కుల వ్యవస్థ వల్ల నష్ట
ఎవరికి?
·
జనాభా దామాషా ప్రకారం హక్కులు
దక్కని బీసీలు
·
సమాన అవకాశాల కమిషన్
వల్ల సమన్యాయం
కుల వ్యవస్థ
కొనసాగడం వల్ల అటు ఉన్నత కులాలు, ఇటు ఎస్సీ, ఎస్టీలు బాగానే లబ్ది పొందుతున్నారు. ఓసీలు జానాభా దామాషా ప్రకారం మూడు,
నాలుగు రెట్లు రాజ్యాధికారంలో, ఉద్యోగాలలో భాగం
పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల వారు జనాభా దామాషా
ప్రకారం పొందగలుగుతున్నారు. చిత్రమైన పరిస్థితి ఏమిటంటే బీసీలు అత్యంత దారుణంగా
నష్టపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న వారి పరిస్థితిని ఇంకా దిగజార్చడానికి ఇతరులను
కూడా తీసుకువచ్చి బీసీలలో కలిపారు. ఇంకా కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అధికారంలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగానే వారిని దెబ్బతీస్తున్నారు. అటు ప్రైవేటు
రంగంలో, ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులలో ఇతరులు ఉంటుంటే
దిగువ స్థాయి ఉద్యోగాలు బీసీలు చేస్తున్నారు. కేంద్రంలోని ఉద్యోగాలలో బీసీలు పది శాతం మంది కూడా లేరు. అంటే బీసీలు ఏ
స్థితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు హక్కులు దక్కలేదు. ఇక దక్కే అవకాశం కూడా
కనుచూపుమేరలో కనిపించడంలేదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించే అంశం ఇది.
డాక్టర్
అంబేద్కర్ కుల నిర్మూలనను ప్రతిపాధించారు. అయితే అది తగిన రీతిలో కార్యరూపం
దాల్చలేదు. దేశంలోని పరిస్థితులు కూడా అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రాజకీయ
నాయకులు అందుకు సిద్ధంగాలేరు. కుల వ్యవస్థను వారు అనుకూలంగా మలుచుకుంటారు. ఏ
ప్రాంతంలోనైనా, ఏ గ్రామంలోనైనా కమ్మ- రెడ్డి, కాపు - యాదవ, మాల – మాదిగ పేర్లతో
వారిని విడగొట్టి లబ్ది పొందడం వారికి తేలిక. అన్నివిధాల అత్యధిక లాభం పొందే ఆధిపత్య కులాల
వారు గానీ, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ,ఎస్టీ కులాల వారు గానీ కుల
నిర్మూలన ఉద్యమం పట్ల అసలు ఆసక్తి చూపరు. ఆ ఉద్యమం బలపడితే వారికి ఏమీ లాభం ఉండదు.
కుల వ్యవస్థ కొనసాగితేనే వారు ఎక్కువ లబ్దిపొందడానికి
అవకాశం ఉంటుంది. చివరికి మనకి అర్ధమయ్యేది ఏమిటంటే కుల వ్యవస్థ కొనసాగడం వల్ల
తీవ్రంగా నష్టపోయేది బీసీ కులాలవారే.
ఈ పరిస్థితులలో తెలంగాణ బీసీ కమిషన్ సూచించిన విధంగా మన రాష్ట్రంలో
కూడా సమాన అవకాశాల కమిషన్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటుతో
పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆ కమిషన్ పని చేయాలి. ఏ ఒక్క
సామాజిక, మత, కుల, భాష,
ఇతర వర్గాల వారికి పక్షపాతం కానీ, విరోధం కానీ లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా దానిని రూపొందించాలి.
ఉద్యోగాల నియామకం, గృహ నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి
పథకాలను ఈ కమిషన్ పరిధిలో చేర్చితే
అందరికీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.
- శిరందాసు
నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment