Feb 24, 2020

విశాఖపట్నంలో రహస్య అన్వేషణ!


24.02.2020: 
v కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటుచేయబోతున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిన నేపథ్యంలో వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సోమవారం సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో/జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి విశాఖలో రహస్య పర్యటన జరిపారు.
v  విజయనగరంలో జగనన్న విద్యా దీవెనపథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సోమవారం విమానంలో విశాఖపట్నం రాగా ఆయనతో పాటు వీరంతా ఇక్కడ దిగారు. అనంతరం జగన్‌ హెలికాప్టరులో విజయనగరం వెళ్లగా వీరు నగరంలోకి వచ్చారు. రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌-1కు పది కార్లలో వెళ్లి కాండ్యుయెంట్‌ సంస్థ నడుస్తున్న కార్యాలయాన్ని సందర్శించారు. తర్వాత కాపులుప్పాడలో అదానీ కంపెనీ కోసం రూపొందించిన లేఅవుట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత భీమిలి బీచ్‌ రోడ్డుకు వెళ్లి చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యానికి ఉన్న గెస్ట్‌ హౌస్‌ను చూశారు.

ట్రంప్ భారత్ పర్యటన–3 రాజధానులు


టీవీ ఏపీ 24X7 - తేదీ: 24.02.2020 సోమవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన–రాజధాని–3 రాజధానులు
యాంకర్ :  వెంకటకృష్ణ

 శ్రీనివాసరావు - అమరావతి జేఏసీ కన్వీనర్
20 రోజుల క్రితం పార్లమెంటులో సురేష్ గారిని మేం కలిశాం. అమరావతికి మద్దతు పలకమని అడిగాం. ఆయన మా నాయకుడు ఒక విధానాన్ని ప్రకటించారు. నేను కూడా ఆ దారిన వెళుతున్నాను అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు. ఇబ్బందిలేదు. ఒక కులం అనేదాని బద్దలు కొడుతూ నిన్న వెలగపూడి దీక్షా శిబిరంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నిరసనగా 151 మంది మాల, మాదిగలు కూర్చున్నారు. ఆ శిబిరాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర రవు. దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నీలం భాగ్యారావు గారు. తుళ్లూరులో జరిగిన పెద్ద సభలో దళితులు ముందుండి ఈ ఉద్యమం నడుపుతారు అని చెప్పారు. ఉద్యమంలో అందరి పాత్ర పెరుగుతూ వస్తోంది. అమరావతి రోడ్డుకు కూడా వెళ్లాం. హోం మంత్రి రాకుండా డమ్మీ కాన్వాయ్ ని పంపారు. అమరావతి రథోత్సవానికి మేం 2వేల మంది వెళ్లాం. డిమాండ్ వినిపించడానికి. జై అమరావతి అని నినాదాలు చేశారు. రధం వద్ద ఓ 3 వందల మంది స్థానికులు కాదు జై జగన్ అని నినాదాలు ఇచ్చారు. పది నిమిషాలు ఆగిన తరువాత వారిలో కొంతమంది జై పులివెందుల అని నినాదాలు ప్రారంభించారు. వాళ్లలో వారే కొంతమంది వారిని ఆపారు. వారు తాగి ఉన్నాం. ఆ తరువాత మహిళలు బుద్దుని విగ్రహం వద్దకు వెళ్లి ధర్నా చేశారు. తరువాత లేమల్లె వద్ద మహిళల బస్సు ఆపారాని తెలిసింది. మేం బయలుదేరాం. అయితే వారిని అమరావతి పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారని చెబితే మేం అక్కడకు వెళ్లాం. అమరావతి సీఐ ప్రభాకర్ లేమల్లె వెళ్లి, అక్కడ పరిస్థితిని నియంత్రించి ... లేమల్లెలో మహిళలపై దాడి జరిగితే అర్ధ గంట వరకు పోలీసుల స్పందనలేదు. ఆ తరువాత ప్రభాకర్ గారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చి బస్సుని అమరావతి స్టేషన్ కు తెమ్మని డ్రైవర్ కి చెప్పి ఆయన స్టేషన్ కు వచ్చేశారు. కానీ ఆ బస్సుకు ముందు వెనుక సురేష్ గారి అనుచరులు రెండు టాటాఏసీ కారుల్లో ఆ బస్సుని పెదకూరపాడువైపు తీసుకువెళ్లారు. సురేష్ గారు అనుచరులు చెప్పిన రూట్ లో బస్సుని తీసుకువెళ్లారు.  సీఐ ప్రభాకర్ అమరావతి స్టేషన్ లో కూర్చొని బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మేం ఆయనతోనే ఉన్నాం.
వెళ్లే బస్సుని లింగాపురం గ్రామంలో రైతులు బస్సుని ఆపారు. ఆ రైతులు బస్సుని ఆపకపోతే ఆ మహళలకు ఏం జరిగేదో మనం ఊహించలేం. ఆ మహిళలపై కారం చల్లారు. మొదట గొడవ జరిగినప్పుడు కారం చల్లలేదు. సురేష్ గారు ఏదో చెప్పారు వెళ్లారు. ఆ తరువాత సురేష్ గారి బంధువులు, అనుచరులు కారం తీసుకొని వచ్చారు. మేం ఒకే ఒక డిమాండ్ తో ఉద్యమం చేస్తున్నాం. అవకాశం ఉన్నచోట ప్రచారం చేస్తున్నాం. కోటప్పకొండ వద్ద కూడా ప్రభలు కట్టి జై అమరావతి అని నినాదాలు చేశారు. అక్కడ పోటీ నినాదాలు చేయవలసిన అవసరం ఏమిటి?  మా ఉద్యమం పార్టీ రహితం. టీడీపీ నాయకులతోపాటు సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, సీపీఎం నాయకులు వచ్చారు. మా ఉద్యమానికి వైసీపీ తప్ప అందరూ మద్దతు ఇస్తున్నారు. వాటిలో పెద్ద పక్షం, ఎక్కువ కేడర్ ఉంది.
  
నారాయణ మూర్తి – వైసీసీ
అమరావతి కేపిటల్ గా ఉంటుంది. వికేంద్రీకరణలో వైజాగ్ ఒక కేపిటల్, కర్నూలు మరో కేపిటల్.  అమరావతి ఒకటే కాదు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది. అమరావతికి జై.  అది టీడీపీ దాడి. దళిత ఎంపీపై దాడి చేస్తారా?  తాగి ఉంది వారే. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జై పులివెందుల అన్నారంటారు.అన్ని అబద్దాలు మాట్లాడితే ఎలా? చంద్రబాబు రైతులను మోసం చేశారు.


