Dec 29, 2019

ఆంద్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రతిపాదన

 కొత్త జిల్లాల వివరాలు


1.అరుకు
కురుపాం
పార్వతీపురం
సాలూరు
మాడుగుల,
అరకు లోయ
పాడేరు
రంపచోడవరం
2. శ్రీకాకుళం
ఇచ్ఛాపురం,
పలాస,
టెక్కలి,
పాతపట్నం,
శ్రీకాకుళం,
ఆముదాలవలస
నరసన్నపేట.
3. విజయనగరం
ఎచ్చెర్ల,
రాజాం
పాలకొండ హ
బొబ్బిలి,
చీపురుపల్లి,
భోగాపురం
విజయనగరం.
4.విశాఖపట్నం
గజపతినగరం,
శృంగవరపుకోట,
భీమిలి,
తూర్పు విశాఖపట్నం,
దక్షిణ విశాఖపట్నం,
ఉత్తర విశాఖపట్నం,
పశ్చిమ విశాఖపట్నం
5. అనకాపల్లి
గాజువాక,
చోడవరం,
అనకాపల్లి,
పెందుర్తి,
ఎలమంచిలి,
పయకరావుపేట
నర్సీపట్నం.
6. కాకినాడ
తుని,
ప్రత్తిపాడు,
పిఠాపురం,
కాకినాడ గ్రామీణ,
పెద్దాపురం,
కాకినాడ సిటీ,
జగ్గంపేట.
7. అమలాపురం
రామచంద్రాపురం,
ముమ్మడివరం,
అమలాపురం
రాజోలు
గన్నవరం
కొత్తపేట,
మండపేట
8. రాజమండ్రి
అనపర్తి,
రాజానగరం,
రాజమండ్రి సిటీ,
రాజమండ్రి గ్రామీణ,
కొవ్వూరు
నిడదవోలు,
గోపాలపురం
9. నరసాపురం
ఆచంట,
పాలకొల్లు,
నర్సాపురం,
భీమవరం,
ఉండి,
తణుకు,
తాడేపల్లిగూడెం.
10. ఏలూరు
ఉంగుటూరు,
దెందులూరు,
ఏలూరు,
పోలవరం
చింతలపూడి
నూజివీడు
కైకలూరు
11. మచిలీపట్టణం
గన్నవరం,
గుడివాడ,
పెడన,
మచిలీపట్నం,
అవనిగడ్డ,
ఉయ్యూరు,
పెనమలూరు
12. విజయవాడ
తిరువూరు
భవానీపురం,
సత్యనారాయణ పురం,
విజయవాడ పడమట,
మైలవరం,
నందిగామ
జగ్గయ్యపేట
13.గుంటూరు
తాడికొండ
మంగళగిరి,
పొన్నూరు,
తెనాలి,
ప్రత్తిపాడు
గుంటూరు ఉత్తర,
గుంటూరు దక్షిణ
14. నరసారావుపేట
పెదకూరపాడు,
చిలకలూరిపేట,
నరసారావుపేట,
సత్తెనపల్లి,
వినుకొండ,
గురజాల,
మాచెర్ల
15.బాపట్ల
వేమూరు
రేపల్లె,
బాపట్ల,
పరుచూరు,
అద్దంకి
చీరాల,
సంతనూతల (ఎస్.సి.)
16.ఒంగోలు
ఎర్రగొండపాలెం,
దర్శి,
ఒంగోలు,
కొండపి
మార్కాపురం,
గిద్దలూరు,
కనిగిరి
17.నంద్యాల
ఆళ్ళగడ్డ,
శ్రీశైలం,
నందికొట్కూరు
కల్లూరు,
నంద్యాల,
బనగానపల్లి,
డోన్
18.కర్నూలు
కర్నూలు,
పత్తికొండ,
కోడుమూరు
యెమ్మిగనూరు,
కౌతలం,
ఆదోని,
ఆలూరు
19.అనంతపురం
రాయదుర్గం,
ఉరవకొండ,
గుంతకల్లు,
తాడిపత్రి,
అనంతపురం,
కళ్యాణదుర్గం,
రాప్తాడు
20.హిందూపూర్
సింగనమల
మడకసిర
హిందూపురం,
పెనుకొండ,
పుట్టపర్తి,
ధర్మవరం,
కదిరి
21.కడప
బద్వేల్
కడప,
పులివెందుల,
కమలాపురం,
జమ్మలమడుగు,
ప్రొద్దుటూరు,
మైదుకూరు
22.నెల్లూరు
కందుకూరు,
కావలి,
ఆత్మకూరు,
కొవ్వూరు,
నెల్లూరు పట్టణ,
నెల్లూరు గ్రామీణ
ఉదయగిరి.
23.తిరుపతి
సర్వేపల్లి,
గూడూరు
సూళ్ళూరుపేట
వెంకటగిరి,
తిరుపతి,
శ్రీకాళహస్తి,
సత్యవేడు
24.రాజంపేట
రాజంపేట
కోడూరు
రాయచోటి
తంబళ్ళపల్లె
పీలేరు
మదనపల్లె
పుంగనూరు
25. చిత్తూరు
చంద్రగిరి,
నగరి,
గంగాధరనెల్లూరు
చిత్తూరు,
పూతలపట్టు
పలమనేరు,
కుప్పం.

