Mar 5, 2019

వేగంగా రాజధాని అమరావతి నిర్మాణం



 


 

                    ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆధునిక అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో  అత్యంత ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తోంది. రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమరావతి రూప శిల్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీబీ)లు సమర్థవంతంగా, అత్యంత వేగంగా అమలు చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా భూ సమీకరణ దగ్గర నుంచి సీఆర్డీఏ కమిషనర్ తోపాటు ఆ సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది కృషి ప్రశంసనీయమైనది. మన రాష్ట్రానికి పూర్తిగా కొత్త అయిన ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) విధానాన్ని ఆచరణలో అమలు చేయడంలో వారు విజయం సాధించారు. ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచారు. గుంటూరు జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున 29 గ్రామాల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో  జల కళ, పచ్చదనం పరుచుకున్న అద్భుతమైన మహానగరంగా రాజధానిని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి పరిపాలన కొనసాగించుకోవడానికి పదేళ్లు హక్కు ఉన్నా, నవ్యాంధ్ర నుంచే ప్రభుత్వ పాలనా వ్యవహారాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు భావించారు. ఆ క్రమంలో నూతన రాజధానిలో వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం(ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)లోని 5 బ్లాక్ లను రికార్డు స్థాయిలో 4 నెలలో నిర్మించారు. శాసన మండలి, శాసనసభ భవన సముదాయాన్ని 192 రోజుల్లో నిర్మించి మరో రికార్డు సృష్టించారు. ఈ నగర నిర్మాణ అంచనా వ్యయం రూ.లక్ష కోట్లు. ప్రస్తుతం రూ.40వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రోడ్లు, డక్ట్ (భూగర్భంలో కేబుల్ వ్యవస్థకు ఏర్పాటు చేసిన మార్గం) ద్వారా కేబుల్ గ్రిడ్, గ్యాస్, విద్యుత్, పైప్ లైన్లు,  నీటి పారుదల వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతోపాటు పరిపాలనా భవనాలు, అన్ని వర్గాల వారికి వసతి గృహాలు, ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణ పనులు అన్నీ ఏక కాలంలో వేగంగా జరగడం దీని ప్రత్యేకత.  దేశంలో డక్ట్ లను వినియోగిస్తున్న రాష్ట్రం మనదే.   నగరంలోని రోడ్లు, కూడలులు, ఇతర కట్టడాలు, ప్రభుత్వ భవంతుల నిర్మాణంలో అడుగడుగున తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి  ఉట్టిపడేవిధంగా  ఆకృతులు రూపొందించారు. ఆ విధంగానే నిర్మిస్తున్నారు. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సహా మొత్తం 35 ప్రధాన రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. రోడ్లను విశాలంగా నిర్మించడంతోపాటు నడక దారులు, ఇరు పక్కల మొక్కలు నాటుతున్నారు. కొన్ని రోడ్ల వెంట ఇప్పటికే పలు రకాల పూల మొక్కలు నాటారు.
             ప్రపంచ స్థాయిలో నిర్మించే ఈ మహానగర రూపకల్పనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నగరానికి ఆధునిక హంగులన్నీ సమకూరుస్తున్నారు.  సాంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా అత్యంత ఆధునిక విదేశీ టెక్నాలజీని వినియోగించి  నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఒక్క ఇటుక కూడా వినియోగించకుండా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్లాబ్‌తో పాటు  గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో  పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భవన నిర్మాణ ఆకృతికి తగిన విధంగా అల్యూమినియం మౌల్డింగ్‌ను తయారు చేస్తారు.  పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్, ఇనుము మిశ్రమం కలిపి వేగంగా కట్టుకుంటూ వెళ్లిపోతారు.  ఇలా ఒక దాని వెంట ఒక ఫ్లోర్  నిర్మిస్తారు. ఈ విధానంలో భవన నిర్మాణ సమయం చాలా వరకు తగ్గుతుంది.  నూతన ప్రయోగాలలో  భాగంగా  ప్రీ కాస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో  భవన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్, ఇనుము వంటి వాటితో తయారు చేసిన కొన్ని ఆకృతులను, పెద్ద దిమ్మెలను ఇతర ప్రాంతాలలో తయారు చేసి, వాటిని తీసుకువచ్చి ఇక్కడ బిగిస్తారు. దాంతో నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతున్నాయి. సాధారణంగా ఇక్కడ నిర్మించేటంతటి భవనాలు నిర్మించడానికి రెండు, మూడు ఏళ్లు పడుతుంది. కానీ ఆధునిక టెక్నాలజీ వినియోగించడంతో వారానికో అంతస్తు లేస్తోంది. పలు  బహుళ అంతస్తుల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు 3800 ఫ్లాట్ల నిర్మాణం ఏక కాలంలో జరుగుతున్నాయి.  ఈ విధంగా నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం కూడా కొనసాగుతోంది.
             రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద అత్యంత ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో  ర్యాఫ్ట్ పౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దీనికి గత ఏడాది డిసెంబర్ 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.   డయాగ్రిడ్సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి  సచివాలయం శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయం నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా అతి ఎత్తైన సచివాలయం కూడా ఇదే అవుతుంది.  41 ఎకరాల్లో 56 లక్షల చదరపు అడుగుల్లో 250 మీటర్ల ఎత్తులో శాశ్వత సచివాలయం నిర్మిస్తున్నారు. 40 అంతస్తులతో 4 టవర్లు, 50 అంతస్తులతో మరో టవర్  నిర్మిస్తారు. ఈ నిర్మాణాలన్నిటికీ పిల్లర్లు ఉండవు.  సచివాలయం నిర్మాణానికి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదే. ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన 50 అంతస్థుల టవర్ కోసం 11,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఈ పనిని నిర్విరామంగా 55 గంటల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.  రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ తో జరగడానికి దాదాపు 20వేల మంది కార్మికులు రాత్రి, పగలు నిరంతరం శ్రమిస్తున్నారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవన సముదాయ నిర్మాణాన్ని ఆధునిక టెక్నాలజీతో చాలా వేగంగా 192 రోజుల్లో పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టుని ఇక్కడే నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3న ఈ భవనాన్ని భాతర అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి ప్రారంభించారు. ఆ తరువాత కొత్తగా నిర్మించే హైకోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. రాజధానిలో ఇల్లు లేని దాదాపు 5 వేల మంది పేదలకు ఇళ్లు నిర్మించారు.  ప్రభుత్వ గృహ నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఏపీ సీఆర్డీఏ ఉంది. మరో పక్క ప్రైవేటు భవనాల నిర్మాణం కూడా జరుగుతోంది. విట్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ భవనాలు నిర్మించారు. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. మరి కొన్ని విద్యా సంస్థలు, బీఆర్ ఎస్ మెడి సీటీ, ఏపీఎన్ఆర్టీ భవనాలు, టీటీడీ వారి ఆలయం, కృష్ణా నదిపై కూచిపూగి ఐకానిక్ బ్రిడ్జి, నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
                    అమరావతిలోని పరిపాలనా నగరంలో భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే సచివాలయంలో విద్యుత్ వాహనాలను వాడుతున్నారు. కొంతమంది సచివాలయ, సీఆర్డీఏ అధికారులు కూడా ఈ వాహనాలను వాడుతున్నారు. సచివాలయంలో, విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజధాని నగరంలో ఉష్టోగ్రతను తగ్గించడానికి  ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. నగరం అంతటికీ ఉపయోగపడేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఈ విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సంస్థతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 440 మీటర్లకు ఒక కూల్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. గ్యాస్, నీరు, విద్యుత్ మాదిరిగా కావలసిన ఇంటికి ఏసీని అందిస్తారు. ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఎక్కడాలేదు. అమరావతిలో 40 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ఈ విధంగా రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి నగరాలలో ఉండే ఆధునిక సౌకర్యాలన్నిటిని సమకూరుస్తారు.  
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Mar 2, 2019

