎక్కువగా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలను
దృష్టిలోపెట్టుకొని తమ ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ కార్యక్రమం కింద ఉచిత
రేడియాలజీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా
అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన కేంద్రం నుంచి రేడియాలజీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ
నుంచి మారుమూల ప్రాంతాలకు ఈ సేవలు అందిస్తారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఎక్స్
రే ఫిల్మ్, డయాగ్నైజ్ నివేదికను ఆ కేంద్రానికి పంపుతారు. అక్కడ ఉండే నిపుణులైన
రేడియాలజిస్ట్ లు ఎక్స్ రేని పరిశీలించి
సవివరమైన నివేదిక రూపొందిస్తారు. దానిని తిరిగి ఆయా ఆస్పత్రులకు పంపుతారు. రాష్ట్ర
వ్యాప్తంగా ఉన్న జిల్లా, ప్రాంతీయ, గ్రామీణ ఆస్పత్రులలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్,
ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీప) పద్దతిలో
అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం కింద అన్ని వివరాలు రియల్ టైమ్
విధానంలో సమన్వయం చేస్తుంటారు. అన్ని వివరాలు సీఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో
ఉంటాయి. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10,61,572 ఎక్స్ రేలు
తీసినట్లు, పది లక్షల మంది రోగులు ప్రయోజనం పొందినట్లు వివరించారు. ఈ కార్యక్రమం
ద్వారా రోగులకు ఖర్చు తగ్గడమే కాకుండా వారికి సమయం కూడా కలిసి వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం కింద మార్చి నెలలో 45,973 మంది ప్రయోజనం పొందినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment