మంత్రి సోమిరెడ్డి
చంద్రమోహన రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు
·
సినిమాలో ఇంటర్వేల్ వరకు హీరోలా ఉండి.. ఆ తర్వాత
భిన్నమైన రోల్ పోషించినట్టుగా పవన్
·వ్యవహరిస్తున్నారు.
·
జగన్ తరహాలోనే పవన్ కూడా మిస్డ్ కాల్ పార్టీల
జాబితాలో చేరారా..?
వాళ్లను అనుసరిస్తున్నారా..?
·
వైసీపీ కూడా మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేస్తోంది..
జనసేన కూడా అలాగే చేస్తోంది.
·
పవన్ తన మనస్సు ఎవరి మీద అయినా పారేసుకుంటాడు..
ఆ తర్వాత మూడు నాలుగేళ్లకు ఆరేసుకుంటాడు.
·
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు
పారేసుకున్నాడు.. ఆ తర్వాత ఆరేసుకున్నాడు.
·
మోడీకి వ్యతిరేకంగా పోరాడతానని.. ఒక్కసారిగా
పన్నీరు సెల్వంలా మారిపోయారో అర్ధం కావడం లేదు.
·
నిన్నటి వరకు వామపక్ష భావజాలంతో ఉన్న పవన్
పక్షపాత భావజాలానికి చేరుకున్నారు.
·
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, మైనారిటీ
రిజర్వేషన్లను పెంచుతామన్న కేసీఆర్ ను పొగుడుతున్న పవన్.. కాపు రిజర్వేషన్ల కోసం
చిత్తశుద్ధితో పని చేస్తున్న చంద్రబాబును విమర్శిస్తారా..?
·
ఎన్సీఏఈఆర్ నివేదిక ప్రకారం ఏపీ 19వ స్థానంలో
ఉంది.
·
ఇదే నివేదిక ప్రకారం గతంలో ఏపీ ఒకటో
స్థానంలో ఉంది.
·
ఆవేశంలో జరిగిన ఒకటి రెండు సందర్భాలను
ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేస్తున్నారంటూ
విమర్శలు చేయడం సరికాదు.
·
ఒక వార్తా పత్రికలో కథనం వస్తే ఆ కార్యాలయం మీద
దౌర్జన్యానికి ప్రయత్నించారు.
·
తమ దాకా పరిస్థితి వస్తే ఎలా ఉంటారో పవన్ ఆలోచించుకోవాలి.
·
మంగళగిరిలో పవన్ ఇంటి నిర్మాణం జరిగే చోట నేనూ ఇల్లు తీసుకుందామంటే ఆరేడు కోట్లు రూపాయలు
ఖర్చు అవుతందన్నారు.. కానీ పవనుకు రూ. 40 లక్షలకే ఇచ్చేశారు. సినిమా హీరో
మీద మోజుతో తక్కువ రేటుకు ఇచ్చారేమో..?
·
కాపుల విషయంలో మీరేమన్నా అధ్యయనం చేశారా..? కాపు రిజర్వేషన్లు
వద్దని చెప్పడమేనా మీ అధ్యయనం..?
·
చంద్రబాబు, లోకేష్ ను విమర్శించడానికేనా
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ..?
·
వైసీపీ విమర్శలను.. ఆరోపణలను పవన్ దత్తత
తీసుకున్నారా..?
---------------------------------------------------------
ఎమ్మెల్సీ దీపక్
రెడ్డి ప్రసంగంలోని ముఖ్య అంశాలు
§
పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల
క్రితం మాట్లాడిన మాటలకు మా తెలుగుదేశం పార్టీ ఇంతగా రియాక్ట్ కావలసిన అవసరం లేదు.
§
వాక్కు స్వాతంత్ర్యం ఉంది కాబట్టి
మాట్లాడాడు.
§ వాస్తవంగా అది ఒక సినిమా అని, పవన్
కళ్యాణ్ నటించాడు అని నేను భావిస్తున్నాను.
§ కళాకారులు
రకరకాల సినిమాలు చేస్తారు.
§
పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్
ప్లే ముగ్గురు శక్తులు ఎవరు అనే విషయం ప్రజలకు తెలుసు.
§
ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి
ప్రస్తుతం ఖాళీగా ఉన్న వ్యక్తి స్క్రీన్ ప్లే వ్రాస్తే, ప్రస్తుతం
§నడుచుకుంటూ
పోతున్న వ్యక్తి డైరెక్షన్ చేశాడు. నిర్మాత ఎవరో అందరికీ తెలుసు అంటూ ఉండవల్లి
అరుణ్ కుమార్, జగన్,
బీజేపీ లను ఉద్దేశించి మాట్లాడారు.
------------------------------------------------------------------
మంత్రి కొల్లు
రవీంద్ర ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
◆ తెలుగు
వారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం.
