డిసెంబర్ 11, 2019న జరిగిన మంత్రి మండలి సమావేశంలో అమరావతి రాజధాని పరిధిలో
మొత్తం 2,500 ఎకరాల అసైన్డ్
భూముల కొనుగోళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 18, 2019న అసైన్డ్ భూములు
కొనుగోలు చేసిన వారికి సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ
కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ
చేశారు.
రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు
విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏ
కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్
చట్టం 2015 ప్రకారం రాజధాని
నిర్మాణానికి భూములు సమీకరించారు. కాగా దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్ భూములను కొందరు రాజకీయ
నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సీఆర్డీఏ
వీటిని భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్ భూములను కొనుగోలు
చేయడం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. అసైన్డ్ భూములు సేకరించి బదులుగా
వారికి ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే.
No comments:
Post a Comment