Apr 3, 2018

03.04.2018 మంగళవారం – శాసనసభ మీడియా పాయింట్



వినుకొండ MLA GV ఆంజనేయులు.
AP కి జరిగిన అన్యాయాన్ని దేశంలోని అన్ని పార్టీలకు తెలియ చేసేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు.
దీనితో BJP, జగన్ లకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అపర చాణక్యుడు ఢిల్లీ బయలు దేరాడంటే వారికి గుబులు మొదలైంది.
ధర్మ పోరాటం మొదలు పెట్టాం, విజయం TDP దే.
చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రాజీనామా, దీక్షలు అంటూ జగన్ కొత్త నాటకానికి తెరదీసాడు అని ప్రజలు గమనిస్తున్నారు.
కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్ ను ప్రజలు నమ్మరు.
ప్రధానిని అవమానించారని విజయసాయిరెడ్డి బాధ పడుతున్నారు. అక్కడే వారి లాలూచీ అర్ధమవుతుంది.
సభా హక్కుల నోటీసులు ఇచ్చారు. ప్రధానిని విమర్శిస్తే విజయసాయిరెడ్డి కి ఎందుకు బాధ?
విజయమాల్యా వద్ద చంద్రబాబు150 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. దమ్ముంటే సాక్ష్యాలు ప్రజల ముందు ఉంచాలి.
విజయసాయిరెడ్డి క్రిమినల్. అతనికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.
అసత్య ఆరోపణలు ప్రజలు నమ్మరు.
బీజేపీ కి వైసీపీ కి ప్రజలు బుద్ధి చెబుతారు.
---------------------------------------
MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.
మహాభారతం లో 5 మంది పాండవుల తరుపున శ్రీ కృష్ణుడు రాయబారానికి వెళ్ళినట్లు, 5 కోట్ల మంది ఆంధ్రులకు న్యాయం చేయాలని అభ్యర్ధించడానికి చంద్రబాబు ఢిల్లీ(హస్తిన) వెళ్లారు.
అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. BJP పరిస్థితిని అర్ధం చేసుకుని పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పై చర్చకు అంగీకరించాలి.
భారతంలో చెప్పిన విధంగా ‘అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్ని ఏకము కాకపోవు’ అన్నట్లు  అన్ని పార్టీలు ఏకం అవుతాయి.
మోడీ బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
విజయసాయిరెడ్డి, జగన్ లు చంద్రబాబు, లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు అవాస్తవం, అబద్ధాల పుట్ట.
రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పై బురద చల్లడం మానుకోవాలి.
సాక్షి ఫ్యాక్టరీ లో తయారైన అబద్ధపు మూటలు వాళ్ళు విప్పుతున్నారు.
----------------------------------------
అమలాపురం MLA ఐతాబత్తుల ఆనందరావు
YCP వ్యవహారం చూస్తుంటే ఏమనాలో అర్ధం కావడం లేదు.
ప్రత్యేక హోదా కోసం టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది.
ముఖ్యమంత్రి నిజాయితీతో వ్యవహరిస్తూ ఢిల్లీ వెళ్లారు.
YCP నాయకులు మోడీ జపం చేయడం, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమే.
ఒక ప్రక్క మోడీ కాళ్ళు మొక్కుతూ ముఖ్యమంత్రికి సభా హక్కుల నోటీసు పంపుతారా?
నోటీసు ఎందుకు అంటే, మోడీ ని అవమాన పరచినందుకు అంటున్నారు, ఆయనను అంటే ఈయనకు ఎందుకు?
ఒక ప్రక్క మోడీని ఏమైనా అంటే ఒప్పుకోవు, మరో ప్రక్క రాజీనామా, దీక్ష అంటావు. ఎవరిని మోసం చేయడానికి.
జగన్ పాదయాత్రలో మోడీని, అమిత్ షా ను, జైట్లీ ని విమర్శించరు. కానీ విజయసాయిరెడ్డిని మోడీ కాళ్ళమీద పడి గట్టి లాబీయింగ్ చేయమని పురమాయించాడు.
తెలుగు ప్రజలకు వీరి నాటకాలు అన్నీ తెలుస్తున్నాయి.
BJP చిన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
సోనియా నిర్ణయాకి కళ్లు మూసుకుని మద్దతు ప్రకటించింది.
ఆంధ్రులకు మోడీ పై కోపం ఉంటే YcP వాళ్ళు ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు.
YCP బీజేపీ తో రెండు రకాలుగా అనుబంధం కొనసాగిస్తోంది.
జగన్ మోడీ ని తిట్టడు, తిడితే జైల్లో వేస్తారని భయం.
TDP తెలుగువారు హక్కుల కోసం పోరాడుతుంటే YCP BJP పక్షాన ఉన్నది.
--------------------------------------------------------
MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