◆ కేంద్రం
రాష్ట్రానికి చేసిన అన్యాయం పై దశల వారీగా పోరాటం చేస్తున్నాం.
◆ హోదా
ఇవ్వడం కుదరని జైట్లీ చెప్పినప్పటి నుండి పోరాటం చేస్తున్నా పట్టించుకోనందున, మంత్రులు
రాజీనామా చేసినారు. ఈరోజు NDA
నుండి బయటకు వచ్చాము. కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం.
◆ BJP పతనం
ప్రారంభమైనది.
◆ TDP తో
వైరం పెట్టుకున్న పార్టీలన్నీ నాసనమైపోయాయి.
◆ ఆంద్రప్రదేశ్
కు న్యాయం చేయమని కోరుతున్నాం.
◆ వార్
బిగిన్ అయింది. ఎంతవరకు పోతుందో తెలియదు.
◆ ప్రధాని
కార్యాలయం లో విజయసాయిరెడ్డి దొంగనాటకాలు ప్రజలు గమనిస్తున్నారు.
◆ YCP అవిశ్వాస
తీర్మానం పెట్టడానికి కావలసిన 50 మంది MP లను కూడగట్టుకోలేని పరిస్థితి లో ఉంది.
◆ జాతీయ
స్థాయిలో రాజకీయాలు చేయగల దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.
----------------------------------------------------------------------------
కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్ బాషా ప్రసంగంలోని
ముఖ్య అంశాలు
◆ 5
కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా, విభజన
హామీల కోసం ముఖ్యమంత్రి 29
సార్లు ఢిల్లీ వెళ్లారు. ఎన్నో అవమానాలు భరించారు.
◆ 13 ఏళ్లు
ముఖ్యమంత్రిగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా
ఉన్న చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
◆ మోడీ
కంటే ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కంటే ఎక్కువ కాలం పనిచేశారు.
◆ BJP మ్యానిఫెస్టోలో
ఉన్న హామీలని నెరవేర్చలేదు.
◆ రాష్ట్రానికి
రావాల్సిన నిధులు ఇవ్వలేదు.
◆ బుందేల్
ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు.
◆ రాష్ట్ర
ప్రయోజనాలకోసం కేంద్రం తో సఖ్యత గా ఉన్నాం.
◆ హోదా
కోసం మంత్రులు రాజీనామా చేశారు, MP లు పార్లమెంట్ ను స్తంభింప చేశారు.
◆ కేంద్రం
పై ఎంత వత్తిడి పెంచినా ప్రయోజనం లేక NDA నుండి బయటకు వచ్చాం.
◆ TDP ని
దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోంది.
◆ పవన్
సభలో జనసేన అజెండా చదవకుండా జగన్ స్క్రిప్ చదివినారు.
◆ హైదరాబాద్, విశాఖ, ఇక్కడ సభలు
పెడితే సరిపోయిందా.
◆ పవన్
కు రాజకీయ అవగాహన లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
◆ పవన్, జగన్ BJP తో లాలూచీ పడ్డారు.
◆ 13
జిల్లాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
◆ రాష్ట్ర
ప్రయోజనాల కోసం పదవులు వదులుకున్నాము.
◆ రాష్ట్ర
ప్రజలు, మైనారిటీలు
చంద్రబాబు వెంట ఉన్నారు.
◆ BJP కి
ముస్లిం మైనారిటీలు తగిన బుద్ధి చెబుతారు.
◆ మేము
పెట్టె అవిశ్వానికి ముఖ్యమంత్రి పై నమ్మకంతో కాంగ్రెస్, AIADMK, తృణమూల్, వామపక్షాలు
మద్దతు పలుకుతున్నాయి.
◆ పవన్
కళ్యాణ్ ఇంటి కోసం కొన్న స్థలం రూ.20 లక్షలకు ఎలా ఇచ్చారు.
--------------------------------------------------
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు
◆ TDP,
BJP సంబంధాలు తెగతెంపులు అయ్యాయి. అందుకు మాకు సంతోషంగా ఉంది.
◆ ప్రభుత్వ
వైఫల్యాలు బయట పడకుండా టీడీపీ వ్యూహాత్మక ముగా NdA నుండి బయటకు వస్తుంది.
◆ గతంలో
TDA గెలిచినపుడల్లా
BJP మద్దతు
ఉంది.
◆ 1984
సంక్షోభం సమయంలో BJP
NTR కి మద్దతు ఇచ్చింది.
◆ 1989
లో TDP ఓడిపోయి, బాధ్యత
తీసుకోకుండా, BJP పై
నెట్టి బయటకు వెళ్ళారు.
◆ 1998
లో వాజపేయి హయాంలో లో మాకు 19 శాతం ఓటు బ్యాంకు రావడంతో TDP మాతో కలసింది.
◆ 1994
లో ముందస్తు ఎన్నికలలో BJP
తో కలసి, ఓడిపోయిన తరువాత BJP పై తోసినారు.
