మంత్రి నారాయణ
Ø 4 జోన్లుగా విభజన
Ø వచ్చే సంక్రాంతికి పూర్తి
సచివాలయం, జూలై 19: నూతన రాజధాని అమరావతిలో అన్ని హంగులతో అత్యాధునికంగా శాఖమూరు పార్కును
రూపొందించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం
ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్
కార్పొరేషన్ (ఏడీసీ) అధికారులతో బుధవారం మధ్యాహ్నం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారాంతపు సమీక్ష సమావేశం ముగిసిన తరువాత ఆ
వివరాలను మంత్రి మీడియాకు తెలిపారు. అహ్మదాబాద్కు చెందిన హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్ మెట్ సంస్థ శాఖమూరు పార్కు డిజైన్ ను రూపొంది ఇచ్చినట్లు తెలిపారు. 241 ఎకరాలలో ఏర్పాటు చేసే ఈ పార్కుని ప్రధానంగా
నాలుగు జోన్లుగా విభజించినట్లు చెప్పారు. మొదటి జోన్ 85 ఎకరాలు, రెండవ జోన్ 34 ఎకరాలు, మూడవ జోన్ 49 ఎకరాలు, నాలుగో జోన్ అంబేద్కర్ పార్కుతో కలిపి 73 ఎకరాలు ఉంటుందని వివరించారు. మొదటి జోన్లో 46 ఎకరాలలో ఏర్పాటు చేసే అమ్యూజ్మెంట్ పార్కులో వాటర్ వరల్డ్ తోపాటు క్రాఫ్ట్ బజార్ ఉంటాయని తెలిపారు. రెండవ జోన్ ను పూర్తిగా
చిల్డ్రన్స్ కు కేటాయించారని, సాహస క్రీడలలు, చిల్డ్రన్ అడ్వెంచర్, అవుట్ డోర్ జిమ్ ఉంటుందని చెప్పారు. మూడవ జోన్లో ఫ్లవర్ గార్డెన్, డక్ పాండ్ ఉంటుందని
తెలిపారు. జోన్ 4లో కల్చరల్ మ్యూజియం, అంబేద్కర్ పార్కు, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్, స్పోర్ట్స్ క్లబ్, 5 స్టార్ హోటల్ వంటివి ఉంటాయని చెప్పారు. ఇక్కడే అంబేద్కర్ విగ్రహం
కూడా ఏర్పాటు చేస్తార్నారు. అన్ని జోన్లలో ఫుడ్
కోర్టులు ఉంటాయని తెలిపారు. త్వరలో పార్కుకు టెండర్లు
పిలుస్తారని, వచ్చే సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేసి ఈ పార్కును ప్రారంభిస్తారని
మంత్రి నారాయణ చెప్పారు. ఈ పార్కుకు ‘గాంధీ మెమోరియల్’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
రాజధానిలో రోడ్ల ప్యాకేజీలు కూడా చివరి దశకు
వచ్చాయని, రోడ్ల నిర్మాణానికి 18 నెలల సమయం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే హోటళ్లు నిర్మించడానికి ఆసక్తి కనపరిచిన వారిని పిలిపించి మాట్లాడినట్లు
చెప్పారు. వారికి కేటాయించే భూమి విలువను ఎకరా మూడు కోట్ల రూపాయలుగా ప్రతిపాదించినట్లు
తెలిపారు. హోటళ్ల ఏర్పాటుకు ఆర్థికంగా సమర్థులను ఎంపికచేయనున్నట్లు మంత్రి చెప్పారు.
No comments:
Post a Comment