విజయసాయి రెడ్డి మానసిక అంగ వైకల్యంతో పెట్రేగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నారు.
ఆర్ధిక ఉగ్రవాదిని ప్రధాని మోదీ ఎందుకు హక్కును చేర్చుకుంటున్నారు.
ఆ దన్నుతోనే విజయ సాయి మాట్లాడుతున్నారు.
నోట్లరద్దు ద్వారా ఎన్ని లక్షల కోట్లు నల్ల ధనం బయటకు తెచ్చారు.
బ్యాంక్ లపై నమ్మకం పోయి డిపాజిట్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు.
డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకోవాలంటే ATM లన్నీ మూతపడ్డాయి.
మోడీ త్రయం బ్యాంకులని ముంచేసింది.
దోపిడీ దారులపై తీసుకున్న చర్యలు ఏమిటి?
రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు విషయంలో కాంగ్రేస్ హయాంలో ఇచ్చిన ఆర్డర్ 560 కోట్ల నుండి, 760 కోట్లకి పెరిగిందని బెంగళూరు HAL కు ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేశారు.
ఆ తరువాత మీరు ఫ్రాన్స్ వెళ్లి కేవలం 26 యుద్ధ విమానాలు 54000 కోట్లకు కొనుగొలు చేశారు.
ఆ రేట్లు బయటకు రాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు తో ఒప్పందం చేసుకున్నారు.
ఎన్ని కోట్ల స్కాం జరిగినది. మీ వాటా ఎంత? BJP వాటా ఎంత?
అక్కడ ఇంతటి అవినీతి జరిగితే రాష్ట్రంలోని BJP వారు, ఇక్కడ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రా? లేక దేశ ప్రధానినా?
గుజరాత్ లో GSP అనే సంస్థను పెట్టారు. ఆ సంస్థ 20000 కోట్ల నష్టాల్లో ఉంటే, దానిని ONGC లో కలిపారు.
GSP డబ్బుతో పబ్బం గడుపుకొని ఎన్నికలలో ఖర్చు పెట్టారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవసాయంలో నెగటివ్ గ్రోత్ సాధించారు.
అనేక పాఠశాలలో ఉపాధ్యాయులు కూడాలేరు.
CAG నివేదిక ప్రకారం 25000 కోట్లకు లెక్కలు లేవు.
ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిన మోడీ ప్రధానిగా సక్సెస్ ఎలా అవుతారు.
అమరావతికి 1500 కోట్లు, విజయవాడ గుంటూరు కు 1000 కోట్లు ఇచ్చారు.వాటికి UC లు ఇచ్చాము. అయితే లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం లోని BJP వాళ్ళు మాట్లాడుతున్నారు.
కేంద్రం ఇచ్చిన మొత్తం 12,500 కోట్లు మాత్రమే, ఇందులో అవినీతి ఏమి జరుగుతుంది.
పోలవరం కు ఇంకా 2500 కోట్లు ఇవ్వాలి.
BJP రాష్ట్ర నాయకులు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు.
యుద్ధ విమానాలు కుంభకోణం పై వివరణ ఇచ్చి మాట్లాడండి.
ఆ డబ్బు మీ జేబు లోనిది కాదు, మీ తాత గాడి ముల్లె కాదు.
రాష్ట్రంలోని విద్యా సంస్థలకు 11000 కోట్లకు గానూ 560 కోట్లు మాత్రమే ఇచ్చారు.
రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలకు 24,000 కోట్లకు గానూ 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు.
BJP మతోన్మాదం తో వ్యవహరిస్తూ, అరాచకాలు సృష్టిస్తుంది.
ప్రధానిగా మోడీ చేసిన పనుల విషయంలో CAG ఇచ్చిన రిపోర్ట్ చూడండి.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే, BJP సహకరించింది.
అవిశ్వాసం పై చర్చకు ఎందుకు అనుమతించరు?
AIADMK ను సస్పెండ్ చేసి చర్చకు అనుమతించ వచ్చు కదా.
మీరు పారిపోవడం సరియైన విధానం కాదు.
రాయలసీమ లో అభివృద్ధి, పరిశ్రమలు మీ కళ్ళకు కనిపించడం లేదా?
కేంద్రం ఏ ఏ ప్రాజెక్టులకు ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గినపుడు ఇక్కడ ఎందుకు  పెట్రోల్ ధర పెంచుకుంటూ పోతున్నారు.
ప్రజారాజ్యం లో నియంత లా వ్యవహరిస్తే పతనం తప్పదు.
------------------------------------------------
MLC బుద్దా వెంకన్న
విజయసాయిరెడ్డి కి పిచ్చి కుక్క కరచినట్లు ఉన్నది. ఆయన మాట్లాడే మాటలు, చేష్టలు అలానే ఉన్నాయి. ఆయనకు బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ లు చేయించాలి.
రాష్ట్రంలో ఉండే అర్హత విజయసాయిరెడ్డి కి లేదు.
5 కోట్ల మందింప్రజాలు ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలి, వెలివేయాలి.
విజయసాయిరెడ్డి 5 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు.
మొన్న ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తూ మాట్లాడినారు. నిన్న ముఖ్యమంత్రి ని అనారాని మాటలు అన్నాడు.
మోడీతో ప్రత్యక్ష యుద్దానికి దిగిన చంద్రబాబుపై, అసెంబ్లీ లో మోడీ వీడియో క్లిప్పింగ్స్ చూపించాడని విజయసాయి రెడ్డి సభా హక్కుల నోటీసు ఇచ్చాడు. కానీ BjP వాళ్ళు ఏమి మాట్లాడలేదు.
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?
కేంద్రం చెప్పినట్లు తలదిఅతున్న విజయ సాయిరెడ్డి కి ముఖ్యమంత్రి ని విమర్శించే అర్హత లేదు.
YCP BJP వాళ్ళ డైరెక్షన్ లో నడుస్తున్నది అని నిన్నటితో తెలిసి పోయింది.
రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేసినట్లు, విజయసాయిరెడ్డి ని లాంటి బ్రోకర్ల ను కూడా బహిష్కరించాలి.
ముద్దులు పెట్టడం లో జగన్మోహన్ రెడ్డి, కాళ్ళకు మొక్కడం లో విజయసాయిరెడ్డి.
తెలుగువారి ఆత్మ గౌరవం PMO లో తాకట్టు పెట్టారు.
YCP వాళ్ళు 6 వ తారీఖున రాజీనామా చేస్తామనడం BJP ఆడిస్తున్న డ్రామా.
జగన్, విజయసాయిరెడ్డి లు రాష్ట్రానికి రాహుకేతువులు లా తయారయ్యారు.
---------------------------------



