పెండింగ్ ప్రశ్నలన్నీ రద్దవుతాయి
శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
సచివాలయం, మే 7:
ప్రస్తుతం శాసనసభలో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలు, సమాధానాలు అన్నీ రద్దయిపోతాయని
శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల కోడెల శివప్రసాద రావు చెప్పారు. శానసభా భవనంలోని తన
ఛాంబర్ లో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశమైన తరువాత అన్నీ కొత్తగా మొదలవుతాయన్నారు. ప్రస్తుత
శాసనసభ భవన సముదాయం దైనందిక అవసరాలకు సరిపోవడంలేదని చెప్పారు. శాశ్వత శాసనసభ
నిర్మాణం పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని, అందువల్ల ఇక్కడే మరో పదివేల
అడుగుల భవన నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందన్నారు. అప్పుడు పూర్తిగా మార్పులు
చేస్తారని చెప్పారు. స్పీకర్, సభ్యులు, సిబ్బంది
అవసరాలకు అనుగుణంగా, క్యాంటిన్, లైబ్రరీ, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పిస్తారని
తెలిపారు. వచ్చే బడ్జెట్ నాటికి అన్ని పూర్తి చేస్తామని స్పీకర్ చెప్పారు.
No comments:
Post a Comment