వినుకొండ MLA
GV ఆంజనేయులు.
◆ AP అభివృద్ధి
కోసం కష్టపడుతున్న చంద్రబాబును ఎదుర్కొనలేక YCP, BJP లు అసత్య ఆరోపణలు చేస్తున్నాయి.
◆ ప్రజల్ని
పక్కదారి పట్టించడానికి MP
ల రాజీనామా అంటూ డ్రామా ఆడుతున్నారు. దీక్ష
చేస్తామంటున్నారు.
◆ 2 సం,, నుండి
రాజీనామా అంటూ ఇప్పటివరకు చేయకుండా, ఇప్పుడు రాజీనామా చేస్తే 6 నెలల వరకు
దానిని స్పీకర్ పరిసీలించరని, ఎన్నికలు రావని BJP
సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటున్నాడు.
◆ BJP డైరెక్షన్లో
జగన్ నడుస్తున్నాడు.
◆ బయట పోరాటం అంటూ
లోపల మోడీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు పోరాటం ఎలా చేస్తారు.
◆ రాష్ట్రంలో
అవినీతి ఉన్నందువల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజి ఇవ్వలేదు అని సొము వీర్రాజు అంటున్నాడు.
◆ ప్రజల నుండి
వస్తున్న వ్యతిరేకతకు భయపడి BJP వాళ్ళు అలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.
◆ BJP వాళ్ళు
రాష్ట్రాన్ని మోసం చేశారు. దానిని
కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారు.
◆ రాజధానిలో
ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. జగన్మోహన్
రెడ్డికి దమ్ముంటే రాజధానికి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూపిస్తాం.
◆ రోడ్ల నిర్మాణం
జరుగుతుంది, యూనివర్సిటీలు
వచ్చాయి. 6 నెలల్లో
అసెంబ్లీ సచివాలయం,
భవనాలు నిర్మించి ఇక్కడ నుండే పరిపాలన సాగిస్తున్నాం. జగన్ కు
కనబడటం లేదా?
◆ MLA లకు, అధికారులకు, పేదలకు ఇళ్ళు
నిర్మాణం జరుగుతుంటే జగన్ కు కనబడడం లేదా?
◆ ప్రతిపక్షం
సయిందవుడిలా అడ్డుపడుతున్నా, కేంద్రం సహకరించకపోయినా, ప్రజల సహకారంతో రాజధాని నిర్మించి తీరుతాం. పోలవరం పూర్తి
చేస్తాం.
◆ YSR పరిపాలనలో గిట్టుబాటు ధర
లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, చంద్రబాబు రైతుల్ని గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఆదుకొంటున్నారు.
-----------------------------------------------------------------
MLC బుద్దా వెంకన్న
◆ సొము వీర్రాజు
ఆంధ్రాకు పట్టిన శని లా అవతరించాడు.
◆ దక్షిణ, ఉత్తర
భారతదేశం అంటూ మోడీ విభజించి పాలిస్తుంటే, సొము వీర్రాజు రాయలసీమ, ఉత్తర ఆంధ్రా, కోస్తా అంటూ
ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాడు. బీజేపీకి, YCP కి మధ్య శకునిలా
రాజకీయాలు చేస్తున్నాడు.
◆ సొము వీర్రాజు
గన్ మాన్ లను పక్కన పెట్టి రెండు గంటల పాటు పులివెందులలో ఎవరితో మంతనాలు జరిపారో
ప్రజలకు చెప్పాలి.
◆ చంద్రబాబు
హోదా కోసం మోడీతో యుద్ధం చేస్తుంటే, వీర్రాజు పులివెందులలో జగన్ ఏజెంట్ లను కలుస్తున్నారు.
◆ ప్రత్యేక హోదా
అవసరం లేదు అంటూ రాష్ట్రంలో దుష్ట శక్తులను ఏకం చేస్తున్నాడు.
◆ ముఖ్యమంత్రిపై
ప్రజలను తిరగబడమంటున్నాడు. సొము
వీర్రాజుపై దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు.
◆ సొము వీర్రాజు
డాష్ బోర్డు అంటే తెలియదు అంటున్నాడు. అతని అవినీతి
గురించి కూడా డాష్ బోర్డులో ఉంటుంది.
◆ YCP, BJP డ్రామాలతో
రాష్ట్రం వెనకబడి ఉంది.
◆ 5 కోట్ల మంది
ప్రజలు గళం విప్పాలి.
