Jul 5, 2017

సమాజానికి పునాది ప్రాధమిక విద్య


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
సచివాలయం, జూలై 5: సమాజానికి పునాది ప్రాధమిక విద్య అని, దానిని మెరుగుపరచవలసిన అవసరం ఆ శాఖమై ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అన్నారు. సచివాలయం ఒకటవ బ్లాక్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన పాఠశాల విద్య సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యలేకుండా సమాజం అభివృద్ధి చెందదని, అందువల్ల విద్యా శాఖ చాలా కీలకమైందని, ఆ శాఖ అధికారులు బాధ్యతతో, అంకితభావంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్య పట్ల, ముఖ్యంగా ప్రాధమిక విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారని చెప్పారు. ప్రాధమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాల్లో డ్రాప్ అవుడ్ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ప్రాధమిక విద్యలో మంచి ఫలితాలు సాధించేందుకు, ఉపాధ్యాయుల బోధన మెరుగుపరిచేందుకు, ఉన్నత విద్యను అందించేందు శాస్త్రీయ పద్దతిలో  నెలవారీగా ఆచరణాత్మక ప్రణాళికలు రూపొందించుకొని కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని,  వచ్చే రెండేళ్లలో మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విద్యా కేంద్రంగా విలసిల్లేట్లు చేయాలని సీఎస్ అన్నారు.
ఆధార్ నెంబర్ ఆధారంగా, సాంఘీక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు ఆ తరువాత ఏఏ కోర్సులలలో చేరుతున్నారో పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. వారు రాష్ట్రంలో ఇంజనీరింగ్, వైద్య, ఎంబీఏ వంటి కాలేజీల్లో ఎంత మంది చేరుతున్నారో, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది చేరుతున్నారో, ఎంతమంది  ఉన్నత చదువులకు వెళ్లడంలేదో సమగ్రంగా వివరాలు నమోదు చేయాలన్నారు. జూనియర్ కాలేజీల్లో బోధన మెరుగుపరిచి, మంచి ఫతిలు సాధించాలని ఆదేశించారు.
ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి నాక్, ఎంబిఏ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి ఎన్ బీఏ వంటి సంస్థలు ఉన్నాయని, ఇంటర్మీడియట్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి అటువంటి సంస్థ ఏదీ లేదని, వీటికి గుర్తింపు ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు. మౌలిక వసతులు, ఇతర నిబంధనలు పాటించని 800 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు, 243 కాలేజీల గుర్తింపును రద్దు చేసినట్లు వివరించారు.
విద్యార్థుల ఆధార్ నెంబర్లను వారి పేర్లతో అనుసందానం చేస్తున్నట్లు అధికారుల తెలిపారు. గిరిజనులు, ముస్లింలలో డ్రాప్ అవుట్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు వారు చెప్పారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో గత సంవత్సరం ఎస్ఎస్ సీలో 96 శాతం, ఇంటర్ లో 97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విభాగం అధికారులు తెలిపారు.  ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, ప్రాధమిక విద్యా శాఖ  కమిషనర్‌ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...