మన్నిక, టెక్నాలజీ, వేగం
అమరావతి నిర్మాణంలో ప్రత్యేకతలు
పచ్చదనం నిండిన కాలుష్య రహిత ఆనంద నగరం ఇది
ఆంధ్రుల కలల రాజధాని
    
         
    రాజధాని అమరావతి మహానగరం నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తోంది. నాణ్యత, ఆధునిక టెక్నాలజీ, వేగం దీని నిర్మాణంలో ప్రత్యేకతలు. ప్రపంచంలోని ఆధునిక మహానగరాలకు ధీటుగా దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ప్రదేశం ఎంపిక, భూ సమీకరణ, మాస్టర్ ప్లాన్, తెలుసు సంస్కృతికి ప్రతిబింబంగా ఆకృతుల రూపకల్పన.... వంటి అన్ని విషయాలలో ఆయన ముద్ర ఉంది. రాజధాని అంటే ఒక్క పరిపాలనకే కాకుండా విద్య, వైద్యం, వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, ఉపాధి మొదలైన  అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉండాలన్నది సీఎం ఉద్దేశం. ఆ రకంగానే అంతర్జాతీయ స్థాయిలో అన్ని అధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా జలకళ-పచ్చదనం, కాలుష్యరహితంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు సంతోషంగా జీవించడానికి అనువైన ఆనంద నగరం నిర్మించాలన్నది చంద్రబాబు లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, వేగంగా నిర్మిస్తోంది. వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం(ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)లోని 5 బ్లాక్ లను రికార్డు స్థాయిలో 4 నెలలో నిర్మించారు. శాసన మండలి, శాసనసభ భవన సముదాయాన్ని 192 రోజుల్లో, అలాగే జ్యుడిషియల్ కాంప్లెక్స్(తాత్కాలిక హైకోర్టు)ని కూడా  192 రోజుల్లోనే నిర్మించి రికార్డు సృష్టించారు. ప్రవేటు రంగంలో కూడా విద్య, వైద్య సంస్థల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నగర నిర్మాణ అంచనా వ్యయం రూ.లక్ష కోట్లు. ఇప్పటికే దాదాపు రూ.40వేల కోట్ల పనులు మొదలు పెట్టారు. ప్రభుత్వ భవనాలు, గృహాల నిర్మాణాలు చురుకుగా జరుగుతున్నాయి. ఈ వేగం వెనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ), దాని సిబ్బంది పాత్ర కీలకంగా ఉంటుంది.  సాంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా అత్యంత ఆధునిక విదేశీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఒక్క ఇటుక కూడా వినియోగించకుండా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్లాబ్‌తో పాటు  గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో  పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భవన నిర్మాణ ఆకృతికి తగిన విధంగా అల్యూమినియం మౌల్డింగ్‌ను తయారు చేస్తారు.  పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్ఇనుము మిశ్రమం కలిపి వేగంగా కట్టుకుంటూ వెళ్లిపోతారు.  ఇలా ఒక దాని వెంట ఒక ఫ్లోర్  నిర్మిస్తారు. వీటికి తోడు ప్రీ కాస్ట్ టెక్నాలజీని కూడా వినియోగించడం వల్ల  భవన నిర్మాణ సమయం బాగా తగ్గుతోంది. భవన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్ఇనుము వంటి వాటితో తయారు చేసిన కొన్ని ఆకృతులను ఇతర చోట్ల తయారు చేసుకొని తీసుకువచ్చి ఇక్కడ బిగించే విధానాన్నే ప్రీకాస్ట్ టెక్నాలజీ అంటారు. సాధారణంగా ఇంత భవనాలు నిర్మించడానికి రెండుమూడు ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ వారానికో అంతస్తు పూర్తి అవుతోంది. పలు  బహుళ అంతస్తుల టవర్లున్యాయమూర్తులు,మంత్రులుఅధికారులుఉద్యోగులకు 3800 ఫ్లాట్ల నిర్మాణాలు ఏక కాలంలో జరుగుతున్నాయి.  నిర్మాణాలతోపాటు పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక పక్క సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు 34 రోడ్ల నిర్మాణం జరుగుతుండగా, మరో పక్క ఆ రోడ్ల వెంట వివిధ రకాల మొక్కలను కూడా ఏక కాలంలో నాటుతున్నారు. రోడ్లు, నిర్మాణాలు జరిగే ప్రతి చోట పచ్చదనం పరుస్తున్నారు. ఈ విషయంలో అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్(ఏడిసి) ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొంతమంది సచివాలయసీఆర్డీఏ అధికారులు  ఈ వాహనాలను వాడుతున్నారు. సచివాలయంలోవిజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజధాని నగరంలో ఉష్టోగ్రతను తగ్గించడానికి  ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగించనుంది. నగరం అంతటికీ ఉపయోగపడేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సంస్థతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి440 మీటర్లకు ఒక కూల్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. గ్యాస్నీరువిద్యుత్ మాదిరిగా కావలసిన ఇంటికి ఏసీని సరఫరా చేస్తారు. అమరావతిలో 40 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ఇటువంటి వ్యవస్థ ప్రస్తుతానికి మన దేశంలో ఎక్కడాలేదు.

             రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద   ర్యాఫ్ట్ పౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. దీనికి 2018 డిసెంబర్ 27న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.  డయాగ్రిడ్’ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రపంచంలోనే మొదటిసారిగా   సచివాలయ శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. అతి ఎత్తైన సచివాలయం కూడా ఇదే అవుతుంది.  40 అంతస్తులతో 4 టవర్లు, 50అంతస్తులతో మరో టవర్  నిర్మిస్తారు. ఈ నిర్మాణాలన్నిటికీ పిల్లర్లు ఉండవు.  సచివాలయం నిర్మాణానికి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదే. ముఖ్యమంత్రి,సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన 50 అంతస్థుల టవర్ కోసం 11,300క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఈ పనిని నిర్విరామంగా 55 గంటల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. భూగర్భ డ్రైనేజీతో పాటు తాగునీటి వ్యవస్థ పైపులుగ్యాస్విద్యుత్కేబుల్ గ్రిడ్ వంటి వాటిని డక్ట్ ద్వారా భూగర్భంలోనే అమర్చుతున్నారు. ఈ విధంగా దేశంలో డక్ట్ లను వినియోగిస్తున్న రాష్ట్రం కూడా మనదే.  ఈ రకంగా అనేక రికార్డులు అమరావతి సొంతం చేసుకుంటుంది. రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ తో జరగడానికి దాదాపు 20వేల మంది కార్మికులు రాత్రి,పగలు నిరంతరం శ్రమిస్తున్నారు.  అమరావతి పరిపాలనా నగరంలో భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఈ విధంగా అమరావతి నగరంలోని ప్రజలు సంతోషంగా, ఆనందంగా జీవించడానికి అన్ని విధాల  అనుకూల వాతావరణాన్ని  ప్రభుత్వం ఏర్పరుస్తోంది.
-     శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Feb 19, 2019

ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు 
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆకాశపు స్వామి

   
     సచివాలయం, ఫిబ్రవరి 19 :  టైలర్ల సమస్యల పరిష్కారానికి భారతదేశంలోనే
మొదటిసారిగా ఫెడరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడుకు ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్  ఆకాశపు స్వామి
కృతజ్ఞతలు తెలిపారు.  రెడీమేడ్ రంగం వల్ల దర్జీలకు సగం రోజులు పనిలేకుండా
పోతోందని వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని 
సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆకారపు స్వామి వెల్లడించారు.
దర్జీలకు వంద యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని, 50 సంవత్సరాలకే
ఫించను, రాయితీపై మెటీరియల్ సరఫరా, దర్జీలకు ప్రభుత్వ రాయితీతో ఇళ్ల
నిర్మాణాలు చేపట్టడానికి సీఎం అంగీకరించారని స్వామి తెలిపారు.  ఆధునిక కుట్టు
మిషన్లతో టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసేందుకు కూడా సీఎం
అంగీకరించినందుకు ఫెడరేషన్ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. దర్జీల
సంక్షేమం కోసం త్వరలో ఫెడరేషన్ కు తగినన్ని నిధులు కేటాయించేందుకు సీఎం
అంగీకరించారని స్వామి తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడును మరలా
గెలిపించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఏపీ టైలరింగ్ ఫెడరేషన్ ఛైర్మన్
ఆకాశపు స్వామి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిపై 11 లక్షల మంది
జీవిస్తున్నారని యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు గుర్తుచేశారు.
దర్జీ వృత్తి అంతరించిపోకుండా రాయితీతో ఆధునిక పరికరాలు సరఫరా చేయాడానికి
సీఎం అంగీకరించినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాసరావు
సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు
నబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో సీఎస్ అనీల్ చంద్ర పునీఠ సూచన

