Mar 20, 2024

ఏక పక్షంగాలేని ఏపీ రాజకీయం


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఈ సారి ఎవరి అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. వివిధ సంస్థల సర్వేల ఫలితాలు నమ్మేవిధంగా లేవు. కొన్ని ఏకపక్షంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.  ఆయా పార్టీల తరఫున ఆ సర్వేలు ప్రకటిస్తున్నట్లుంది. టీడీపీ బీజేపీ, జనసేనతో జతకట్టి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ సీపీఐ, సీపీఎంల పొత్తుతో పోటీ చేస్తోంది. వైసీపీ మాత్రం గతంలో మాదిరే ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎన్నికలంటే విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు తారాస్థాయిలో వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఏపీలో రాజకీయ విమర్శల్లో భరించలేని బండ బూతులు కూడా వచ్చేశాయి. ‘‘ఈ ఎన్నికలు ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం.. తాము సిద్ధం’’ అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీని ఓడించాలని  టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో  సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాజధాని అమరావతి, మూడు రాజధానుల అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని  మనకు స్పష్టంగా తెలుస్తోంది. 

వివిధ పార్టీల ఆలోచనలు క్లుప్తంగా పరిశీలించినట్లైతే.. ‘‘సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన పేదలతోపాటు క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు,ఎస్టీలు, ఎస్సీలు, కాపులు, సీఎం సామాజిక వర్గంవారు, వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది మాకు ఓట్లు వేస్తారు.బీసీ, ఎస్టీ,ఎస్సీలలోని అన్ని కులాల వారిని గుర్తించి, ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాజ్యసభ, శాసనమండలి సభ్యుల పోస్టులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సామాజిక న్యాయం పాటించాం.అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధాలకు కట్టుబడి ఉన్నాం. లోక్ సభ, శాసనసభ సీట్ల విషయంలో కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమేగాక, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, మహిళల విషయంలో కూడా సమాజిక న్యాయం పాటించాం. వారికి 50 శాతం సీట్లు కేటాయించాం. ఇవే మమ్మల్ని రెండవసారి విజయతీరాలకు చేరుస్తాయి.’’ అని వైసీపీ భావిస్తోంది.   


‘‘ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాపులు, చంద్రబాబు సామాజిక వర్గం వారు, మధ్య, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు మాకు ఓట్లు వేస్తారు. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి. అమరావతితోపాటు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇసుక, మద్యం, మైనింగ్, గంజాయి ద్వారా వైసీపీ నేతలు కోట్ల రూపాయలు గఢించారు. అన్ని వర్గాల ప్రజలకు వేధింపులు ఎక్కువైపోయాయి. పోలీసుల రాజ్యం కొనసాగుతోంది.విజన్ ఉన్న నేత చంద్రబాబు నాయుడు. అభివృద్ధి, ఉపాధి టీడీపీతోనే సాధ్యం.ఈ అంశాలే మమ్మల్ని గెలిపిస్తాయి’’ అని టీడీపీ నమ్మకంతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీని ఏపీలో పెద్దగా లెక్కలోకి తీసుకోవలసిన అవసరంలేదు. పార్లమెంట్ తలుపులు మూసి, చర్చ లేకుండా, అన్యాయంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందన్న అభిప్రాయంతో ఏపీ ప్రజలు ఉన్నారు. అలాగే, కమ్మూనిస్టుల పరిస్థితి రాష్ట్రంలో బాగా దిగజారిపోయింది. వారు ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితిలేదు. రాజకీయ, సామాజిక, ట్రేడ్ యూనియన్, విద్యార్థి యూనియన్, అన్ని వర్గాలలో ఉద్యమాల తీవ్రత తగ్గడం, అత్యధిక మంది నేతల ప్రవర్తన తదితర కారణాల వల్ల సీపీఐ, సీపీఎం బాగా క్షీణించాయి. 


టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల విషయానికి వస్తే అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీలో, రాష్ట్ర ప్రజలలో ఎక్కువ మందికి ఇష్టంలేదు. ఈ పొత్తువల్ల ముస్లింలు అత్యధిక మంది టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ.. వంటి అంశాలు విషయంలో రాష్ట్ర ప్రజలు బీజేపీ అంటే మండిపడుతున్నారు. అంతే కాకుండా, వైసీపీతో బీజేపీకీ లోపాయకారి ఒప్పందం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనేక కేసులలో నిందితుడిగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాకపోవడానికి, కనీసం కోర్టుకు హాజరుకాకపోవడానికి కూడా బీజేపీ మద్దతే కారణంగా భావిస్తున్నారు. అంతేకాకుండా, చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో మూడు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇక సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటన విషయంలో జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాపు వర్గం నుంచి కూడా జనసేనకు అనుకున్న స్థాయిలో మెజార్టీ లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గం నుంచి ముద్రగడ పద్మనాభం వంటి ముఖ్యనేతలు వైసీపీలో చేరారు.  ఆ ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదం లేకపోలేదు. వైసీపీ ఒంటిగా పోటీ చేస్తున్నప్పటికీ, అభ్యర్థులను మార్చడం, మళ్లీ మార్చడం, ప్రకటించడంలో జాప్యం వంటి అంశాలు ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓట్లు వేయడానికి క్యూలలో నిలబడే ఓపిక ఉన్న  పేద వర్గాలు ఎక్కువగా వైసీపీకే వేసే అవకాశం ఉంది. అయితే, ఉద్యోగ, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారు కూడా ఓపిక చేసుకుని క్యూలో నిలబడి ఓట్లు వేస్తే టీడీపీ కూటమి లాభపడే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరిగితే మాత్రం టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సారి ఎన్నికలు గతంలో మాదిరి ఏకపక్షంగా ఉండే అవకాశం మాత్రం లేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. అభివృద్ధి, సంక్షేమం కంటే  కులాల ప్రభావం కూడా ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ఉంటుంది. ఈ ఎన్నికలు చాలా పోటాపోటీగా జరుగుతాయి. మరీ అంత మితిమీరిన నమ్మకం (ఓవర్ కాన్ఫిడెన్స్) ఎవరికీ పనికిరాదు. పొగరు తలెక్కితే మాత్రం ప్రమాదం!

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


Mar 19, 2024

వైసీపీ వ్యూహాలు ఫలించేనా?


2024 ఎన్నికల శంఖారావం మోగింది. ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాలను రోజుకో రకంగా మార్చివేస్తోంది.  ట్విస్టులపై ట్విస్టులు ఇస్తోంది.  ఒంటరిగా పోటీ చేయడమే గాక, సింహం సింగిల్ గానే వస్తుందని ప్రచారం చేసుకుంటుంది. అంతకు మించిన విషయం ఏమిటంటే, ఈ ఎన్నికల్లో  ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ప్రకటించి చరిత్ర సృష్టించింది. అలాగే, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది.  ఎమ్మెల్యే స్థానాలు  బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 కేటాయించింది. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మహిళలు 19 మంది, మైనార్టీలు ఏడుగురు ఉన్నారు.  11 ఎంపీ స్థానాల్లో బీసీ అభ్యర్థులను ప్రకటించింది. ఇదో రికార్డ్. ఎంపీ అభ్యర్థుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారు. వైసీపీ జాబితాలో సామాజిక సమీకరణాలు బాగా పాటించారన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఆ పార్టీకి బాగా కలిసివచ్చే అవకాశం.