◆ 1999
లో లెఫ్ట్ పార్టీలతో కలిసి ఓడిపోయారు.
◆ 2014
లో మోడీ గారిని చూసి BJP
తో కలసివచ్చి అధికారంలోకి వచ్చారు.
◆ రాష్ట్రంలో
అన్నిచోట్లా అవినీతి బాగా పెరిగిపోయింది.
◆ రాష్ట్రానికి
నిధులు కేటాయింపులు లేవని మంత్రులు రాజీనామా చేశారు.
◆
YSRCP తో TDP
అక్రమ సంబంధం పెట్టుకుంది.
◆ సభలో
అవిశ్వాసం పెడితే, కాంగ్రెస్
వారికి చర్చకు ఎక్కువ అవకాశం వస్తుంది. ఆ విధంగా కాంగ్రెస్ కు జవసత్వాలు
ఇవ్వనున్నారు.
◆ ఎన్నికలకు
ఏడాది ముందే విడిపోయి మా నెత్తిన పాలుపోశారు.
◆ ప్రజల
విశ్వాసాన్ని గెలుచుకుంటాం.
◆ 13
జిల్లాల్లో కేంద్రం52
సంస్థలు ఏర్పాటు చేసింది.
--------------------------------------------------------------------
వినుకొండ
ఎమ్మెల్సీ జీవీ ఆంజనేయులు ప్రసంగంలోని ముఖ్య అంశాలు
◆ హోదా
హామీలు అమలు చేయనందున NDA
కు మద్దతు ఉపసంహరించుకున్నాం.
◆ రాష్ట్రంలో, దేశంలో
మాకు అనేక మంది మద్దతు ఉంది.
◆ కేంద్రం
పై అవిశ్వాసం పెడతామని YCP
ముందుకు వచ్చిన ప్రజలకు దానిపై విశ్వాసం లేదు.
◆ BJP పవన్
తో, జగన్
తో కలిసింది.
◆ BJP తో
విలీనానికి YCP సిద్ధం.
◆ MP విజయసాయిరెడ్డి
నెలరోజుల నుండి ఢిల్లీ లో జరిపిన మంతనాలు విజయవంతం అయినాయి.
◆ YCP
MP శివ ప్రసాద్ జనసేన మాతో ఉంది అని చెప్పారు.
◆ వీళ్ళంతా
చంద్రబాబునంపై కక్ష కట్టారు.
◆ BJP కి
ప్రజలు గుణపాఠం చెబుతారు
◆ BJP దాని
మిత్ర పక్షాలు పతనమై పోతాయి.
◆ కేసుల
మాఫీకోసం YcP ప్రయత్నస్తుంది.
◆ పవన్
తో నిరాహారదీక్ష చేయించి,
ఆతరువాత కొన్ని హామీలు ఇచ్చి పవన్ ను హీరోని చేస్తారు.
◆ కురుక్షేత్రం
లో పాండవులు విజయం సాధించినట్లు TDP విజయం సాధిస్తుంది.
◆ చంద్రబాబు
వెనుక6
కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
◆ విజయసాయిరెడ్డి
బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నాడు.
◆ ప్రజలు
క్షమించరు.
-----------------------------------------------------------------
అమలాపురం MLA ఆనందరావు ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
◆ వాజపేయి
కాలంలో NDA ఏర్పడింది.
◆ దానిపై
ప్రజలకు నమ్మకం ఉందేది.ఇప్పుడది National Duplicate Agency గా మారింది..
◆ దానిలో
నుండి ఒక్కొక్క పార్టీ వెళ్లిపోతున్నాయి.
◆ శివసేన, అకాలిదళ్, ఇప్పుడు TDP.
◆ బీజేపీ
వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీస్తుంది.
◆ తిరుపతిలో
వేంకటేశ్వరుని సాక్షిగా హామీలుబిచ్చి నెరవేర్చలేదు.
◆ ఓట్లు
అడగటానికి BJP ఎలా
వస్తుంది.
◆ రాష్ట్రాల
హక్కులను హరించి, మిత్రులకు
వెన్నుపోటు పొడిచి BjP
ని ప్రజలు త్రిప్పికొడతారు.
◆ TDP లేకుండా
BJP అధికారంలోకి
రాలేదు.
◆ బీజేపీ
లేకుండా TDP అధికారంలోకి
వస్తుంది.
◆ AP కి
ద్రోహం చేసిన BjP ఎన్నడూ
కాంగ్రెస్ తో కలవని వారు AP
ని విడదీయడానికి కాంగ్రెస్ తో కలిశారు.
◆ BJP సమక్షంలో
పార్లమెంటు తలుపులు మూసి రాష్టాన్ని విడదీశారు.
◆ లింగు
లింగు మంటూ 5
సీట్ల తో YCP ఎలా
అవిశ్వాసం పెడుతుంది.
-----------------------------------------------
No comments:
Post a Comment