Feb 25, 2020

అమరావతి అంగుళం కదలదు: స్వామి కమలానంద భారతి


v ‘‘పార్లమెంటు నుంచి మట్టి, నీరు వచ్చింది. అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదు’’ మందడం, వెలగపూడి రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి గ్రామాల్లో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో ఆయన  పాల్గొని రైతులు, రైతు కూలీలకు సంఘీభావం తెలిపారు. ప్రధాని మోదీ పార్లమెంటు నుంచి నీరు, మట్టి తెచ్చారు. ఆయనే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీల గురించి మాకు అవసరంలేదు. మేం సమాజం గురించే మాట్లాడతాం. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల ప్రజలు కోరుతున్నారు. దేశానికి రెండో రాజధాని అవుతుందనుకుంటే, అలా జరుగుతుందా అని కళ్లు కుట్టి అమరావతి ఇలా అయ్యింది. లాఠీతో కొట్టి, పోలీసులు ఇంటికెళ్లి బాధపడతారు. వారూ మనుషులే, డ్యూటీలో పైవారు చెప్పినట్టు నడుచుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు ఆ పాపం తొలగిపోవటానికి హోమాలు చేసుకుంటున్నారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...