Nov 30, 2017

2న ఈద్-మిలాదున్-నబి సెలవు


      సచివాలయం, నవంబర్ 30: ఈద్-మిలాదున్-నబి సందర్భంగా ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం సెలవు దినానికి బదులుగా  2వ తేదీ శనివారం సాధారణ  సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోరిక మేరకు ఈ మార్పు చేసినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...