టీడీపీ – అశోక్ బాబు
ట్రంప్ గెలిచినప్పుడు ఈ ట్రంప్ మాకు వద్దని అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ముస్లిమ్స్ అంటే అతనికి వ్యతిరేకత ఉంది. మోడీ గారి మాదిరిగా. మోడీ ఒక్కసారి మసీదుకు వెళితే ఆయన యాంటి ముస్లిం కాదని అంగీకరిస్తాం. ట్రంప్ గారు మన దేశానికి రావడం విశేషం కాదు. ఏ దేశస్తుడైనా మన దేశానికి వస్తే పరస్పర అంగీకారంతో కూడి ఒప్పందాలు జరుగుతాయి. ఇప్పుడు అటువంటివి ఏమీలేవు. ఒక విషయంలో మోడీ గారిని అభినందిస్తున్నాను. రైతులకు వ్యతిరేకంగా ఉంటుందని డెయిరీ ఉత్పత్తులు రాకుండా అడ్డుకున్నారు. ఇరాన్ పై ఆంక్షలు సడలించే ఒప్పదం పెట్టుకుంటే బాగుండేది. ట్రంప్ ఎన్నికలకు వెళుతున్నారు. అవసరం ఆయనది. విదేశీ వాణిజ్య వ్యాపారంలో టాక్స్ లకు సంబంధించి ఒప్పందం చేసుకుంటే బాగుండేది.   హెలికాఫ్టర్స్, ఫ్లైట్స్ యుద్ధ విమానాలు వంటి అగ్రిమెంటు చేసుకొని, మీటింగ్ పెట్టి, తనని గెలిపించండి అని అడుగుతారు. అమెరికాలోని మన దేశస్తులు ట్రంప్ విధానాల వల్ల ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. 90 శాతం భారతీయులు డెమోక్రసీకి మద్దతు. హిల్లరీ ఓడిపోయినా ఆయన భారతీయులతో మంచి సంబంధాలు ఉన్నాయి.  
అమరావతిలో రథోత్సవానికి ఎంపి నందిగం సురేష్ వచ్చిన సందర్బంగా రాత్రి ఏం జరిగిందనేదానికి వీడియోలు ఏమీలేవు. రాత్రి అవడం వల్ల .. సురేష్ అక్కడ వ్యక్తి. వాళ్లు ఓట్లు వేశారు. కృష్ణదేవరాయులు గారు వచ్చారు. మాట్లాడారు వెళ్లారు. భోజనం కూడా చేశారు. గొడవ ఏం లేదు. ప్రొఓకింగ్ స్టేట్ మెంట్లు వస్తే, ఉద్యమ మూడ్ లో ఉన్నవారితో మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాఘవులు గారు నిమ్స్ కు వెళ్లినప్పుడు జై తెలంగాణ అనమని డిమాండ్ చేశారు. నన్ను చంపండి నేను అనని ఆయన వచ్చేశారు. వారి పార్టీ విధానం అది. సురేష్ గారు వారితో సామరస్యంగా మాట్లాడితే బాగుండేది. జై అమరావతి అంటే తప్పులేదు. ఈ రోజు చీఫ్ మినిస్టర్ లెటర్ హెడ్ పైన చీఫ్ మినిస్టర్, అమరావతి అని ఉంటుంది. దీనిని విపరీతమైన యాంగిల్, వైసీపీవారి వ్యతిరేకత. సురేష్ గారు గానీ, ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రీదేవి ఒక రోజు కూర్చొని ఈ పరిస్థితులలో మేం నిర్ణయం తీసుకున్నాం, మీకేమైనా ఉంటే చెప్పండి అని మాట్లాడాలి. సురేష్ అనుచరుల యాటిట్యూడ్. వారు బస్సులో మహిళలను అడ్డుకోవడం తప్పు. మహిళలు ఉద్యమం చేస్తున్నప్పుడు దానిని డీల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది లేదా ఎంపీగా నీది. ఎంపీగా ఆ సిట్యేషన్ ని హ్యేండిల్ చేయలేకపోతే దటీజ్ ఫెయిల్యూర్ ఆన్ యువర్ పార్ట్. ఒకవేళ వారు మహిళలు ఎదురు తిరిగే ఆయన ఫాలోయర్స్ అంతగా స్పందించవలసిన అవసరంలేదు. వారిపై దిశ యాక్ట్ పెడితే ప్రభుత్వం కేసులు రిజిస్టర్ చేస్తుందా? ఈ శ్రీనివాస రావు మొన్నటివరకు ఎక్కడ ఉన్నారు? ఎలా వచ్చారు. ఈ కాంట్రాక్ట్. ఒకసారి ఎంపీ గారు వివరణ ఇచ్చిన తరువాత ఆయనపై దాడి ఎందుకు చేయాలి. ఓ దళితుడుపై ఎందుకు దాడి చేశారు?
అశాంతి క్రియేట్ చేస్తారా? చంపేస్తారా? కొడతారా? ఆయన స్టాండ్ చెప్పారు. ఎందు మాట్లాడాలి. డమ్మీ ధర్నాలు మీరు చేస్తున్నారా? కొంతమందైనా రైతులు ఉన్నారు. రైతులను ముందు పెట్టి, మిగతా వారిని కాంట్రాక్ట్ తెచ్చి.. 29 గ్రామాల్లో చేస్తూ రాష్ట్రం అంతటా.... శ్రీదేవిపైన, రజనీపైన, సురేష్ మీద దాడి చేస్తారు. దళితులపై దాడి చేస్తారు. బీసీలపైన, దళితులపైన దాడులు చేస్తారు. అమరావతి జై ఒకే. విశాఖ, పులివెందుల, అనంతపురం డౌన్ డౌన్ అనమనండి. మిగతావి డౌన్ డౌన్ అని అంటున్నారు.
దళిత సంఘాలు రాత్రికి రాత్రి పుడతాయి. దళితులను కించపరచవద్దు.  అన్ని కులాలు సమానం. అన్నడ ఉన్నది దళితులే ఎక్కువ. బీసీలు ఎక్కువ. రైతుల ముసుగులో గ్రామా ఆర్టిస్టులను, రౌడీలను తీసుకువస్తున్నారు.


సంజీవరెడ్డి – కాంగ్రెస్
ట్రంప్ విశిష్టత అమెరికాలో తగ్గుతోంది. భారతీయులు మద్దతులేకుండా ఈ సారి ఆయన గెలిచే అవకాశంలేదు. ఇక్కడ మోడీ పరిస్థితి కూడా అదే. ప్రతిదేశానికి మన దేశం మంచి మార్కెట్. ఆయుధాలు అమ్ముకుంటానే ఆయన వస్తున్నారు. సాంమ్రాజ్యవాదం దేశం అమెరికా. మనది అలీన విధానం. మోడీ ట్రంప్ కు స్నేహం కాదు, దేశాల మధ్య స్నేహం ఉందాలి. పార్టీ అంటే వ్యక్తలు గుర్తుకు వస్తారు. టీడీపీ అంటే చంద్రబాబు, వైసీపి అంటే జగన్, కాంగ్రెస్ అంటే రాహుల్ ... ఇటువంటిపోవాలి. సమిష్టి బాధ్యత తీసుకోవాలి. ట్రంప్ పర్యటన దేశప్రయోజనాలకు ఉపయోగపడాలి. ఆయన వస్తున్నాడని గోడలు కట్టడం ఏమిటి? అమెరికాలో మనవారు రాత్రి 7 తరువాత బయటకు వెళ్లే పరిస్థితి ఉందా? మనదేశంలో పేదరికం ఎవరికి తెలియదు?
అమరావతిది హిస్టారికల్ ఈవెంట్. ప్రపంచంలో ఎక్కడా 33వేల ఎకరాలు రైతులు ఇవ్వడం జరగలేదు. వారి త్యాగం రైతులకు, రైతు కూలీలకు దక్కుతుంది. దానిని మరచిపోతే తెలుగువాడిగా తలదించుకోవలసి వస్తుంది. ప్రజాప్రతినిధులు వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పాలి. దానిని ఉపయోగించుకోవడం చేతగాక వారిని అవమానిస్తున్నారు. 30వేల మంది రైతులను .. 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని లేదు. అక్కడ మట్టి మెత్తగా ఉంది. నాగార్జున యూనివ్సిటీలో, మంగళగిరిలో కట్టండి. విశాఖ ఎందుకు తరలించారా? కారు గుద్దినప్పుడు ఎవరైనా ఒకరు దిగి చూశారా? అమరావతి రైతులు త్యాగం సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉంటుంది.