Apr 2, 2018

02.04.2018 సోమవారం – శాసనసభ మీడియా పాయింట్




వినుకొండ MLA GV ఆంజనేయులు.
AP అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబును ఎదుర్కొనలేక YCP, BJP లు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రజల్ని పక్కదారి పట్టించడానికి MP ల రాజీనామా అంటూ డ్రామా ఆడుతున్నారు. దీక్ష చేస్తామంటున్నారు.
2 సం,, నుండి రాజీనామా అంటూ ఇప్పటివరకు చేయకుండా, ఇప్పుడు రాజీనామా చేస్తే 6 నెలల వరకు దానిని స్పీకర్ పరిసీలించరని, ఎన్నికలు రావని BJP సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నాడు.
BJP డైరెక్షన్లో జగన్ నడుస్తున్నాడు.
బయట పోరాటం అంటూ లోపల మోడీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు పోరాటం ఎలా చేస్తారు.
రాష్ట్రంలో అవినీతి ఉన్నందువల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజి ఇవ్వలేదు అని సొము వీర్రాజు అంటున్నాడు.
ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతకు భయపడి BJP వాళ్ళు అలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.
BJP వాళ్ళు రాష్ట్రాన్ని మోసం చేశారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారు.
రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాజధానికి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూపిస్తాం.
రోడ్ల నిర్మాణం జరుగుతుంది, యూనివర్సిటీలు వచ్చాయి. 6 నెలల్లో అసెంబ్లీ సచివాలయం, భవనాలు నిర్మించి ఇక్కడ నుండే పరిపాలన సాగిస్తున్నాం. జగన్ కు కనబడటం లేదా?
MLA లకు, అధికారులకు, పేదలకు ఇళ్ళు నిర్మాణం జరుగుతుంటే జగన్ కు కనబడడం లేదా?
ప్రతిపక్షం సయిందవుడిలా అడ్డుపడుతున్నా, కేంద్రం సహకరించకపోయినా, ప్రజల సహకారంతో రాజధాని నిర్మించి తీరుతాం. పోలవరం పూర్తి చేస్తాం.
  YSR పరిపాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, చంద్రబాబు రైతుల్ని గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఆదుకొంటున్నారు.
-----------------------------------------------------------------

MLC బుద్దా వెంకన్న
సొము వీర్రాజు ఆంధ్రాకు పట్టిన శని లా అవతరించాడు.
దక్షిణ, ఉత్తర భారతదేశం అంటూ మోడీ విభజించి పాలిస్తుంటే, సొము వీర్రాజు రాయలసీమ, ఉత్తర ఆంధ్రా, కోస్తా అంటూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాడు.  బీజేపీకి, YCP కి మధ్య శకునిలా రాజకీయాలు చేస్తున్నాడు.
సొము వీర్రాజు గన్ మాన్ లను పక్కన పెట్టి రెండు గంటల పాటు పులివెందులలో ఎవరితో మంతనాలు జరిపారో ప్రజలకు చెప్పాలి.
చంద్రబాబు హోదా కోసం మోడీతో యుద్ధం చేస్తుంటే, వీర్రాజు పులివెందులలో జగన్ ఏజెంట్ లను కలుస్తున్నారు.
ప్రత్యేక హోదా అవసరం లేదు అంటూ రాష్ట్రంలో దుష్ట శక్తులను ఏకం చేస్తున్నాడు.
ముఖ్యమంత్రిపై ప్రజలను తిరగబడమంటున్నాడు. సొము వీర్రాజుపై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు.
సొము వీర్రాజు డాష్ బోర్డు అంటే తెలియదు అంటున్నాడు. అతని అవినీతి గురించి కూడా డాష్ బోర్డులో ఉంటుంది.
YCP, BJP డ్రామాలతో రాష్ట్రం వెనకబడి ఉంది.
5 కోట్ల మంది ప్రజలు గళం విప్పాలి.
రేపు, ఎల్లుండి ముఖ్యమంత్రి  ఢిల్లీ వెళ్లనున్నారు.
చంద్రబాబును పలువురు నేతలు కలవనున్నారు.
BJP MP లు కొందరు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారని భయంతో వీర్రాజు ఇలా మాట్లాడుతున్నారు.
దేశంలో వేల కోట్లు ఎగ్గొట్టి, ఫారిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారికి మోడీ అండగా ఉంటున్నారు.
దమ్ముంటే మోడీని 2019 లో దక్షిణ భారతదేశంలో పోటీ చేయమనండి.
2019లో చంద్రబాబు సూచించిన వ్యక్తి ప్రధాని అవుతారు.
------------------------------------------------

అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి.
పార్లమెంట్ సాక్షిగా మోడీ కాళ్ళకు మొక్కిన విజయసాయిరెడ్డి BJP తో అనైతిక పొత్తు కుదుర్చుకున్నారు.
బడ్జెట్ లో అన్యాయం చేశారని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుతుంటే, బడ్జెట్ బాగుందని విజయసాయిరెడ్డి కితాబు ఇచ్చాడు.
మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం కాళ్లపై ఎందుకు పడ్డారు.
రూ.64 కోట్ల కుంభకోణం చేసిన శశికళను జైలుకు పంపిన మోడీ, 43 వేల కోట్ల దోచిన వారి కేసులు ఎందుకు ముందుకు సాగనివ్వడం లేదు.
BJP ప్రభుత్వాన్ని ప్రజలు ఉపేక్షించరు.
16 పార్టీలు ఏకమై అవిశ్వానికి మద్దతు ఇవ్వడం చంద్రబాబు పై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు, కానీ అవిశ్వానికి ఎందుకంటే భయపడుతున్నారు.
-------------------------------------------------------

