ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
సచివాలయం, నవంబర్ 22: అన్ని రకాల ఇబ్బందులు అదిగమించి పోలవరం ప్రాజెక్ట్ ని 2019 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట కోసం సేకరించిన భూములకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎకరానికి రూ.1.50 లక్షలు కాగా, ఇప్పడు రూ. 10 నుంచి రూ.13 లక్షలకు పెరిందన్నారు. దాంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విషయమై సీఎం ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నారని, చత్తిస్ గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పారు. రాజధాని లేని సమయంలో ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి శాసనసభను, సచివాలయంను నిర్మించుకొన్నామని, సచివాలయ ఉద్యోగులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక్కడికి వస్తున్నారన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు రావడం వల్ల రూ.15వేల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ దిగుబడులు వచ్చినట్లు వివరించారు.
రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి ఆస్తుల పంపిణీ జరగలేదని, కేంద్రం నుంచి కూడా నిధులు రావలసి ఉందని అన్నారు. విభన చట్టంలో హామీల అమలులకు సీఎం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి అప్పులు చేసినా, వాటిని సద్వినియోగం చేస్తున్నామని, అందువల్లే రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు.
సినిమా పరిశ్రమకు సంబంధించి నంది అవార్డుల అంశం వివాదస్పదం కావడం దురదృష్టం అన్నారు. తాను కూడా సినిమా రంగం నుంచే వచ్చానని, తాను నిర్మాతనని చెప్పారు. ఈ విషయంలో కుల ప్రస్తావన తీసుకురావడం భావ్యం కాదని, విధానాల ఆధారంగా అవార్డుల ప్రకటిస్తారని బుచ్చయ్య చౌదరి అన్నారు.
No comments:
Post a Comment