రఘురామ్ – బీజేపీ
అతిధిదేవోభవ అనేది మన సంప్రదాయం. దేశప్రయోజనాల కోసం మోడీ వ్యవహరిస్తారు. జపాన్ ప్రధాని వచ్చినా ఇదేవిధంగా ప్రవర్తించారు. వాణిజ్య ఒప్పందాలు వంటివి ఉంటాయి. పొర్లు దండాలు పెట్టడంలేదు. ద్వైపాక్షిక సంబంధాల కోసం మోడీ ప్రయత్నం. పాకిస్తాన్.. శత్రువు తల్లికి పాదాభివందనం చేశారు. అది భారీతీయ సంప్రదాయం. చైనా అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా అలాగే చేశారు. దేశ ప్రధానిగా ఆయన వ్యవహరిస్తారు. దేశ ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి. ఒక దేశ అధ్యక్షుడు భారతీయ ఓటర్లపై ఆధారపడడ్డారంటే అది భారతీయుల గొప్పదనం. అమెరికాతో మన దేశానికి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ వస్తే అయిపోయింది, అల్లుడు కోసం, కూతురు కోసం వచ్చారనేది కాదు. అనేక దేశాలతో వ్యాపారాలు చేస్తాం, అగ్రరాజ్యంతో సంబంధాలు ఉంటే మంచిదేకదా. ఇరాన్ నుంచి పూర్తిగా ఆయిల్ కొనకుండా ఏంలేదు. మోడీ యాంటి ముస్లిం కాదు. మోడీ మసీదుకు ఎందుకు వెళతారు? ఎవరి విశ్వాసాలు వారివి. మోడీ గారు ముస్లింలకు వ్యతిరేకత అనేది దుష్ప్రచారం చేస్తున్నారు. (దేశంలో 17 శాతం ముస్లింలు)
రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పేపర్లలో వచ్చాయి. ఉద్యమాన్ని అణగార్చే ప్రయత్నం జరుగుతుందా? రైతులు వచ్చి కారాలు కొట్టడం లాంటి చర్యలు లేవు. టీడీపీ మేజర్ రోల్ ఉంటుంది. రాజకీయంగా మారిపోతోందా?

ఎంఏ గఫూర్ – సీపీఎం
ఆధిపత్యం వహించే అగ్ర రాజ్యం అమెరికా. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు అన్న ధోరణిగా ఉంటుంది. వారిప్రయోజనం ముఖ్యం. ఇతరుల ప్రయోజనం వారికి అవసరంలేదు. అమెరికా అధ్యక్షుడు వస్తుంటే మన జనం కనిపించకుండా గోడలు కట్టారు. వ్యక్తిత్వం లేని విధాం. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం ఉందని అందరికీ తెలుసు. అమెరికా ఆధిపత్యంలో ఒక పార్టనర్ గా భారత్ ని ఎంపిక చేసుకుంది. ఒకప్పుడు చైనాకి వ్యతిరేకంగా పాకిస్తాన్ తో ఆ రకమైన సంబంధాలు  ఉండేవి. ఇప్పుడు ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్.  మనం ఇరాన్ వద్ద ఆయిల్ కొంటున్నాం. అక్కడ ఆయిల్ కొనవద్దని మోడీ చెప్పేశాడు. చాలా చీప్ రేటుకు అక్కడ కొంటున్నాం. మనం ఎవరితో స్నేహంగా ఉండాలో ఆ స్వేచ్ఛ మనకి ఉండదు. వారే చెబుతారు ఎవరితో స్నేహం చేయాలో. ఇండియన్ ఆర్మీ ఏ ఆయుధాలు వాడాలో అమెరికా చెబుతుంది. దానికి సరండరైంది మన ప్రభుత్వం. అమెరికా పక్తు బిజినెస్ దేశం. ట్రంప్ మోస్ట్ అన్ పాపులర్. అనైతిక వ్యవహారాలలో ఇతను ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఇంపీచ్ మెంట్ ఎదుర్కొన్న వ్యక్తి ఇతనే. ఇతను వచ్చిన తరువాత భారతీయులపై ఆంక్షలు ఎక్కువైయ్యాయి. భారతీయులను తరేమేస్తున్నారు ఇతర దేశాల అధ్యక్షులు రావడంలో తప్పులేదు. కానీ ఇంత ఆర్భాటం పనికిరాదు. దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఇరాన్ లో రెండవ ర్యాంకులో ఉన్న వ్యక్తిని చంపారు. మనది అలీన విధానం. ఇప్పుడు సామ్రాజ్యవాదానికి మద్దతు పలుకుతున్నారు. కోవాడ భూములపై ట్రంప్ అల్లుడు కన్నుపడిందంటున్నారు. ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది. అమెరికా ఆయుధ వ్యాపారానికి ఉపయోగపడుతున్నారు.
29 గ్రామాల ప్రజలు ఉద్యమం. ఈ ఆందోళన 2 నెలలుగా జరుగుతుంది.  ప్రజాప్రతినిధులను అడుగుతుంది. వారితో ఎందుకు మాట్లాడరు?  33వేల ఎకరాలు, నవ నగరాలు మేం వ్యతిరేకించాం. వారు ఆశించారు. వారిని నమ్మించారు. వారి మనోవేధన, వారి ఆందోళన చేస్తున్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులని కించపరుస్తున్నారు. కొంతమంది రైతులతో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అక్కడ ఉద్యమం జరుగుతుంది వాస్తవం.  ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఎక్కడ ఉంటే అదే రాజధాని. జనంలో అసంతృప్తి ఉంది. వారిని నచ్చజెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానిది, స్థానిక ప్రజాప్రతినిధులది.
వైసీపీవారు జనం వద్దకు వెళ్లకుండా వారిని రెచ్చగొడతారా? మీకు తెలిసిందే అంతా సర్వసం అనుకుంటే కుదరదు. రైతులు రాజధానికి భూములు ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని ఉరి తీయండి. రైతులను ఇబ్దంది పెడుతున్నారు. ఒక సమస్యతో రాష్ట్రం మొత్తం మంట పెట్టారు. సురేష్, ఆర్కే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, వారు పరిష్కరించాలి. రెచ్చగొట్టకూడదు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా సెక్రటేరియేట్ ని అడ్డుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ రోడ్డుపై కూర్చొని తనని రక్షించమన్నారు. ఉద్యమాలను ఎన్నాల్లు అణచివేస్తారు. ప్రజలు మిమ్మల్ని అణచివేస్తారు. మీ వెంట పాదయాత్రలో పాల్గొన్నవరందరూ పెయిండ్ ఆర్టిస్టులు అంటారు. పోలీసు బలం ఉందని రెచ్చగొట్టవద్దు.