టీడీపీ బీసీల పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వైసీపీ మాత్రం మొదటి నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి దగ్గర నుంచి, రాజ్యసభ సభ్యులు, శాసనస మండలి సభ్యులు,  అనేక నామినేటెడ్ పోస్టులలో బీసీలకు భారీ స్థాయిలో అవకాశాలు కల్పించింది. ఎప్పుడూ అధికారం పొందని కులాలకు కూడా అవకాశం ఇచ్చింది. అలాగే, నిధులు లేకపోయినా కొత్త కార్పోరేషన్లు ఏర్పాటు చేసింది. అధికారాలు లేని ఉత్తుత్తి పదవులైనా, తమను గుర్తించి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్న భావన బీసీ వర్గాల్లో ఉంది.  ఈ అంశాన్ని వైసీపీ విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటోంది. ఆ మేరకు బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి వైసీపీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది. టీడీపీ మాత్రం అవకాశం ఉన్నప్పుడు కూడా నామినేటెడ్ పోస్టులలో బీసీలను నియమించలేదన్న విమర్శను ఎదుర్కొంటోంది. టీడీపీ హయాంలో కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకుండా వదిలివేసింది, అర్హులు ఉన్నా బీసీలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే, వైసీపీలో అధినేత జగన్ తర్వాత ద్వితీయశ్రేణి నాయకులు విజయశాయిరెడ్డి, మిధున్ రెడ్డి, రామచంద్రారెడ్డి... ఇలా ఆ సామాజిక వర్గం వారే కనిపిస్తారు. నామ మాత్రపు పదవులు మాత్రం బీసీలకు, ఎస్సీలకు గణనీయంగా ఇచ్చారు.  అదే టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ద్వితీయశ్రేణి నాయకులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు వంటి బీసీ నేతలే ఉంటారు. అలా కొద్ది మందికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చేవారు.  కానీ, ఇతర పదవుల విషయానికి వచ్చేసరికి బీసీలకు ప్రధాన్యత ఇవ్వలేదన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఓ సారూప్యత ఉంది.  ఇద్దరూ తమ పక్కన ఉండే నాయకులు ఎవరైనా, వారి మాట వినరు. తమ ఆలోచనలకు అనుగుణంగానే ముందుకు వెళతారు. అధికారుల విషయంలో మాత్రం ఇద్దరూ ఒక్కటి కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారుల మాట కూడా అసలు వినరు. తన ధోరణిలోనే పోతారు.  చంద్రబాబు నాయుడు మాత్రం అధికారుల మాట వింటారు.  



వైసీపీ అనుసరించిన మరో ముఖ్యమైన వ్యూహం ఏమిటంటే..  34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 14 మంది ఎంపీలకు టికెట్లు ఇవ్వలేదు. కొందరు సిటింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చివేసింది.ఇటు పార్టీలోనూ, అటు ప్రతిపక్షాల్లోనూ ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.  కానీ, ఆ పార్టీకి అంతకుమించి మరో మార్గంలేదు. ఎందుకంటే, వైసీపీలో ఎక్కువ మంది మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్రజలలో పలుకుబడి అసలులేదు. అంతకు ముందు కాస్తో కూస్తో ఉన్నది కూడా పోయింది. వారు తమ తమ నియోకవర్గాలలో పనులు ఏమీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఏ పని చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రస్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో పాత వారికి టికెట్లు ఇస్తే, గెలిసే అవకాశం లేదని ఆ పార్టీ అధిష్టానం తెలుసుకుంది. వారికి టికెట్లు ఇవ్వకూడదని లేదా నియోజకవర్గాలు మార్చాలని నిర్ణయించింది. నియోజకవర్గం మారిస్తే, అక్కడ వారివి కొత్త ముఖాలవుతాయి. ఆ విధంగా లాభపడవచ్చన్నది వైసీపీ వ్యూహం. అది కాస్త ఫలించే అవకాశం ఉంది. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు తమని గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్మకం.  అందుకనే, ఈ వ్యూహాన్ని అనుసరించింది. టికెట్లు రాక కొందరు, అసంతృప్తితో కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. నిజం చెప్పాలంటే, వైసీపీ అనుసరించిన ఈ వ్యూహం వారికి కూడా కలిసివచ్చింది. వైసీపీలో వారికి టికెట్లు ఇచ్చినా గెలిచే అవకాశంలేదు. ఇప్పుడు, వారు పార్టీలు మారడం, అక్కడ టికెట్లు పొందడం చెకచెకా జరిగిపోయాయి. ఇప్పుడు వారు కొత్తగా ‘‘వైసీపీలో మా చేతులు కట్టివేశారు. ఏం చేయలేకపోయాం’’ అని చెప్పుకుని పోటీ చేస్తారు. ఇలా అయితే, వారిలో కొందరు గెలిచే అవకాశం కూడా ఉంది. ఇక వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ కూటముల మేనిఫెస్టోల యుద్ధం మొదలు నాకుంది. వైసీపీ ఇంకెన్ని ట్విస్ట్ లు చేస్తుందో చూడాలి.    


