Nov 22, 2017

ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాలి


అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

      సచివాలయం, నవంబర్ 21: ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌవించిన రోజునే సమాజం ముందుకు వెళుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు   అన్నారు.
శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. స్పీకర్ వ్యవస్థపై ప్రతిపక్షం వారు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావుకు ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉందని అందువల్లే ఆయనను ప్రజలు మళ్లీ మళ్లీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. శాసనసభ అనేది ప్రజా దేవాలయం అని, ప్రజా సమస్యల పరిష్కారం ఆ వేదికను ఉపయోగించుకోవాలని అన్నారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు ప్రశ్నోత్తరాలకు, సభా సమయానికి ఇబ్బందిలేకుండా సజావుగా కొనసాగుతున్నట్లు ఆనంద రావు చెప్పారు.

No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...