Nov 22, 2017

నదులు అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదే!


ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల

           సచివాలయం, నవంబర్ 22: దేశంలో నదులు అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆమె మాట్లాడారు. పట్టిసీమ ద్వారా అందిన గోదావరి నీటితో కృష్ణా ఆయకట్టుతోపాటు రాయలసీమకు కూడా సాగు నీరు అదనంగా అందించినట్లు తెలిపారు.  గ్రామీణాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటే లభించే లాభాల గురించి ఈ రోజు సభలో చర్చిస్తారన్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ పై కూడా చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండి భావితరాల భవిష్యత్ కు సహకరించడంలేదని యామినీ బాల అన్నారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...