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


Mar 7, 2024

32 శతకాలకు సంబంధించి పుస్తకాలు

వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-1

కాళహస్తీశ్వర శతకము www.freegurukul.org/g/Shathakam-2

సుమతి శతకం www.freegurukul.org/g/Shathakam-3

కుమార శతకము www.freegurukul.org/g/Shathakam-4

కుమారి శతకం www.freegurukul.org/g/Shathakam-5

దాశరధి శతకము www.freegurukul.org/g/Shathakam-6

భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-7

వేమన శతకము www.freegurukul.org/g/Shathakam-8

భాస్కర శతకం www.freegurukul.org/g/Shathakam-9

పుణ్య గానము  www.freegurukul.org/g/Shathakam-10

భర్త్రుహరి సుభాషితము www.freegurukul.org/g/Shathakam-11

శతక త్రయము www.freegurukul.org/g/Shathakam-12

శతకాల్లో రత్నాలు www.freegurukul.org/g/Shathakam-13

దాశరథి శతకము-కంచెర్ల గోపన్న-రామదాసు www.freegurukul.org/g/Shathakam-14

కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-15

దశావతారను శతకము www.freegurukul.org/g/Shathakam-16

కృష్ణ శతకం www.freegurukul.org/g/Shathakam-17

కలివర్తన దర్పణం www.freegurukul.org/g/Shathakam-18

ఆంధ్ర నాయక శతకం www.freegurukul.org/g/Shathakam-19

మదాంద్ర నాయక శతకము www.freegurukul.org/g/Shathakam-20

మారుతి శతకం www.freegurukul.org/g/Shathakam-21

మూక పంచశతి కటాక్ష శతకం www.freegurukul.org/g/Shathakam-22

నరసింహ శతకము www.freegurukul.org/g/Shathakam-23

Mar 4, 2024

ASR Nagar : ASR కథ


అంత నిరాడంబరత A. S. Rao గారిది. అయ్యగారి సాంబశివరావు గారికి 1960 లో పద్మశ్రీ, 1974లో పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి. కానీ, ఆయన కారు వాడేవాడు కాదు. 'ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా! ' అనేవారు ఆయన.
ఎవరు ఈ A. S. Rao గారు?

1914 సెప్టెంబర్ 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామం లో జన్మించిన రావు గారికి elementary మరియు middle school లో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్న లు పెట్టిన ఒక చీర ను పాత గుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బు ను రావు గారికి ఇచ్చిందట. ఎంతనో తెలుసా? 2 రూపాయలు  ! అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత Benaras Hindu University లో MSc physics చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్ళను వీళ్ళను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి MSc పూర్తీ చేసారు.
అపుడు అమెరికా (క్యాలిఫోర్నియా ) లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది.
కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు?
TATA సంస్థ  40, 000 రూపాయలను ఆయనకు ఇచ్చి Stanford University కి పంపింది. అక్కడ ఆయన మేధస్సుకు అమెరికన్ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, Masters తరువాత వాళ్ళు " ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొఫెసర్ గా వుంటూ మా వాళ్ళను గైడ్ చేయండి, " అని ఆయనకు నెలకు పెద్ద జీతం ఆఫర్ చేసారు. ఎంతనో తెలుసా?
1, 50, 000 రూపాయలు. కానీ, రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, " క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన TATA సంస్థ కు నా సేవలు అందించాలి, " అన్నారట. భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్ళు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం ఎంతనో తెలుసా? 300 రూపాయలు! ఎక్కడ 1,50 000 ? ఎక్కడ 300 ? ఈ కాలం లో అయితే ఆయన నిర్ణయాన్ని మనం పిచ్చి అంటాం. అవును మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి !
ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి!