Feb 22, 2020

మంత్రి మండలి ఉపసంఘం – సిట్
v గత టీడీపీ  ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు విచారించేందుకు వైసీపీ జగన్ ప్రభుత్వం సిట్ (SIT - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ –ప్రత్యేక దర్యాప్తు బృందం)ని (జీఓ నెం344. తేది 20.02.2020) నియమించింది.
v   ‘‘రాష్ట్ర విభజన తర్వాత... నవ్యాంధ్ర అభివృద్ధిపై ప్రభావం చూపించేలా తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు (కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు మొదలైనవి), ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై 2019 జూన్‌ 26వ తేదీన(జీఓ నెం.1411)
 
 మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
మంత్రి మండలి ఉపసంఘం సభ్యులు
v 1.బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
v 2.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
v 3.కురసాల కన్నబాబు
v 4.అనిల్ కుమార్ యాదవ్
v 5.మేకపాటి గౌతమ్ రెడ్డి
v 6. మన్మోహన్ సింగ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ

v సీఆర్డీయే పరిధిలో భూముల కేటాయింపుతో సహా పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ, ఆర్థిక పరమైన అవకతవకలను, మోసపూరిత లావాదేవీలను గుర్తించింది. దీనిపై నిశితంగా చర్చించిన తర్వాత... ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రత్యేక ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు ఆ జీవోలో పేర్కొన్నారు.
v  గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్‌ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారని గుర్తు చేశారు.
v  గత ఐదేళ్ల పాలనలో హద్దులులేని అవినీతి జరిగిందని, 2014 డిసెంబర్‌ 30 రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, గత మంత్రులు, శాసనసభ్యులు, బినామీలు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే వారిపై భూములు కొనుగోలు చేశారని  మంత్రి మండలి ఉపసంఘం నివేదికలో పేర్కొన్నట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

v సిట్‌లో సభ్యులు
1.కొల్లి రఘురామ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ. (సిట్‌ అధిపతి)
2.బాబూజీ అట్టాడ, విశాఖ ఎస్పీ
3.సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు,
4..శ్రీనివాస రెడ్డి, కడప అదనపు ఎస్పీ
5.జయరామరాజు, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ
6.విజయ భాస్కర్‌- విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ
7.ఎం. గిరిధ ర్‌, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ
8.కెన్నడీ, ఏలూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌
9. శ్రీనివాసన్‌, ఇన్‌స్పెక్టర్‌ (నెల్లూరు జిల్లా)
10.వి. రాజశేఖరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ (గుంటూరు జిల్లా)
సిట్ కు ప్రత్యేక అధికారాలు
v డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ కు ఏ వ్యక్తినైనా/అధికారినైనా పిలిపించి విచారించే అధికారం అప్పగించారు.  
v    వారు లక్ష్యంగా  చేసుకున్న కొందరు వ్యక్తులను విచారించి  ఇరుకున పెట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
v   ఈ సిట్‌కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్‌హోదా కల్పించడం గమనార్హం. దీని ఉద్దేశం ఏమిటనే అంశంపైనా చర్చ జరుగుతోంది.




 చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ‘సిట్’


      అమరావతి, ఫిబ్రవరి 21: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు విచారించేందుకు వైసీపీ జగన్ ప్రభుత్వం సిట్ (SIT - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ –ప్రత్యేక దర్యాప్తు బృందం)ని నియమించింది.  ఆ ప్రభుత్వంలో అవకతవకలు జరిగినట్లు  మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది.  ఆ సంగతి తేల్చేందుకు ప్రత్యేక సంస్థ అవసరమని నిర్ణయించి... సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదల చేసింది. ‘‘రాష్ట్ర విభజన తర్వాత... నవ్యాంధ్ర అభివృద్ధిపై ప్రభావం చూపించేలా తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు (కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు మొదలైనవి), ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై 2019 జూన్‌ 26వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సీఆర్డీయే పరిధిలో భూముల కేటాయింపుతో సహా పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయ, ఆర్థిక పరమైన అవకతవకలను, మోసపూరిత లావాదేవీలను గుర్తించింది. దీనిపై నిశితంగా చర్చించిన తర్వాత... ఈ మొత్తం వ్యవహారంపై ఒక ప్రత్యేక ఏజెన్సీతో దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని స్పీకర్‌ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారని గుర్తు చేశారు.
సిట్‌కు దిశా నిర్దేశం...
సిట్‌ పనితీరు - విధి విధానాలను కూడా జీవోలో పొందుపరిచారు. దీనిప్రకారం... సిట్‌ అధికారులు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) ప్రకారం ఆయా అంశాలపై విచారణ చేయవచ్చు. కేసు రిజిస్టర్‌ చేసి దర్యాప్తు చేయవచ్చు. అలాగే... సంబంధిత సమాచారాన్ని అవసరమైతే రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవడంతోపాటు సమన్వయం చేసుకోవాలి. అంతేకాదు... తాము దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించుకుని, వారి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం కూడా సిట్‌కు ఉంటుంది. ఇక... ఆయా అంశాలకు సంబంధించిన ఎలాంటి రికార్డులనైనా తెప్పించుకుని పరిశీలించవచ్చు. సిట్‌కు అన్ని శాఖలు, అందరు అధికారులు సహకరించాల్సిందే. ఇదే జీవోలో పోలీసు స్టేషన్‌ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సిట్‌నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు.
సాధారణంగా ఒక సంచలన సంఘటన, విస్తృతమైన పరిధి ఉన్న అంశంపై సమగ్రమైన, ప్రత్యేక దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తుంటారు. ఉదాహరణకు.... వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారు. విశాఖ భూముల లావాదేవీలపైనా సిట్‌ వేశారు. ఇందులో భూములతోపాటు మోసం, నేరాల కోణం కూడా ఉండటంతో రెవెన్యూతోపాటు పోలీసు అధికారులను నియమించారు. కానీ... ఇప్పుడు నిర్దిష్టంగా ఒక్క అంశంపై కాకుండా, ‘హోల్‌సేల్‌గా ఐదేళ్ల కాలంలో తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలపై సిట్‌ వేయాలని నిర్ణయించడంపై అధికార వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పైగా... సిట్‌ అధిపతితోపాటు సభ్యులందరూ పోలీసు విభాగానికి చెందిన వారే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 50కి పైగా విభాగాలు తీసుకున్న నిర్ణయాల్లో లోటుపాట్లపై వీరు దర్యాప్తు చేయడం సాధ్యమేనా? పాలనా నిర్ణయాల్లో లోటుపాట్లపై వీరికి అవగాహన ఏముంటుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
అదీ ఇదీ అనేమీ లేదు! హోల్‌సేల్‌గా... సిట్‌! రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న, అమలు చేసిన అన్ని  ప్రధాన నిర్ణయాలు, అప్పగించిన కాంట్రాక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలన్నింటిపైనా దర్యాప్తు జరిపించాలని జగన్‌ సర్కారు తీర్మానించింది. దీనిపై ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామ్‌ రెడ్డి నేతృత్వంలో... మొత్తం 10 మంది పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. దీనిపై సాధారణ పరిపాలన విభాగం (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం రాత్రి జీవో నెంబరు 344 జారీ చేశారు.