◆ రేపు, ఎల్లుండి
ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారు.
◆ చంద్రబాబును
పలువురు నేతలు కలవనున్నారు.
◆ BJP MP లు కొందరు
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారని భయంతో వీర్రాజు ఇలా మాట్లాడుతున్నారు.
◆ దేశంలో వేల
కోట్లు ఎగ్గొట్టి, ఫారిన్ లో
పెళ్లిళ్లు చేసుకుంటున్న వారికి మోడీ అండగా ఉంటున్నారు.
◆ దమ్ముంటే
మోడీని 2019 లో దక్షిణ
భారతదేశంలో పోటీ చేయమనండి.
◆ 2019లో చంద్రబాబు
సూచించిన వ్యక్తి ప్రధాని అవుతారు.
------------------------------------------------
అనపర్తి MLA నల్లమిల్లి
రామకృష్ణ రెడ్డి.
◆ పార్లమెంట్
సాక్షిగా మోడీ కాళ్ళకు మొక్కిన విజయసాయిరెడ్డి BJP తో అనైతిక పొత్తు కుదుర్చుకున్నారు.
◆ బడ్జెట్ లో
అన్యాయం చేశారని ఆంధ్ర,
తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుతుంటే, బడ్జెట్ బాగుందని విజయసాయిరెడ్డి కితాబు ఇచ్చాడు.
◆ మడమ తిప్పని
వ్యక్తి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం కాళ్లపై ఎందుకు పడ్డారు.
◆ రూ.64 కోట్ల
కుంభకోణం చేసిన శశికళను జైలుకు పంపిన మోడీ, 43 వేల కోట్ల దోచిన వారి కేసులు ఎందుకు ముందుకు
సాగనివ్వడం లేదు.
◆ BJP ప్రభుత్వాన్ని
ప్రజలు ఉపేక్షించరు.
◆ 16 పార్టీలు
ఏకమై అవిశ్వానికి మద్దతు ఇవ్వడం చంద్రబాబు పై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
◆ అవిశ్వాస
తీర్మానం వల్ల ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు, కానీ అవిశ్వానికి ఎందుకంటే భయపడుతున్నారు.
-------------------------------------------------------
అమలాపురం
ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు :
• భారతీయ జనతా
పార్టీ అబద్ధాలతో, అసత్యాలతో ఈ
దేశాన్ని భ్రష్ఠు పట్టిస్తోంది.
• లౌక్యంతో
లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తుంది
• స్నేహంతో
మిత్ర పక్షాలను వంచిస్తూ అధికారంలోకి వచ్చాక అణచివేస్తూ దుర్మార్గ పాలన చేస్తుంది.
• బీజేపీకి
రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కష్టం కానీ విభజించడం చాలా ఇష్టం. అందుకే
సోమువీర్రాజు రాయలసీమకు వెళ్లి రాయలసీమ నిధులు కోస్తాకు మళ్లిస్తున్నారని
సిగ్గులేని విమర్శలు చేస్తున్నారు.
• ఆంధ్రా బీజేపీ
నాయకులు అంధత్వంలో ఉన్నారా ? ఈ కమల నాయకులకు కర్ణభేరులు పనిచేయడం లేదా ? మోదీ హామీల మాటలు మీకు వినబడలేదా ? మీకు దమ్ముంటే
ఆంధ్రాహక్కుల కోసం మీ పార్టీమీదే పోరాటం చేయండి..అంతేగానీ మోదీ
తానా అంటే మీరు తందానా అనకండి.
• దక్షిణాది రాష్ట్రాల
నిధులు మోదీ ఉత్తరాదికి మళ్లిస్తుంటే మీకు కనబడలేదు కానీ సీమ నిధులు కోస్తాకు
మళ్లిస్తున్నారని నీకు నోరెలా వస్తుంది ?
• తెలుగుజాతి
ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు బీజేపీ నాయకులు చేసినంత ద్రోహం ఇంత వరకు ఎవరూ లేరు
• అబద్ధాలు
చెప్పడంలో, అసత్యాలు
ప్రచారం చేయడంలో ఆస్కార్ అవార్డును మించిన నటులు బీజేపీలో ఉన్నారు. ఈ విషయంలో
కాంగ్రెస్ రికార్డును కూడా బీజేపీ బద్దలు కొట్టింది.