ముంబై లో రావు గారి పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే, సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన Dr. Homi Zahangir Bhabha తానే స్వయంగా ముంబై వెళ్లి రావు గారిని అభినందించి వచ్చారట. తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించి, హైదరాబాద్ లో Electronics Corporation of India Ltd ( ECIL ) ను కూడా స్థాపించారు. 2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ గారు ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తూ వున్నారు. ఆయనకు తెలుసు రావు గారు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని. అపుడు రావు గారు డాక్టర్ ను దగ్గరికి పిలిచి " నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నీవు పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముంది " అని అన్నారట. చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే సున్నితత్వం, మానవత్వం  వారిది. ఇవే కదా ఒక మనిషి character ను నిర్ణయించేది ! 

మహాబీర విత్తనాల ఉపయోగాలు



మహాబీర మొక్క తులసి మొక్కలా కనబడుతుంది. ఐతే, ఈ మొక్క ఆకులు కాస్త పెద్దవిగా ఉంటాయి.  మహాబీర విత్తనాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు మహాబీర విత్తనాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ  విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు వున్నాయి. మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామరపై లేపనం చేస్తే తగ్గిపోతాయి. మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తాయి.

ఈ గింజల్లో డైటరీ ఫైబర్స్, విటమిన్ కె, విటమిన్ ఎ, ఐరన్ & యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు నిర్వహణ, కనిపించే జీవసంబంధమైన వయస్సు తగ్గింపు, రోగనిరోధక శక్తి, మధుమేహం నియంత్రణ మొదలైన ప్రయోజాలున్నాయి. నీటిలో నానబెట్టినప్పుడు, దాని అసలు పరిమాణం కంటే 30 రెట్లు ఉబ్బిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మృదువైన ఉబ్బిన గింజలు అప్పుడు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.  అధిక శరీర వేడి నుండి ఉత్పన్నమయ్యే చికాకు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

సోరియాసిస్, ఎగ్జిమా మొదలైన చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఈ గింజలు ఎసిడిటీ/బర్నింగ్ సెన్సేషన్‌ని తగ్గిస్తాయి. మధుమేహ చికిత్సకు మంచిది. మహాబీర విత్తనాలు సులభంగా ప్రేగు కదలికను నిర్ధారించడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొట్టలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.
మహాబీర గింజలు  జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నందున, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహ సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది.

మహాబీర విత్తనాల పోషక విలువ

మహాబీర గింజలలో బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్, విటమిన్ ఎ, విటమిన్ కె ఉన్నాయి. ఇందులో పొటాషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, ఫోలేట్స్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.

గింజలను ఒక గ్లాసు నీటిలో కొన్ని గంటలు నానబెట్టి, మిశ్రమాన్ని త్రాగాలి. ఒక టీస్పూన్ మహాబీర గింజలను 1 గ్లాసు లేదా 200 మి.లీ వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, ఆపై మృదువైన, ఉబ్బిన గింజలను మీరు ఎంచుకునే తయారీలో ఉపయోగించండి. 
4 నుండి 6 గ్రాముల మహాబీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినండి.  అల్పాహారం కోసం ఇతర విత్తనాలను కూడా కలిగి ఉన్నాము.

అవిసె గింజలు, సబ్జా విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, సీతాఫలం విత్తనాలు కలోంజి  లేదా నిగెల్లా విత్తనాలు కూడా మంచివే. 