                   సచివాలయం, ఫిబ్రవరి 19: వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఉపాధి అవకాశాల మెరుగు కోసం గ్రామీణ స్థాయి నుంచి బ్యాంకర్లు  ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునీఠ సూచన చేశారు. సచివాలయం 5వ బ్లాక్ లో నబార్డ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ 2019-20 స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ఆయన ప్రసంగించారు. ప్రణాళికలు గ్రామ, మండల దిగువ స్థాయి నుంచి సెక్టార్ల ప్రకారం తయారు చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనేక పథకాలు ప్రవేశపెట్టి, వాటిని అమలు చేయడంలో దేశంలో ముందుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రానికి 650 అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ప్రగతి సాధించడంలో ఏపీని మంచి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల కృషి ఫలితంగా సమ్మిళిత అభివృద్ధి సాధించినట్లు సీఎస్ తెలిపారు. అంతకు ముందు నబార్డ్ ఏపీ ప్రాంతీయ ఛీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి నబార్డ్ రూ.1,87,061 కోట్ల రుణ ప్రణాళికతో స్టేట్ ఫోకస్ పేపర్ రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అత్యధికంగా రూ.1,23,526 కోట్లు, ఎంఎస్ఎంఈకి రూ.32,906 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత మూడున్నర దశాబ్దాలుగా నబార్డ్ వ్యవసాయ రుణ ప్రళానికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రణాళికలతో స్థానిక వనరుల ఉపయోగానికి, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రాధమిక రంగం, అర్బన్ డెవలప్ మెంట్ వంటి ఏడు మిషన్లను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి బ్యాంకింగ్ నెట్ వర్క్ ఉందన్నారు.  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం అద్వితీయమైన అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధిస్తున్నట్లు తెలిపారు.  గృహ నిర్మాణానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు సహకరించాలని కోరారు.
                     వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం-జడ్ బీఎన్ఎఫ్(జీరో బేస్డ్ నేచురల్ ఫార్మమింగ్)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్  త్వరలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పారు. ప్రస్తుతం 5 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాల్లో  ఈ సాగు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. మన దేశంలో ఈ సాగుని పరిశీలించడానికి అనేక దేశాల వారు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. 2022 నాటికి 60 లక్షల ఎకరాల్లో సాగు చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. బ్యాంకులు కౌలుదారులకు రుణాలు అందించాలన్నారు. అన్నదాత ఎవరు? వాస్తవ వ్యవసాయదారులు ఎవరు? అనేది గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. నిజమైన వ్యవసాయదారునికి ఫలితాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో వ్యవసాయ కుటుంబానికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రకటించిన 24 గంటల లోపల అమలులోకి వచ్చిందన్నారు. మొదటగా రైతుల ఖాతాలలో రూ.1000లు జమ చేసినట్లు చెప్పారు. ఈ విధంగా మొత్తం రూ.498 కోట్లు జమ చేసినట్లు రాజశేఖర్ తెలిపారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటుతో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు నబార్డ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఇచ్చే రుణాలు, ఆర్థిక సహాయానికి ఫోకస్ పేపర్ ప్రాధమికమైనదని చెప్పారు. హార్టీ కల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి,  ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కెఎస్డీ శివ వరప్రసాద్, నాబార్డ్ జీఎం కె.ఎస్.రఘుపతి, ఏజీఎం పీ.రామలక్ష్మి తదితరులు ప్రసంగించారు. ఈ సెమినార్ లో  వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Feb 18, 2019