Dec 28, 2019

హైపవర్ కమిటీ


v 27.12.2019 : మంత్రి మండలి సమావేశం: రాజధానిపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (జీసీజీ)ల నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే రాజధానిపై ప్రకటన. సీఆర్డీఏ పరిధిలోని అవినీతిపై విచారణకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని సమగ్రమైన దర్యాప్తు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేయించాలని నిర్ణయం. లోకాయుక్త లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ.
v హైపవర్ కమిటీ

29-12-2019 : ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులపై జీఎన్‌రావు కమిటీ, బీసీజీ కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ నియామకం.

కమిటీ సభ్యులు
    బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
    పిల్లి సుభాష్ చంద్రబోస్
    బొత్స సత్యనారాయణ
    మేకపాటి గౌతంరెడ్డి
    ఆదిమూలపు సురేష్
    మేకతోటి సుచరిత
    కురసాల కన్నబాబు
    మోపిదేవి వెంకటరమణ
    కొడాలి నాని
    పేర్ని నాని
    ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు
    డీజీపీ
    ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ
    మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి
    న్యాయశాఖ కార్యదర్శి

Dec 18, 2019

అమరావతిలో అసైన్డ్ భూములు



డిసెంబర్ 11, 2019న జరిగిన మంత్రి మండలి సమావేశంలో అమరావతి రాజధాని పరిధిలో మొత్తం 2,500 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 18, 2019  అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు  ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించారు. కాగా దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్‌ భూములను కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సీఆర్‌డీఏ వీటిని భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ ఫర్‌ యాక్ట్‌ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. అసైన్డ్‌ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే.
 ల్యాండ్‌ పూలింగ్‌ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అసైన్డ్‌ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్‌డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Dec 7, 2019

దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు
           
            మరో వందేళ్లు గడిచినా భారతదేశంలో రిజర్వేషన్లను తొలగించే పరిస్థితి వచ్చే అవకాశం లేదు.  అంటే దేశంలో సామాజిక అసమానతలు తొలగిపోతాయని ఊహించడానికి కూడా అవకాశంలేని విధంగా పరిస్థితులు ఉన్నాయి.  ఆర్థిక అసమానాతలు ఎటూ సాధ్యం కాదు. భారత దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ ఫామ్ అనే స్వచ్చంద సంస్ధ నివేదిక ప్రకారం 2016 నాటికి ఆర్థికంగా అత్యంత ఉన్నత స్ధానంలో ఉన్న(బిలియనీర్లు) ఒక శాతం సంపన్నుల చేతుల్లో దేశానికి చెందిన మొత్తం సంపదలో 58 శాతం పేరుకుపోయింది. ఆర్థికంగా దిగువ స్థాయి నుంచి ఉన్న 70 శాతం మందికి చెందిన సంపదకు ఇది సమానం. కేవలం 84 మంది బిలియనీర్ల వద్ద దాదాపు రూ.17,36,000 కోట్ల విలువైన సంపద ఉంది. బిలియనీర్ల సంఖ్య 2017లో 101కి పెరిగింది. బిలియనీర్లు పెరుగుతున్నారంటే ఆర్థిక వ్యవస్థ బలపడినట్లు కాదు. సంపద అతి కొద్దిమంది వద్దకే చేరుతోంది. ఆక్స్‌ ఫాం సర్వే ప్రకారం 2017లో దేశంలోని 73 శాతం సంపద ఒక్క శాతం మంది అత్యంత ధనవంతుల వద్దకు చేరింది. దేశంలోని దాదాపు సగం అంటే 67 కోట్ల మంది సంపద ఒక్క శాతం మాత్రమే పెరిగింది. దేశ ఆదాయం పెరుగుతోంది. కాని పేదల సంఖ్య పెద్దగా తగ్గడంలేదు.  ఆర్థిక అసమానాతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాజిక పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. కులాల మధ్య సామాజిక అసమానతలు కనీసం తగ్గుతాయన్న  నమ్మకం కూడా కలగడంలేదు. అంత బలీయంగా భారత సమాజంలో  కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. కుల వివక్ష విలయం తాండవం చేస్తోంది. భారత రాజ్యంగ నిర్మాతలలో కీలకమైన మహోన్నత వ్యక్తి అంబేద్కర్, రాజ్యంగ సభ సభ్యుడు నాగప్ప వంటి వారు రాజ్యాంగంలో రిజర్వేషన్ల కోసం పొందుపరిచిన పదేళ్ల సమయం సరిపోదని ఆనాడే భావించారు. అయితే మరో పదేళ్లలో అంటే 20 ఏళ్లలో సమాజం మారిపోతుందని, సమ సమాజం ఏర్పడుతుందని వారు అనుకొని ఉండవచ్చు. ఇన్నేళ్లైనా వీసమంత మార్పు కూడా రాదని వారు ఊహించి ఉండరు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా ఇంకా  రిజర్వేషన్లు కొనసాగించవలసిన పరిస్థితులే ఉన్నాయి. పార్లమెంటు, శాసన సభల్లో షెడ్యూల్డు కులాలు, తెగల రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించాలన్న ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన  డిసెంబర్ 4, 2019న జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ఆమోదించింది. పొడిగించుకుంటూవచ్చిన రిజర్వేజన్ల కాల పరిమితి 2020 జనవరి 25తో ముగుస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పార్లమెంటులో ఎస్సీలు 84 మంది, ఎస్టీలు 47 మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల శాసన సభల్లో 614 ఎస్సీ సభ్యులు, 554 మంది గిరిజనులు ఉన్నారు. ఈ సమాజంలో ఇంకా వారికి రిజర్వేషన్ల అవసరం ఉందని భావించిన మంత్రి మండలి 2030, జనవరి 25 వరకు పొడిగించాలని నిర్ణయించింది.  కుల వ్యవస్థలో సామాజిక మార్పు రవ్వంత కూడా రాలేదు. పైగా ఆయా కులాల వారు రిజర్వేషన్ ఫలితాలను సంపూర్ణంగా పొందలేకపోతున్నారు.
