Jul 10, 2017

సీఆర్డీఏ పరిధిలో పాత లేఅవుట్లకు 25లోపల అనుమతి


మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం

Ø మంత్రి మండలి ఆమోదం తరువాత అమలు
Ø  ఉపసంఘం నిబంధనలు అంగీకరించిన రియల్టర్లు

          సచివాలయం, జూలై 10: ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) పరిధిలోని పాత లేఅవుట్ల సమస్యని మంత్రి మండలి ఉపసంఘం పరిష్కరించింది. మంత్రి మండలి ఉపసంఘం సచివాలయం 2వ బ్లాక్ లో సోమవారం మధ్యాహ్నం  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సీఆర్డీఏ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపరులతో సమావేశమైంది. గతంలో సీఆర్డీఏకు సమర్పించిన 99 లేఅవుట్లను కొన్ని నిబంధనలకు లోబడి అనుమతించాలని ఉపసంఘం నిర్ణయించింది. తమ సిఫారసులను  ఈ నెల 18న జరిగే మంత్రి మండలి సమావేశంలో ఆమోదించిన  తరువాత ఈనెల 25వ తేదీ లోపల అనుమతులు ఇవ్వాలని అధికారులను ఉప సంఘం ఆదేశించించింది.  తమ లేఅవుట్లు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నందున తాము భారీగా నష్టపోయినట్లు రియల్టర్లు తెలిపారు. వాటిని ఆమోదించవలసిందిగా కోరారు. పాత లేఅవుట్లలో మాస్టర్ ప్లాన్ పరిధిలో 29, వెలుపల 77 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ లేఅవుట్లలో ఉపసంఘం నిర్ణయించిన నిబంధనలకు వ్యాపారులు ఆమోదం తెలిపారు. లేఅవుట్లో 40 శాతం స్థలం సీఆర్డీఏకి వదిలివేయడానికి, అవసరమైతే రోడ్ల విస్తరణకు మరికొంత స్థలం కూడా వదలడానికి, రోడ్ల విస్తరణలో కొన్నవారు ప్లాట్లు కోల్పేతే వారికి మరొకచోట్ల ప్లాట్ కేటాయించడానికి రియల్టర్లు అంగీకరించారు. మౌలిక సదుపాయల కల్పన నిమిత్తం నివాస ప్రాంతాలకు 500 మీటర్ల లోపలి లేఅవుట్లకు ఎకరానికి రూ.80 వేల రూపాయలు, అంతకు మించిన దూరంలో ఉంటే మరో 50 శాతం చెల్లించడానికి వారు ఆమోదం తెలిపారు. మంత్రి మండలి ఆమోదం తరువాత వారం రోజుల్లో లేఅవుట్లు మంజూరు చేస్తారని ఉపసంఘం తెలిపింది. దీర్ఘకాలంగా వారి సమస్య పెండింగ్ లో ఉన్నందున, నిబంధనలకు అంగీకరించినందున అధికారులు కూడా నిబంధనల ప్రకారం వారికి లేఅవుట్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, లోకేష్ బాబు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...