Feb 18, 2024

డయాబెటిస్ వారికి 11 ఉత్తమ ఆహారాలు

డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం, రెగ్యులర్ మెడికల్ చెక్-అప్స్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉన్న ఆహారాన్నితీసుకోవాలి.గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక వ్యక్తి  రక్తంలో చక్కెర స్థాయిలో ఆహారం ప్రభావం గురించి చెప్పే సంఖ్య. ఇది 0 నుండి 100 మధ్య స్కేల్ కలిగి ఉంది. 100 కు ఉదాహరణ స్వచ్ఛమైన గ్లూకోజ్. తక్కువ GI ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచవు. అధిక GI ఆహారాలు చక్కెర స్థాయిలలో తక్షణ పెంచుతాయి.  50 కన్నా తక్కువ GI విలువ తక్కువగా పరిగణిస్తారు. 50 ‐60 మధ్య GI విలువ సగటుగా పరిగణిస్తారు. 60 పైన జిఐ విలువ ఎక్కువ. 

1. శనగలుChickpeas (Kabuli Channa): శనగలను ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది చక్కెర స్థాయిలలో వచ్చే చిక్కులను నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక.

2. బీన్స్ Beans:అలసందలు, సోయాబీన్స్, చిక్కుడు, రాజ్మా, బఠాణీ వంటి అన్ని రకాల బీన్స్- కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్, ఫైబర్  గొప్ప వనరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బీన్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

3. బ్రోకలీ Broccoli: బ్రోకలీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఫైబర్ అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న బ్రోకలీతో పాటు బచ్చలికూర వంటి ఇతర ఆకుకూరలు చక్కెర స్థాయిలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి,.

4. గోధుమ బ్రెడ్ Whole Grain Bread: ఇది మానవ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. Whole Grain Bread శోషణ, జీర్ణక్రియకు మంచిది.

5. వోట్మీల్ Oatmeal;ఓట్మీల్ కరిగే ఫైబర్  గొప్ప మూలంగా పనిచేస్తుంది.కడుపులోని ఆహారం నుండి గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ గంటలు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి అల్పాహారం ఎంపికగా పరిగణిస్తారు.

6. యాపిల్స్ :  రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆపిల్ అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉండే గొప్ప మూలం. ప్రతిరోజూ ఒక ఆపిల్‌ను తినాలి. అది తక్కువ GI పోషకాలతో నిండి ఉంటుంది. ఇతర తక్కువ GI పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లాక్ జామున్, ఆరెంజ్ మొదలైనవి ఉన్నాయి. 

జామ, బొప్పాయ, నేరేడు పండ్లు తినవచ్చు.

అరటి, మామిడి వంటి పండ్లు అధిక GI పండ్లు. అటువంటి పండ్లను  మితంగా తినాలి.

7. కాకరకాయ Bitter Gourd: రుచిలో చేదు, అయితే కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే మూడు క్రియాశీల యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. కాకరకాయలో కనిపించే చారంతిన్ అనే సమ్మేళనం గ్లూకోజ్ స్థాయిలను తక్కువగా, చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

8. కోడి గుడ్లు రోజుకు ఆరు వరకు తినవచ్చు. నాన్ వెజ్ ఏదైనా ఓ కప్పు తినవచ్చు. సుగర్ ఉన్నవారికి ఉల్లిపాయలు  ఓ వరం. 

9. పాలకూరతోపాటు అన్ని రకాల ఆకు కూరలు. కాయగూరలు దోస, కీరదోస... వంటివి తినగలిగినవి ఎన్నైనా తినవచ్చు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) ఉత్తమం. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తినాలి. 

10.అన్ని రకాల చిరుధాన్యాలతో తయారు చేసే పిండితో చేసిన రొట్టెలు మంచివి. ప్రతి రోజూ ఓ స్పూన్ మెంతుపొడి తింటే మంచిది. 

11. నట్స్, dark chocolate