              దేశంలోని  ఐఐఎంలలో అధ్యాపకుల  నియామకాలలో సామాజిక న్యాయం ఎంతవరకు పాటిస్తున్నారనే అంశంపై ఐఐఎం పూర్వ విద్యార్థులు కొందరు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించారు.  ఆ సమాచారం ద్వారా ఐఐఎంలలో దాదాపు 97 శాతం మంది శాశ్వత సిబ్బంది ఒకే కులానికి చెందినవాళ్లు ఉన్నారని తేలింది.  దేశ జనాభాలో ఆ కులం వాళ్లు కేవలం 5 లేదా 6 శాతం మంది మాత్రమే ఉంటారు.  వారి అధ్యయనం ప్రకారం దేశంలోని 13 ఐఐఎంలలోని 642 సిబ్బందిలో ఒకరు ఎస్టీ, నలుగురు ఎస్సీలు కాగా, బీసీలు 17 మంది మాత్రమే ఉన్నారు. దేశంలోని మొత్తం 20 ఐఐఎంలలో 90 శాతం మంది ఫ్యాకల్టీ సభ్యులు జనరల్ కేటగిరీ వారే ఉన్నట్లు మరో పరిశీలనలో తేలింది. మన రాష్ట్రంలో  ఏపీపీఎస్సీ కూడా ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదు. ఈ విషయంలో బీసీ సంఘాల వారు ఆందోళనలు చేస్తున్నారు. బీసీ కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.  కొంతమంది ఆదిపత్యం చలాయించడం వల్ల  వారు నష్టపోతున్నారు.  తమకు రిజర్వేషన్ కావాలనే కులాలు, మతాలు పుట్టుకొస్తున్నాయి. అంటే దేశంలో సామాజిక పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
            రాజ్యాంగ నిపుణులకు కూడా అందనంత పటిష్టంగా, బలంగా కుల వ్యవస్థ, వివక్ష ఈ సమాజంలో పాతుకుపోయాయి. సామాజికంగా కుల వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి, సామాజిక అసమానతలు తొలగించడానికి  ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడంలేదు. రాజకీయంగా కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. మరో పదేళ్లు, మరో పదేళ్లు పొడిగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యవస్థలో ఎందుకు మార్పు రావడంలేదో తెలుసుకోవడానికి గానీ, మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలు గాని జరగడంలేదు. రాజకీయ లబ్ది కోసం  కాలపరిమితిని పొడిగించుకుంటూ వస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మన దేశంలో అమలు జరిగే రిజర్వేషన్లలో ప్రధానంగా  మూడు రకాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ రిజర్వేషన్ (రిజర్వ్‌ డ్ నియోజకవర్గాలు), రెండు చదువులు, మూడు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 334 ప్రకారం రాజకీయ రిజర్వేషన్‌కు మాత్రమే పదేళ్ల కాల పరిమితి ఉంది. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోసం రాజ్యాంగం ఎలాంటి కాలపరిమితిని విధించలేదు. రాజ్యాంగ నిపుణులు భారతీయ వ్యవస్థ మూలాలను ఔపోసన పట్టి ఉంటారు. అందువల్లే వాటికి కాలపరిమితి విధించ ఉండరు. రాజకీయ రిజర్వేషన్లను ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా అమలు చేస్తోంది.  విద్యా, ఉద్యోగాలలో  మాత్రం వారు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతోంది.  అక్కడ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడంలేదు. వాటిని సరైన రీతిలో అమలు చేయించుకోగలిగిన స్థితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు లేరు.  తమకు రావలసిన వాటిని రిజర్వేషన్ వర్గాల వారు కొట్టుకుపోతున్నారన్న భావనతో అగ్ర కుల యువత ఉంటోంది. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వారు సామాజిక వివక్ష, కటిక దారిద్య్రం అనుభవించారని, ఈ ఆధునిక యుగంలో కూడా వారు ఇంకా అదే రీతిలో జీవిస్తున్నారన్న విషయం వారికి విడమరిచి చెప్పేవారు లేరు. ప్రభుత్వంలో మాత్రమే రాజ్యాంగం కల్పించిన ఈ రిజర్వేషన్ల ద్వారా వారు లబ్ది పొందుతున్నారు. ప్రైవేటు రంగంలో వ్యాపారాలు, ఉద్యోగాలు 95 శాతానికి పైగా అగ్ర కులాల వారే ఆక్రమించారు. ఇక్కడ వారి ప్రావీణ్యతను, నైపుణ్యాన్ని, మేథో సంపదని కించపరచడంలేదు. వేల సంవత్సరాలు అణచివేతకు గురైన వర్గాల వారు వారీతో సమానంగా ప్రావీణ్యతను, నైపుణ్యాన్ని, మేథో సంపదని పొందే స్థితిలో లేరని, సామాజిక వివక్ష తొలగిపోలేదని, ఆర్థికంగా వారు బలహీనులని  తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక, సామాజిక అసమానతలు  పెరగడం ప్రమాదకరం.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914