సాంఘీక సంక్షేమ శాఖలో లిడ్ క్యాప్ విలీనం
మంత్రి జవహర్, ఆర్టీసి చైర్మన్ వర్ల, ఎమ్మెల్సీ డొక్కా,
లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు కృతజ్ఞతలు

                 సచివాలయం, ఫిబ్రవరి 18: పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి  లిడ్ క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)ను విడదీసి సాంఘీక సంక్షేమ శాఖలో విలీనం చేసినందుకు మంత్రి జవహర్, ఆర్టీ చైర్మన్ వర్ల రామయ్య, శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్, లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబులు హర్షం వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 65 ప్రకారం మాదిగ, మాదిగ ఉప కులాలకు  ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం సహాయం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి జవహర్ తెలిపారు. అమలాపురం ఎంపీ పందుల రవీంద్ర ముందు తన ఇంటి పేరుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయన ప్రవర్తన తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శించడాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యుడిపై ఉమ్మివేస్తే తన మీదే పడుతుందన్నారు.
               ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ జీఓ నెంబర్ 65 జారీ చేసినందుకు మాదిగ, ఉప కులాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసిన మాదిరిగా సంక్షేమ ఫలాలు మాదిగలకు, ఆయా ఉప కులాలకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ జీఓ మాదిగలకు ఓ పెద్ద వరంగా పేర్కొన్నారు. ఇది సాహసోపేత నిర్ణయంగా వర్ల పేర్కొన్నారు. ఎంపీ పందుల రవీంద్ర నీడనిచ్చే చెట్టుని నరుక్కున్నారన్నారు. ఎండమావులను చూసి నీళ్లనుకున్నారని విమర్శించారు.
          ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ దళితులు, మాల, మాదిగ వర్గాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. లిడ్ క్యాప్ చైర్మన్ గా గూడూరి ఎరిక్సన్ బాబుని నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎంపీ రవీంద్ర బురద జల్లే కార్యక్రమాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారడం అనేది ఆయన ఇష్టమని, అయితే నిందారోపణలు చేయడం తగదన్నారు. అది మంచి సంప్రదాయం కాదన్నారు. దళితులకు చెడ్డ పేరు తేవద్దని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. అవాకులు చెవాకులు మానుకోమని సలహా ఇచ్చారు.
            లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల వరకు మాదిగలు ఉన్నట్లు తెలిపారు. కార్పోరేషన్ చైర్మన్ గా మాదిగ సామాజిక వర్గానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Feb 15, 2019

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా


          సచివాలయం, ఫిబ్రవరి 15: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. శాసనసభ డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావుకు ఆయన తన రాజీనామా లేఖని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభకు పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు.