సిట్‌లో సభ్యులు
కొల్లి రఘురామ్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ. (సిట్‌ అధిపతి)
బాబూజీ అట్టాడ, విశాఖ ఎస్పీ
సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు,
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ-2
శ్రీనివాస రెడ్డి, కడప అదనపు ఎస్పీ
జయరామరాజు, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ
విజయ భాస్కర్‌- విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ
ఎం. గిరిధ ర్‌, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ
కెన్నడీ, ఏలూరు రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌
ఐ. శ్రీనివాసన్‌, ఇన్‌స్పెక్టర్‌ (నెల్లూరు జిల్లా)
వి. రాజశేఖరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ (గుంటూరు జిల్లా)

సిట్‌కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్‌హోదా
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఉన్నతస్థాయిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇదివరకే నియమించారు. కేబినెట్‌లో నంబర్‌ 2 లాంటి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పార్టీలో నంబర్‌ 2గా భావించే విజయసాయి రెడ్డి, అధికారుల స్థాయిలో ద్వితీయస్థానంలోని అప్పటి ప్రత్యేక సీఎస్‌ (రెవెన్యూ) మన్మోహన్‌ సింగ్‌ ఇందులో సభ్యులు. వీరు గుర్తించిన అవకతవకలపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటే... మరింత ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలి. అలా కాకుండా... డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ వేశారు. అందులోనూ... సిట్‌ ఏ వ్యక్తినైనా/అధికారినైనా పిలిపించవచ్చుఅని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో కొన్నాళ్లు సీఎస్‌గా పనిచేసిన, ఇప్పుడు కేబినెట్‌ ర్యాంకులో సలహాదారుగా ఉన్న అజేయ కల్లం లాంటి వారిని డీఐజీ ర్యాంకు అధికారి పిలిపించడం సాధ్యం కాదని... తాము టార్గెట్‌గా పెట్టుకున్న కొందరువ్యక్తులను విచారణ ముందు నిలబెట్టి, ఇరుకున పెట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిట్‌ ఏర్పాటు ఉత్తర్వును శుక్రవారం సాయంత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినప్పటికీ రాత్రి 9 గంటల వరకు దాన్ని రహస్య జీఓగా ఉంచారు. ఆ తర్వాతే విషయాన్ని బయటపెట్టారు. ఏ అంశంపై నియమించిన సిట్‌ అయినా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. అంతటితో దాని బాధ్యత పూర్తవుతుంది. నివేదికపై తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ... ఈ సిట్‌కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్‌హోదా కల్పించడం గమనార్హం. దీని ఉద్దేశం ఏమిటనే అంశంపైనా చర్చ జరుగుతోంది.
-----------------------------------------------------------------------------------------------------

GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT

Enquiries & Investigation – Constitution and composition of Special Investigation Team (SIT) to investigate the irregularities highlighted by Cabinet SubCommittee formed vide G.O. Rt. No. 1411, General Administration (Cabinet.I) Dept., dt: 26.06.2019 – Orders – Issued
 ------------------------------------------------------------------------------------------------------------------
GENERAL ADMINISTRATION (SC.D) DEPARTMENT
G.O. RT. No: 344 Dated: 21.02.2020. Read:
G.O. Rt. No. 1411, General Administration (Cabinet.I) Dept., dt: 26.06.2019 ***

ORDER:
1. In the G.O., read above, a Cabinet Sub-Committee was constituted to review Major Policies, Projects, Programmes, Institutions established (Corporations, Societies, Companies, etc), and key Administrative Actions since Bifurcation of Andhra Pradesh State on June 02, 2014 impacting State’s Development. The SubCommittee presented first part of the report to the Government, which highlighted the various procedural, legal and financial irregularities and fraudulent transactions concerned with various projects, including the issues related to land in the CRDA region. After thorough discussion and subsequent acceptance, the Government decided to get the issue enquired by a specialized agency. During the discussion held in the last session in the Andhra Pradesh Legislative Assembly, on the above stated report, the Hon’ble Speaker of the Legislative Assembly directed the Government to initiate a systematic and comprehensive investigation into the subject matter.
2. After careful examination of the matter, the Government have decided to constitute a Special Investigation Team (SIT). The Terms of Reference of the SIT are at para 4 below.
 3. Accordingly, Government hereby constitute a SIT consisting of the following Officers:

S.No. Details of Officers         Designation

1 Dr. Kolli Raghuram Reddy, IPS, DIG, Intelligence Head
2 Sri Babujee Attada, IPS, SP, Visakhapatnam Member
3 Sri Ch. Venkata Appala Naidu, IPS, SP – II, Intelligence Member
4 Sri Srinivas Reddy, Addl SP, Kadapa, Member
5 Sri Jayarama Raju, DSP, Intelligence Member
6 Sri Vijaya Bhaskar, DSP, Vigilance & Enforcement Member
7 Sri M. Giridhar, DSP, Intelligence Member
 8 Sri Kennedy, Inspector, Eluru Range Member
9 Sri I. Srinivasan, Inspector, Nellore District Member
10 Sri S.V. Rajashekar Reddy, Inspector, Guntur Dt. Member

4. The SIT will have the following terms of reference:
i. To enquire, register, investigate and conclude the investigation according to the provisions of CrPC, on the subject matter.
ii. To function as a nodal single point contact, including for sharing of information and coordinating if necessary, with the State and Central Investigating Agencies.
5. The SIT would have powers to call for any person/officer in connection with the enquiry and investigation, to record his/her statement as per the provisions of CrPC.
 6. The SIT can call for and examine any record pertaining to the issues / land transactions in various aspects.
7. All Departments and officers shall provide necessary assistance to the SIT for proper discharge of its functions.
 8. All the consequential notifications under CrPC to enable the functioning of SIT as Police Station shall be issued by the concerned departments. (BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)
 PRAVEEN PRAKASH PRINCIPAL SECRETARY TO GOVERNMENT, GAD (POLL)
To
 The Members of Special Investigation Team (SIT).
 The Special Chief Secretary to Government (Land), Revenue Department.
The Chief Commissioner of Land Administration & Special Chief Secretary, A.P., Vijayawada.
 The Director General of Police (HoPF), A.P., Mangalagiri.
Copy to:
The Prl. Secretary, All Departments.
 The Prl. Advisor to Chief Minister.
The P.S. to Deputy Chief Minister (Revenue).
The P.S. to Chief Secretary/Principal Secretary (Political). SC/SFs.

 //forwarded: by order//
SECTION OFFICER (SC)

Feb 21, 2020

చంద్రబాబు ఆస్తుల ప్రకటన - 25 లక్షల ఇళ్ల స్థలాలు



టీవీ 24X7 - తేదీ: 21.02.2020 శుక్రవారం ఉదయం 7.30 గం. నుంచి
అంశాలు :   చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన -  25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
యాంకర్ :  వెంకటకృష్ణ

