Jul 27, 2017

శాసన మండలి సభ్యులుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్ ప్రమాణ స్వీకారం

సచివాలయం, జూలై 26: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా రామ సుబ్బారెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ శాసన మండలి సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఇన్ చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వారిద్దరిచేత ప్రమాణం చేయించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్ లు గవర్నర్ కోటాలో మండలి సభ్యులుగా నియమితులైన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో విద్యుత్ శక్తి శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ఇరిగేషన్ కార్పోరేషన్ డైరెక్టర్ పురుషోత్తమ రెడ్డి, ఏపీ శాసనసభ స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె.సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...