Feb 14, 2019

హస్తినలో ఆంధ్రుల సత్తా చాటిన చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినలో ఆంధ్రుల సత్తా మరోసారి చాటారు. 68 ఏళ్ల వయసులో కూడా పోరాట పటిమ ప్రదర్శించారుధర్మపోరాట దీక్ష ఉద్యమాన్ని ఉదృతం చేశారు ఢిల్లీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తింది.  స్వామి కార్యంతోపాటు స్వకార్యం అన్నట్లురాష్ట్ర సమస్యకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంతోపాటు బిజేపీఏయతర రాజకీయ పార్టీల మధ్య బంధాన్ని పఠిష్టం చేసి విజయం సాధించారుమనకి దేశ వ్వాప్తంగా భరోసా లభించిందిసమాఖ్య వ్యవస్థ బలపడటానికి అవకాశం ఏర్పడిందిఈ క్రెడిట్ వంద శాతం చంద్రబాబుకే దక్కుతుందిఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేక హోదావిభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగడుతూనే ఉన్నారు. మొదట రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ధర్మపోరాట దీక్షలు చేశారుఅన్ని  దీక్ష సభలలో 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా వచ్చిన మోడీ తిరుపతిలో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను ప్రదర్శించారు2018 ఏప్రిల్ 20న తన పుట్టిన రోజున విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆహారం తీసుకోకుండా ధర్మపోరాట దీక్ష చేశారు.  దేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా పుట్టినరోజున రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేసి చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకతను చాటుకున్నారు'నమ్మక ద్రోహంకుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాంఅనే నినాదంతో ఏప్రిల్  30 తిరుపతిలో ధర్మపోరాట దీక్ష బహిరంగ సభ నిర్వహించారుఅప్పటికి సరిగ్గా నాలుగు ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ 2014 ఏప్రిల్‌ 30న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో  ప్రత్యేక హోదా ఇస్తామనిరాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఆ రోజు  అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారుఆ తరువాత మే 22న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కశాశాల మైదానంలో జూన్ 29  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టీయూ ప్రాంగణంలోజూలై  29  ఒంగోలులోసెప్టెంబర్ 29న తాడేపల్లిగూడెంలోఅక్బోబర్ 30న కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం సమీపంలోనవంబర్ 20 నెల్లూరు ఎస్ విజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లోడిసెంబర్ 26న అనంతపురంలో ధర్మపోరాట దీక్షలు చేశారుకేంద్ర ఉలిక్కిపడేలా సభలు నిర్వహించారుఅన్ని చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మంత్రులుఎమ్మెల్యేలుఎమ్మెల్సీలుఇతర ప్రజాప్రతినిధులుకార్యకర్తలుజనం భారీ స్థాయిలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారుఅన్ని సభలలో ప్రత్యేక హోదావిభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి చంద్రబాబు నాయుడు నిరసన తెలిపారు. పక్షపాత ధోరణిని ఎండగట్టారురాజధాని అమరావతిపోలవరం బహుళార్ధ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులివ్వాలనికడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలనివిశాఖకు రైల్వే జోన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు ప్రత్యేక హోదా ఉండి ఉంటే 90 శాతం గ్రాంటు వచ్చేదని,    11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారనిఏపీకి ఎందుకివ్వరుఅని  ప్రశ్నించారునవ్యాంధ్రకు ఇచ్చినవి చట్టబద్ధమైనన్యాయమైన హామీలని, వాటిని పూర్తిగా నెరవేర్చడం కేంద్రం బాధ్యత  అని పేర్కొన్నారుఅమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారనిసర్దార్‌పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారని వివరించారు.   కేంద్ర నమ్మకద్రోహంకుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే కొరివితో తలగోక్కున్నట్లేనని కేంద్రాన్ని హెచ్చరించారు.  ఫిబ్రవరి 11న  దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ధర్మపోరాట దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా నినాదాన్ని మరో సారి మారు  మ్రోగించారు. దీక్షకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ‘‘నాకు గౌరవం కాదు నేను కోరుకునేది నా రాష్ట్రానికి గౌరవం. 5 కోట్ల  ఆంధ్ర ప్రజల ప్రతినిధిని, 175మంది సభ్యుల శాసనసభకు నాయకుడినినేను కోరేది నాకు న్యాయం చేయమని కాదునా రాష్ట్రానికి న్యాయం చేయమనిమా హక్కులు నెరవేర్చమనివిభజన చట్టంలో ఉన్న 18 అంశాలు అమలు చేయమని నేను డిమాండ్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారురాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేసిన చంద్రబాబు హస్తినలో కూడా దీక్ష చేసి ప్రత్యేక హోదా అంశానికి జాతీయ స్థాయి ప్రాధాన్యత కల్పించారుపార్లమెంట్ స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలో ముఖ్యమంత్రి హోదాలో  దీక్ష చేసి జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారుదేశం నలుమూలల నుంచి  జాతీయ స్థాయి నేతలురాజకీయ ఉద్దండులు మన్మోహన్ సింగ్దేవెగౌడఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ మూలాయం సింగ్శరద్ యాదవ్, రాహుల్ గాంధీ కేజ్రీవాల్శత్రుఘ్న సిన్హా  వంటి వారు  కదిలివచ్చి మద్దతు తెలిపారు అయితే రాష్ట్రం కోసం జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఉభయ కమ్యూనిస్టులువైఎస్ఆర్ కాంగ్రెస్, కొత్త పార్టీ జనసేన మద్దతు ప్రకటించలేదు 
  
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ – 9440222914