గురజాల మాల్యాద్రి – టీడీపీ
రాజు ఎలా ఉంటో ప్రజలు అలా అని ఒక సామెత ఉంది. ప్రక్షాళన టాప్ నుంచే ప్రారంభం కావాలి. మార్పు కూడా అంతే. తరువాత అన్ని లేయర్లకు సర్క్యులేట్ అవుతుంది. అనేక దేశాలలో, మన దేశంలో, రాష్ట్రంలో కూడా ప్రధాన నేతలు ట్రాన్సఫరెన్సగా ఉండాలని కోరుతున్నారు. డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తరువాత ప్రజాప్రతినిధుల ఆస్తులు ప్రకటించే విధానం తీసుకువచ్చారు. అన్నహజారే మూమెంట్ లో భాగంగా తీసుకువచ్చారు. 9 ఏళ్ల నుంచి. సాక్షి అవినీతి మీడియా పుత్రిక మొదటి పేజీలోనే ప్రచురిస్తోంది. దానికి ప్రాధాన్యత లేకపోతే అంబర్ అయితే  ఎందుకు ప్రచురిస్తోంది. వైసీపీ చీఫ్ విప్, జగన్ కు అత్యంత సన్నిహితుడు పక్కపక్క నియోజకవర్గాలు. చిత్తూరు జిల్లాలో ఆరణి నుంచి శ్రీకాకుళం ఇసుక క్వారీలు దాకా వారు మేసేస్తున్నారు. తోలేస్తున్నారు. ఆయన రియాకర్ట్ అయి నీతి వ్యాఖ్యలు చెబుతున్నారు. శ్రీకాకుళంలో, చిత్తూరు జిల్లా సత్యవేడు దగ్గర క్వారీల వద్ద విచారించండి. ఏమీ పట్టించుకోనోళ్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా రాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల నుంచి ప్రకటిస్తున్నారు.  జగన్మోహన రెడ్డి నా అస్తులు ఇవి అని ప్రకటించి, ఏమైనా ఉంటే చెప్పు. ఎందుకు ప్రకటించడంలేదు. తేలుకుట్టిన దొంగలా. ప్రతిదానికి కౌంటర్ చేసే పెద్ద మనుషులు దీంట్లో తేలుకుట్టిన దొంగలా ఉన్నారు. కలుగులో దాక్కుంటున్నారు.
మొన్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఖర్చు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఖర్చు పెట్టారా? 5 కోట్ల ఆంధ్రులు చూశారు గదా.
వారు కూడా 2004లో 9 లక్షల కోట్లు ఐటీ కట్టారు. తరువాత జగన్ 5,6 వందల కోట్లు ఐటీ కట్టారు. ఇంతేనా అడ్వాన్స్ ఐటీ అని నేను అడగను. అదైనా చెప్పండి. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఖననం చేస్తే లేదా దెబ్బతీస్తే ప్రయోజనం ఉండదు. వారి వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి. జగన్మోహన రెడ్డి వ్యక్తిత్వాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేయండి. జగన్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత రాజకీయాల్లో డబ్బు పాత్ర, ఆర్థి ఉగ్రవాదం వచ్చినట్లు సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చంద్రబాబు కాదు, ఆయన మొన్న ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టలేకపోయారు. చతికిలబడ్దాడని అందరికీ తెలుసు. మీరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని అందరికీ తెలుసు. మీ నేరాలననీ చంద్రబాబు నాయుడుకు ఆపాదించి- ఈ రోజు హింసా సంస్కృతి పెరిగింది. లక్షసార్లు అబద్దాలు చెప్పి ...
ఈనాడు బ్యేనర్ ఐటంగా వేసింది కాపురం ఉండే గుడెసెని జేసీబీతో కొట్టివేసి 2.5 సెంట్లు ఉంటే, 1.5 సెంట్లు ఇస్తామంటున్నారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో 2.5 సెట్లు స్థలం ఇచ్చింది. దాన్ని లాక్కొని 1.5 సెంట్లు ఇస్తామంటున్నారు. టౌన్ లో 2 నుంచి 1కి కట్ట చేశారు. విశాఖలో ఎస్టీ,ఎస్సీ, మైనార్టీలు సాగు చేసుకుంటున్న 10వేల ఎకరాలు లాక్కొని వారికి ఇస్తారట. అక్కడ ప్రభుత్వ భూమి 4వేల ఎకరాలు ఉన్నాయి. ఈ 4వేల ఎకరాలు అమ్మేస్తారట. వైసీపీ నాయకులు వాటిని తక్కువ రేటుకు కొనుక్కొని దోచుకుంటారట. ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వరట. పేదల భూములే కబ్జాచేసి ఇస్తారట. విశాఖలో 4వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందా?లేదా? అది ఇవ్వవచ్చు గదా. అవి నవ మోసాలా? నవరత్నాలా?
ఇళ్లు కట్టకుండా కట్టినట్లు రికార్డు సృష్టించి తిరేశారు. 14లక్షల ఇళ్లు పేపర్ మీదే ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పది లక్షలు కట్టించి ఇచ్చారు. ఇంకా పది లక్షలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క అమరావతిలోనే 5024 ఇళ్లు కట్టి ఉన్నాయి. వాటిని పేదలకు ఇవ్వవచ్చు గదా.

కుటుంబ రావు – టీడీపీ
ఎవరు విమర్శ చేస్తున్నారో మొదట వారి ఆస్తులు ప్రకటించి విమర్శ చేస్తే బాగుంటుంది. వారు కొన్న ధర తెలుపుతారా? మార్కెట్ విలువ తెలుపుతారా?  ఏ విధంగా చేస్తారనేది అందరికీ తెలుస్తుంది.  అవతల మనిషిని విమర్శించే ముందు మనం ఒక గాజు ఇంట్లో ఉన్నాం, అవతల మనుషులు రాళ్లు వేస్తే ఆ గాజు పగిలిపోతుందనేది అర్ధం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు దశాబ్దం నుంచి ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఫిబ్రవరి చివరి వారంలో ఆస్తులు ప్రకటిస్తారు.  అసలు విలువ, మార్కెట్ విలువకు తేడా ఉంది. 2019లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు వైఎస్ జగన్ గారి అఫిడవిట్ తీసుకుందాం. భారతీ సిమెంట్ లో ఆయన పెట్టుబడి పెట్టిన విలువ చూపించారా? అదే కంపెనీలో తన కొన్న వాటాని ఫ్రెంచ్ కంపెనీకి అమ్మిన రేటు విలువ  చూపించారా? ఆయన అండర్ వ్యాల్యూ చేసి చూపినది వందలు కాదు వేల కోట్లు. పబ్లిక్ డిబేట్ కు వద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు  ఆస్తులు ప్రకటించారు. ఈ పేపర్లు, జగన్ గారి పేపర్లు పక్కన పెట్టి చూస్తే ఎవరు మార్కెట్ విలువ చూపించారో తేటతెల్లం అవుతుంది. సాంప్రదాయాలు, ట్రాన్సఫరెన్సీ ముఖ్యం. ఆర్టీఏ కింద అడిగితే వివరాలు ఇవ్వరు. అందుకు అనుమతిలేదు. ఎవరైతే తప్పు చేయలేదు అనుకుంటారో వారు నేను తప్పు చేయలేదు, నా ఆస్తులు ఇవి.... బినామీ ఆస్తులు అని నోటికి వచ్చినట్లు వాగేవాళ్లు ఎక్కువైపోయారు. ఈ ఆస్తులు కాకుండా బినామీ ఆస్తులు ఉంటే ప్రభుత్వం తీసుకోమని లోకేష్ గారు చెప్పారు. ఇందులో ప్రత్యేకత లేదంటే మీరు కూడా చూపించండి. ఒక ఏడాదిలో వారి ఆస్తులు పెరిగిన తీరు, పెద్ద మొత్తం వారి ఖాతాలోకి వచ్చిందో తెలుస్తుంది కదా. సింపుల్ కాదు. దమ్ము ధైర్యం ఉంటే ప్రకటించండి. ఏ సంవత్సరంలో ఎక్కవచ్చింది? ఏ సంవత్సరంలో నష్టం వచ్చింది? అన్ని తెలుస్తాయి. ప్రజలు గమనిస్తారు. ఎన్నికలలో పోటీ చేసే ప్రతి వ్యక్తి కుటుంబం ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం ఎన్నికల సంఘం తప్పనిసరి చేయాలి. అది ఏ పార్టీ అయినా సరే. ప్రజా జీవితంలో ఉన్నవారు పంచాయతీ జీవితంలో ఉన్నవారు. ప్రజల పన్నులతో అభివృద్ధి చేసేటప్పుడు ప్రజలకు రైట్ ఉంది. యూఎస్ఏ లో ట్రంప్ అంతకు ముందు వ్యాపారవేత్త. ఆయన కుటుంబ ఆస్తులు వివరాలు పబ్లిడొమైన్ లో పెట్టారు. అప్పడ తప్పనిసరి.

