కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు
సచివాలయం, నవంబర్ 13:
శాసనసభలో కిడ్నీ బాధితులపై చర్చ జరిగినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు
చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. ఉద్ధానం
తరువాత కనిగిరి ప్రాంతంలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. నీటిలో
ఫ్లోరైడ్ శాతం ఎక్కవగా ఉన్నందునే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. 2015 జూన్ నుంచి 2017 జూలై వరకు ప్రకాశం
జిల్లాలో 345 మంది కిడ్నీ బాధితులు చనిపోయినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు ఆదేశానుసారం ప్రకాశం జిల్లాలో చీరాల, కందుకూరు, మార్కాపురం, కనిగిరి మొత్తం
5 చోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలోని
డయాలసిస్ సెంటర్లో షిప్టుల పద్దతిపైన రోజుకు 30 మందికి టెస్ట్ చేస్తున్నట్లు
చెప్పారు. కిడ్నీబాధితులకు వైద్యం అందజేయడానికి ప్రభుత్వం రూ.5వేల రూపాయలు ఖర్చు
చేస్తున్నట్లు, అలాగే వారికి నెలకు రూ.2500 ల పెన్సన్ అందజేస్తున్నట్లు
వివరించారు. ప్రైవేటు ఆస్పతులలో టెస్ట్ చేయించుకున్నవారికి కూడా పెన్షన్ ఇవ్వాలని
కోరామని, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫ్లోరైడ్ రహిత నీటిని
సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో
కొన్ని ఆర్ ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారని, మరో ఏడాదిలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు
చేస్తారని ఎమ్మెల్యే బాబురావు చెప్పారు.
No comments:
Post a Comment