రంజాన్ సందర్భంగా ముస్లిం
ఉద్యోగులకు
గంట ముందు వెళ్లడానికి అనుమతి
సచివాలయం, మే 4: రంజాన్ పవిత్ర
మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం ఒక గంట ముందు వెళ్లడానికి ప్రభుత్వం
అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు
జారీ చేశారు. ప్రభుత్వ శాశ్విత ఉద్యోగులు అందరితోపాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్
ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుంది. మే నెల 6 నుంచి జూన్ నెల 5వ తేదీ వరకు ఆ రెండు
రోజులతోపాటు అన్ని పని దినాలలో ముస్లిం ఉద్యోగులు తమ మత పరమైన ఆచారాలు
నిర్వర్తించడానికి సాయంత్రం ఒక గంట ముందు కార్యాలయం, పాఠశాల వదిలి వెళ్లడానికి
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో వారి సేవలు తప్పనిసరి కానివారందకి ప్రభుత్వం అనుమతి మంజూరు
చేసింది.
No comments:
Post a Comment