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల  ఆనందరావు  :
       భారతీయ జనతా పార్టీ అబద్ధాలతో, అసత్యాలతో ఈ దేశాన్ని భ్రష్ఠు పట్టిస్తోంది.
       లౌక్యంతో లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తుంది
       స్నేహంతో మిత్ర పక్షాలను వంచిస్తూ అధికారంలోకి వచ్చాక అణచివేస్తూ దుర్మార్గ పాలన చేస్తుంది.
       బీజేపీకి రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కష్టం కానీ విభజించడం చాలా ఇష్టం. అందుకే సోమువీర్రాజు రాయలసీమకు వెళ్లి రాయలసీమ నిధులు కోస్తాకు మళ్లిస్తున్నారని సిగ్గులేని విమర్శలు చేస్తున్నారు.
       ఆంధ్రా బీజేపీ నాయకులు అంధత్వంలో ఉన్నారా ? ఈ కమల నాయకులకు కర్ణభేరులు పనిచేయడం లేదా ? మోదీ హామీల మాటలు మీకు వినబడలేదా ? మీకు దమ్ముంటే ఆంధ్రాహక్కుల కోసం మీ పార్టీమీదే పోరాటం చేయండి..అంతేగానీ మోదీ తానా అంటే మీరు తందానా అనకండి.
       దక్షిణాది రాష్ట్రాల నిధులు మోదీ ఉత్తరాదికి మళ్లిస్తుంటే మీకు కనబడలేదు కానీ సీమ నిధులు కోస్తాకు మళ్లిస్తున్నారని నీకు నోరెలా వస్తుంది ?
       తెలుగుజాతి ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు బీజేపీ నాయకులు చేసినంత ద్రోహం ఇంత వరకు ఎవరూ లేరు
       అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ అవార్డును మించిన నటులు బీజేపీలో ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ రికార్డును కూడా బీజేపీ బద్దలు కొట్టింది.
       ఏపీలో అవినీతి అని మాట్లాడే సోము వీర్రాజు నీరవ్ మోదీ విదేశాలకు పారిపోతే ఎందుకు పట్టించుకోవడం లేదు? నరేంద్ర మోదీ నిద్రపోతున్నాడా ?
       బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లెక్క గట్టలేనంతగా ఉంది.
       చంద్రబాబు నాయుడుగారిది హోదా, విభజన హామీల్లో ధర్మపోరాటం కాబట్టే దేశం మొత్తం ఆయనకు మద్దతు పలుకుతుంది. ఇప్పటికైనా ఆంధ్రా బీజేపీ నాయకులు కళ్లు తెరిచి జరిగేది చూసి మాతో కలిసి రండి..లేదంటే జనం మిమ్మల్ని రోడ్లమీదికి  కూడా రానివ్వరు
---------------------------------------------------------

పీడీఫ్ ఎమ్మెల్సీ రామ సూర్యారావు
Ø ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతుంది.
Ø ఒకరి పై ఒకరు దూషణలు చేసుకోవడం తప్ప పేదవారు బాధపడుతున్నారు అన్న విషయాన్ని మరుగున పడవేస్తున్నారు.
Ø  రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ నాయకులే కారణం
Ø  అందరం కలిసి అభివృద్ధి కోసం పోరాడాలి
Ø  తెలంగాణ ప్రజలను చూసైనా మనం మారాలి
Ø  అఖిల పక్షం అంతా కలసి ప్రధాని మోదీని కలసి నిలదీయాలి
Ø  ప్రతిపక్ష నేత జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలసి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి విభజన హామీలు అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరాలి.
--------------------------------------------

మంత్రి  శామ్యూల్ జవహర్
v  సంవత్సరం నుండి అసెంబ్లీ కి రాకుండా వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వైసీపీ అదే పద్ధతి పార్లమెంట్ లో కూడా చేస్తున్నారు.
v  ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు అన్ని వదిలేసి మాట్లాడండి.
v  అన్ని అనుభవిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు అని వైసీపీ నాయకులు గ్రహించాలి
v  Iyr కృష్ణా రావు మాటలు పదవి పోవటంతో పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నట్లుంది.
v   ఇప్పుడు peoples కాపిటల్ పైన మాట్లాడుతున్న మాటలు ఏ రహస్య ఏజండాతో  మాట్లాడుతున్నారో చెప్పాలి
v  ఆంద్రప్రదేశ్ లో A అంటే అమరావతి P అంటే పోలవరం గా ముందుకు వెళ్తున్నాం. ప్రజలను తప్పుతోవ పట్టించే చర్యలు దయ చేసి మానుకోండి.
--------------------------------------------------

మంత్రి నక్కా ఆనంద బాబు
·       పార్లమెంట్ యథావిధిగా వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ కు రావటానికి ఎందుకు భయపడుతున్నారు.
·        అన్నా డీఎంకే ఒకటే గొడవ చేస్తుంది. చర్చ ప్రారంభిస్తే గొడవ సద్దు మణుగుతుంది
·         స్పీకర్ కి అందరూ కనపడుతూ ఉంటారు. లేక్కపెడితే ఎంత మద్దతు ఉందొ తెలుస్తుంది.
·        టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వచ్చిన మద్దతుకి భయపడి చర్చ జరగనివ్వటం లేదు.
·        ఇలాంటి పిరికి ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ  చూడలేదు.
·         వైసీపీ  పధకం ప్రకారం రాజీనామా డ్రామాలు ఆడుతుంది. బీజేపీ తో కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారు.
·        ప్రజలు అంతా గమనిస్తున్నారు.
·        బీజేపీ, వైసీపీ ని నమ్మే పరిస్థితులు ఏపీలో లేవు.
·        కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తప్పదు
·        ప్రజాస్వామ్య వ్యవస్థ కి, పార్లమెంటరీ వ్యవస్థ కి బీజేపీ తిలోదకాలు ఇస్తుంది.
---------------------------------