గోవింద రెడ్డి – వైసీపీ
ప్రతి పౌరుడు ప్రతి సంవత్సరం ఐటీకి తన ఆస్తులు తెలపాలి. ఒక కంపెనీ షేర్ విలువ 2 లేక 3 వేలు ఉండవచ్చు. రూ.10 ల ఫేస్ వ్యాల్యూ మాత్రమే చూపుతాం. అది వాస్తవ విలువ కాదు. రాజకీయ వ్యవస్థలో ఆయన సొంత ఆస్తే కాకుండా బ్లాక్ మనీ, బినామీల ద్వారా వేలాది కోట్లు ఎన్నికల ఖర్చు ఏ విధంగా ఎకౌంట్ ఫర్ అవుతుందని ప్రజలలో ఒక అభిప్రాయం ఉంది. ఐటీ వారు కొద్ది రోజుల క్రితం ఆయన పీస్ ఇంట్లో వెతికి, డైరీలు కనుకున్నారు. దాదాపు 2వేల కోట్లు మిగతావాళ్లకే డబ్బు ఇవ్వడం.. ఐటీ చూపించేటప్పుడు వీరు ఇచ్చే డిక్లరేషన్ కు ఏ విధంగా ట్రాన్స్ ఫరెన్సీ ఉంటుంది? ప్రజలకు నమ్మకం కలిగే అవకాశం లేదు. షేర్ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుస్తుంది. అది ప్రకటించవచ్చు. హెరిటేజ్ కంపెనీ గ్రోత్ బాగానే ఉంది. ఆయన ఆస్తుల ప్రకటనకు ప్రజలకు నమ్మకం ఉండదు. దానిని సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ జూన్ 31న ఐటి రిటన్స్ కోసం ప్రకటిస్తారు. డబ్బు ప్రభావం రాజకీయాలలో విపరీతంగా పెరిగిందని అందరూ అంటారు. ఎన్నికలలో పోటీ చేస్తే చట్టపరంగా ఆస్తులు ప్రకటించాలి. మార్చి ఏప్రిల్ లో ఐటీకి చూపించేవి ఈ రోజు ప్రకటించడం రియాల్టీకి దగ్గరాలేవు. ప్రతి రాజకీయ నాయకుడు పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి అందరూ ప్రకటించే విధంగా డిమాండ్ చేద్దాం. చేయిద్దాం. చంద్రబాబు గారు తన వైట్ మనీ వంద కోట్లు చూపించారు. వారికుండే ఇన్ఫ్లియన్స్ వల్ల రేపు ఎన్నికలలో పెట్టు 8వేలు లేదా పది వేల కోట్లు ఏ విధంగా తీసుకువచ్చి ఖర్చు పెడుతున్నారు, రాజకీయ వ్యవస్థని కలుషితం చేస్తున్నారో చెప్పకుండా ఈయన ఎంత డిక్లేర్ చేసినా ఫలితంలేదు. ఎన్నికల ఖర్చు విషయంలో వ్యవస్థ ఆ విధంగా ఉంది. చంద్రబాబు డిక్లేర్ చేయడం వల్ల ఈ వ్యవస్థలో మార్పు రాదు. దాని వల్ల ఏమీ మేలు లేదు. ఎన్నికలలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టడంలేదని ఆయన, ఆయన పార్టీ నాయకులు ఒక వాగ్ధానం తీసుకొని మీ లాంటి వాళ్లందరినీ నమ్మించండి. అప్పుడు పవిత్రత ఉంటుంది.
నవరత్నాల కార్యక్రమంలో మోస్ట్ ఛాలెంజింగ్ స్కీమ్. మిగతా పథకాలు సులభం. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలనేది జగన్ గారి ఆలోచన. పట్టణ ప్రాంతాల్లో భూమి సమస్య వచ్చింది. ప్రభుత్వ భూములు ఆక్రమించారు. వారి వద్ద భూమి తీసుకోవాలంటే సమస్యలు వస్తున్నాయి. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించడం ఛాలెంజ్. బద్వేలు లో కూడా 150 ఎకరాలు కావాలి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

(1995లో కుటుంబానికి రెండు సెట్ల స్థలం ఇచ్చారు. ఇక్కడ షెడ్ మాత్రమే వేశారు. దానిని ఇప్పుడు తీసుకుంటాం అంటున్నారు. కొత్త జాబితాలో ఆ భూమి స్వాధీనంలో ఉన్నవారి పేర్లు లేవు.) ఇలాంటిదే బద్వేలులో సంధ్య టౌన్ షిప్ సమస్య వచ్చింది. జిల్లా కలెక్టర్ వచ్చి వారి వద్ద తీసుకోవడం మంచిదికాదన్నారు. అటువంటి విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి పట్టా ఇవ్వనివి  తీసుకోవచ్చు. వ్యవసాయం చేసే డీకేటీ భూములను ముట్టుకోవద్దని జగన్ గారు చెప్పారు.
ఇది ఛాలెంజింగ్ జాబ్ అని ముందే చెప్పాను. గ్రామాల్లో భూమి సమస్య పెద్దగా లేదు. పట్టణాలలోనే సమస్య. ఇబ్బంది కరమైన పరిస్థితి ఉందని చెప్పడం సరికాదు.

తులసిరెడ్డి – కాంగ్రెస్
ఆస్తుల ప్రకటన ఎన్నికల అఫిడవిట్ – ఐటీ రిటన్స్ – స్వయంగా ప్రకటించడం. ఇది తెలుస్తుంది. ఎవరు చేసినా మంచిదే. ఎవరు చేసినా నల్లధనం చేయరు. బినామీ ఆస్తులు, బంగారు బిస్కెట్లు, నేలమాళిగలో ఉండే నోట్ల గురించి చెప్పరు. ఒక్క తెల్లధనం గురించి మాత్రమే చెబుతారు.  తెల్లధనానికి మించి నల్ల ధనం కనీసం వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ స్థాయి నాయకులకు. ఎన్నికల ఖర్చు శాసనసభకు రూ.25 లక్షలు. పులివెందులలో ఓటుకు రూ.1500 పంచారు. కొన్ని చోట్ల మూడు వేలు, పదివేలు పంచారు. అందరికీ తెలుసు. ఆ 30 కోట్లు చూపించి ఉంటారా? చూపించరు. ఇది చర్చకు పనికి వస్తుంది. మార్కెట్ విలువ, అసలు విలువ అనేది చర్చ. చంద్రబాబు నాయుడు గారు చూపించినది రూ.111 కోట్లు. బాబు గారికి రూ.9కోట్లు, దేవాంషకు రూ.19 కోట్లు, భువనేశ్వరి గారికి రూ.50 కోట్లు, లోకేష్ రూ.24 కోట్లు, బ్రహ్మణి గారికి రూ.16 కోట్లు. జగన్ ప్రకటిస్తే ఒ పది రెట్లు ఎక్కువ ప్రకటించవచ్చు. ఇందిరా గాంధీ ఆ తరువాత ఎన్టీఆర్ హయాంలో ఇళ్లు ఇచ్చారు. ఆ తరువాత వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ గారు శాస్యురేషన్ కాన్సెప్ట్ తో ఇచ్చారు. స్థలాలు కాదు, ఇళ్లే కట్టించారు. ఇప్పటి వరకు కోటి 20 లక్షల మందికి ఇళ్లు కట్టించారు. అంత సంఖ్యేలేదు. పొలిటికల్ ఇన్వాల్వమెంట్, టార్గెట్. తహసీల్దార్ లపై వత్తిడి. పులివెందుల నియోజకవర్గంలోనే 50 ఏళ్లుగా కల్లం వాడుకుంటున్నారు. ఇప్పుడు దానిని తీసుకొని ఇళ్ల స్థలాలకు ఇస్తారట. కాన్సెప్ట్ మంచిదే ఒకపేద కోసం మరో పేద వద్ద తీసుకోవడం కరెక్ట్ కాదు. టార్గెట్ స్థానిక రాజకీయాలు – భూములు కొంటానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. కొందరికి పండుగ ఎక్కవ మందికి పండుగకాదు.

