Jul 5, 2017

పారిశ్రామిక పార్కులకు మౌలికసదుపాయాల కల్పన


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశం
సచివాలయం, జూలై 5: పరిశ్రమలకు, పారిశ్రామిక పార్కులకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇరిగేషన్, సీఆర్డీఏ, ఏపీఐసీసీ, ఏపీఐడీసీ, దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో  సమీక్షా సమావేశం, 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు
రోడ్లకు, వివిధ పరిశ్రమలకు పరిశ్రమలకు, పారిశ్రామిక పార్కులకు భూముల కేటాయింపు, భూ సేకరణ తదితర అంశలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వడమే కాకుండా రోడ్లు, విద్యుత్, గ్యాస్ పైప్ లైన్లునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. వాటిని కల్పించినాడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, ఆవిధంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారుపరిశ్రమలకు అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని సీఎస్ చెప్పారు.
పరిశ్రమలకు భూ కేటాయింపు, రోడ్లకు భూ సేకరణ వివరాలు అధికారులు సీఎస్ కు వివరించారు. రూ.5,31,992 కోట్ల పెట్టుబడులతో 13,81,883 మందికి ఉపాధి కల్పించే 445 పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఒప్పొందాలు(ఎంఓయు) జరిగినట్లు తెలిపారు. వాటిలో కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించినట్లు, కొన్ని ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు, మరి కొన్ని నిర్మాణ, మిషనరీ బిగింపు దశలో ఉన్నట్లు, ఇంకొన్నిటికి భూములు కేటాయించవలసి ఉందని వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, మైనర్,మీడియం,మేజర్ ఇరిగేష్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు, దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనురాధఏపీఐడీసీ వైస్ చైర్మన్ సిద్ధార్థ జైన్, ఏపీ ఐఐసీ వైస్ చైర్మన్ బాబు., ఏపీ సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...