సచాలయం, మార్చి 20: ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ,
శాసనమండలి సభ్యుల క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోని శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం
ఉదయం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు
నిర్ణయం తీసుకున్నారు. 24వ తేదీ నుంచి 26 తేదీ వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, బాడ్మింటన్, టెన్నీస్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, కబాడీ, వాలీబాల్, మ్యూజికల్
చైర్, ఈత, త్రోబాల్ మొత్తం 10 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. 27న సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభ్యులు
ఎవరికి ఏ క్రీడలో ప్రావీణ్యం ఉంటే అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమావేశంలో
మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల
రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు,
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు
రవీంద్ర, చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, విప్ కూన
రవికుమార్, ఇన్ చార్జ్ సెక్రటరీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
30న తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక
ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment