Jul 5, 2026

ఆంధ్రజ్యోతి పరివారం -1

ఆంధ్రజ్యోతితో నా అనుబంధం 42 ఏళ్ల నాటిది

 
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే రోజుల్లో నేను రాసిన మొట్టమొదటి ఎడిటోరియల్ పేజీ ఆర్టికల్ 1984లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అప్పట్లో దానికి పారితోషికంగా రూ.50లు ఎంఓ చేశారు. నేను రాసిన ఆర్టికల్ కి ఎడిటర్ నండూరి రామమోహన్ రావు గారే హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి విశాఖలో చేరడానికి ముందు చేసిన ఇంటర్వ్యూలో, నేను ఆ ఆర్టికల్ చూపించాను. ఆ హెడ్డింగ్ తానే పెట్టినట్లు చెప్పి, ఆరోజు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆప్పటి నుంచి తరచూ నా ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో వస్తూనే ఉన్నాయి. 1991-95 కాలంలో దాదాపు 5 ఏళ్లు విశాఖ-ఆంధ్రజ్యోతిలో పని చేశాను. ఎక్కువ కాలం  సిటీ డెస్క్ ఇన్ చార్జిగా చేశాను. విశాఖలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ కరోనా సమయంలో రెండున్నరేళ్లు ఆంధ్రజ్యోతి హైదరాబాద్ సెంట్రల్ డెస్క్ లో చీఫ్ సబ్ ఎడిటర్ గా చేశాను.

No comments:

Post a Comment

తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త రాధాకృష్ణ

నేడు ప్రొఫెసర్ రావు వర్ధంతి తెలుగువారు గర్వించతగ్గ ప్రఖ్యాత భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణా రావు.  మన దేశంలో 60 ఏళ్ల...