చందు సాంబశివరావు – బీజేపీ
వంద ఏళ్ల క్రితం లెక్కలు సింపుల్ గా ఉన్నాయి. రాబడి, ఖర్చు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదే అంశాలపై 220కి వచ్చాయి. గ్రంథాలు అయ్యాయి. ఐటీ కూడా అంతే. ఇలా చేస్తే బాగుంటుందేమో అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనని విమర్శించడం మంచిదికాదు. ఎందుకు విమర్శిస్తున్నారో ఆలోచన చేసుకోవాలి. ఆయన నా సంగతి నేను చెబుతాను అన్నప్పుడు మనం ఈకలు పీకుతున్నాం. ఈ రకమైన చర్చ జరిగేకొద్ది ఈ నాయకులు, అధికారులపై  ఒత్తిడి పెరిగే కొద్ది ఎలా చేస్తే బాగుంటుందనేది వస్తుంది. అవి రావడానికి చంద్రబాబు గారు చేసింది పునాది కావచ్చు. ఇది కొత్త ఆలోచనకు దారి. కొంత కాలం గడిచిన తరువాత నిబంధనలు రూపొందుతాయి.
ప్రభుత్వ భూములు అనే కాన్సెప్ట్. ఇళ్ల స్థలాలు, పాఠశాలలు, ప్రజాప్రయోజనాల కోసం బ్రిటీష్ వారి వద్ద నుంచి ప్రభుత్వ భూములు ఉన్నాయి. స్వతంత్ర భారతంలో ప్రభుత్వ భూమిని వాడుకుంటున్నారే గానీ ప్రణాళిక లేదు. భూమి సమస్య ఉంది. టార్గెట్ పెట్టడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు ఇస్తామంటే తప్పుపట్టరు. చంద్రబాబు నాయుడు 30వేల ఎకరాల్లో రాజధాని కడతానన్నారు. మౌలిక సదుపాయాలు వస్తాయన్నారు. గ్రామానికి దూరంగా ఇళ్లు కడతామంటే ఎవరూ వెళ్లరు. దీనిని ప్రభుత్వ సీనియస్ గా తీసుకోవాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వండి. తొందర ఎందుకు. తొందరవల్లే ఈ సమస్య. ముందు ఆయా గ్రామాలలో అందుబాటులో ఉన్న భూమికి సంబంధించి ప్రణాళిక ఉండాలి. అదిలేకపోవడం వల్లే ఈ సమస్య. ఎసైన్డ్ ల్యాండ్ తీసుకోవడం అంటే దైర్భాగ్యమే. భూమిలేని చోట కొనడానికి ప్రయత్నించండి. దాతలు ఇచ్చిన స్థలాలలో పాఠశాల, దేవాలయం, ఇళ్లు కట్టడం ఆనవాయితీగా వస్తుంది. పెద్ద రైతుల వద్ద భూములు తీసుకోండి. చంద్రబాబు గారితో కలిసి పిలుపు ఇవ్వండి. కలిసి చేయండి. ఈ రోజు సెంటు అంటున్నారు. రేపు గజం ఇచ్చి నిలబడి బతకమంటారు.

రషీ – సీనియర్ జర్నలిస్ట్
లేని సంప్రదాయాన్ని చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. స్వాగతించాలి. విమర్శచేసేవాళ్లు కూడా ప్రకటించాలి. స్పీకర్ కి సీల్డ్ కవర్ లో ఆస్తులు ఇవ్వమని చెప్పారు. అది కొనసాగడంలేదు. దానిపై ప్రభుత్వం స్పష్టం చేయాలి. అమెరికాలో మాదిరి కుటుంబ ఆస్తులు ప్రకటించే మంచిది. మోడీ గారు కొత్త చట్టాలు తెస్తారనుకున్నారు. తేలేదు. ఓటుకు రెండు వేలు ఇచ్చి కొనేమాట వాస్తవమే.  బినామీ ఆస్తులు చట్టం తెండి. వైపీపీ ప్రభుత్వం ఉన్నందున బినామీ చట్టం చేయండి.
1983లో అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. అప్పుడు ఈనాడులో కార్టూన్ కాళికాదేవి వద్ద నిలబడి హాంభూం పట్ అందరికీ ఇళ్లు అని కార్టూన్ వేశారు. ఎలా ఇవ్వగలవు అని వేశారు. 25 లక్షల మందికి ఇళ్లు ఇవ్వడం మంచిదే. నేను అనుకోవడం లేదు. కేంద్రం వాంబే కాలనీల్లో ఇళ్లు ఇవ్వాలనుకొని, తరువాత అపార్ట్ మెంట్లు కట్టి ఇవ్వాలని పాలసీ మార్చుకుంది. భూమి లేనందున పాలసీ మార్చుకున్నారు. ఆ క్రమంలోనే రాజీవ్ గృహకల్ప వంటి వచ్చాయి. ఎంతమందికి ఇవ్వాలి, ఎంత భూమి ఉందో తెలుసుకోకుండా చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఈ పథకంపై పునారాలోచన చేయాలి. ముందు బిల్డ ఏపీ పేరుతో ప్రభుత్వ స్థలాలు అమ్మి, గ్రామాలకు దూరంగా ఇళ్లు కట్టించాలనుకున్నారు. దేవాదాయ, వక్ఫ, క్రిస్టియన్ భూములు అమ్మడానికి కొందరు వ్యతిరేకించారు. దాంతో అసైన్డ్ భూములు వచ్చాయి. పేదవాడి వద్ద లాక్కుని ఇంకొకరికి ఇవ్వడం. కేసీఆర్ గారు కూడా ఒక్కొక్క దళితుడిని 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఆయన చతికిలబడ్డారు. ఫెయిలయ్యారు. ఆ విషయం మాట్లాడటంలేదు. డబుల్ బెడ్ రూమ్స్ అన్నారు. దానిని వదిలివేశారు.
విజయవాడలో ఇల్లు మంజూరైందని సంతకాలు పెట్టుకొని వెళుతున్నారు. ఆ ఇల్లు అమరావతిలో ఇస్తామంటున్నారు. దానికి వారు అంగీకరించడంలేదు.