Feb 10, 2020

భూములు అభివృద్ధిపై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

 రాజధాని కోసం భూ సమీకరణ కింద తమ భూముల్ని స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒప్పందం ప్రకారం తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని, అయితే ఇప్పటి వరకు అది కార్యాచరణ దాల్చనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాజధానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 7 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదిస్తూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యకార్యక్రమాలను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. తమ వద్ద తీసుకున్న భూమిని ప్రభుత్వం ఇతరులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టిందని, దీనిని అడ్డుకోవాలన్నారు. సీఆర్‌డీఏ తరఫున న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి గడువు కావాలని కోరగా న్యాయమూర్తి.. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...