• ఏపీలో అవినీతి
అని మాట్లాడే సోము వీర్రాజు నీరవ్ మోదీ విదేశాలకు పారిపోతే ఎందుకు
పట్టించుకోవడం లేదు? నరేంద్ర మోదీ
నిద్రపోతున్నాడా ?
• బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
అవినీతి లెక్క గట్టలేనంతగా ఉంది.
• చంద్రబాబు
నాయుడుగారిది హోదా,
విభజన హామీల్లో ధర్మపోరాటం కాబట్టే దేశం మొత్తం ఆయనకు మద్దతు పలుకుతుంది. ఇప్పటికైనా
ఆంధ్రా బీజేపీ నాయకులు కళ్లు తెరిచి జరిగేది చూసి మాతో కలిసి రండి..లేదంటే జనం
మిమ్మల్ని రోడ్లమీదికి కూడా రానివ్వరు
---------------------------------------------------------
పీడీఫ్
ఎమ్మెల్సీ రామ సూర్యారావు
Ø
ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే
బాధ కలుగుతుంది.
Ø
ఒకరి పై ఒకరు దూషణలు చేసుకోవడం తప్ప పేదవారు
బాధపడుతున్నారు అన్న విషయాన్ని మరుగున పడవేస్తున్నారు.
Ø
రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్
నాయకులే కారణం
Ø
అందరం కలిసి అభివృద్ధి కోసం పోరాడాలి
Ø
తెలంగాణ ప్రజలను చూసైనా మనం మారాలి
Ø
అఖిల పక్షం అంతా కలసి ప్రధాని మోదీని కలసి
నిలదీయాలి
Ø
ప్రతిపక్ష నేత జగన్, ముఖ్యమంత్రి
చంద్రబాబు కలసి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి విభజన హామీలు అమలు చేయాలని
కేంద్రం ప్రభుత్వాన్ని కోరాలి.
--------------------------------------------
మంత్రి శామ్యూల్
జవహర్
v
సంవత్సరం నుండి అసెంబ్లీ కి రాకుండా వీధుల్లో
పోరాటాలు చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వైసీపీ అదే పద్ధతి పార్లమెంట్ లో కూడా
చేస్తున్నారు.
v
ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు అన్ని వదిలేసి
మాట్లాడండి.
v
అన్ని అనుభవిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు అని
వైసీపీ నాయకులు గ్రహించాలి
v
Iyr కృష్ణా రావు
మాటలు పదవి పోవటంతో పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నట్లుంది.
v
ఇప్పుడు peoples కాపిటల్ పైన
మాట్లాడుతున్న మాటలు ఏ రహస్య ఏజండాతో
మాట్లాడుతున్నారో చెప్పాలి
v
ఆంద్రప్రదేశ్ లో A అంటే అమరావతి P అంటే పోలవరం
గా ముందుకు వెళ్తున్నాం. ప్రజలను తప్పుతోవ పట్టించే చర్యలు దయ చేసి
మానుకోండి.
--------------------------------------------------
మంత్రి నక్కా
ఆనంద బాబు
·
పార్లమెంట్ యథావిధిగా వాయిదా పడింది. అవిశ్వాస
తీర్మానంపై చర్చ కు రావటానికి ఎందుకు భయపడుతున్నారు.
·
అన్నా డీఎంకే ఒకటే గొడవ చేస్తుంది. చర్చ ప్రారంభిస్తే
గొడవ సద్దు మణుగుతుంది
·
స్పీకర్ కి
అందరూ కనపడుతూ ఉంటారు. లేక్కపెడితే ఎంత మద్దతు ఉందొ తెలుస్తుంది.
·
టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వచ్చిన
మద్దతుకి భయపడి చర్చ జరగనివ్వటం లేదు.
·
ఇలాంటి పిరికి ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ చూడలేదు.
·
వైసీపీ పధకం
ప్రకారం రాజీనామా డ్రామాలు ఆడుతుంది. బీజేపీ తో
కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారు.
·
ప్రజలు అంతా గమనిస్తున్నారు.
·
బీజేపీ, వైసీపీ ని
నమ్మే పరిస్థితులు ఏపీలో లేవు.
·
కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తప్పదు
·
ప్రజాస్వామ్య వ్యవస్థ కి, పార్లమెంటరీ
వ్యవస్థ కి బీజేపీ తిలోదకాలు ఇస్తుంది.
---------------------------------
No comments:
Post a Comment