బీసీ
సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన
అమరావతి, మే 20: నిరుద్యోగ
యువతను
పోటీ
పరీక్షలకు సిద్దం చేయడానికి ప్రభుత్వం
ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సర్కిల్స్,
ఏపీ స్టడీ సర్కిల్స్ లో
సౌకర్యాలు మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన
శంకర రావు బీసీ సంక్షేమ
శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయ లక్ష్మికి విజ్ఞప్తి
చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సచివాలయంలోని బీసీ సంక్షేమ
శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ
ఎస్ .హనుమంతరావును కలిసి ఒక
వినతి పత్రాన్ని అందజేశారు. అట్టడుగు వర్గాల
యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న సదుద్ధేశంతో కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు ప్రారంభించిన ఈ స్టడీ సర్కిళ్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోపడుతోందని శంకర
రావు చెప్పారు. అయితే స్టడీ సర్కిళ్లకు సొంత
భవనాలు లేవని, ప్రస్తుతం నిర్వహించే స్టడీ సర్కిళ్లలో పోటీ పరీక్షలకు అధ్యయనం
చేయడానికి తగిన సౌకర్యాలు గానీ, అనువైన వాతావరణ గాని లేదని తెలిపారు. అలాగే వసతి,
భోజన సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. 2004 సంవత్సరంలో నిర్ణయించిన ధరల ప్రకారం
స్టైఫండ్, మెటీరియల్స్, ఫ్యాకల్టీ రెమ్మూనరేషన్ ఉన్నాయని వివరించారు. ఆ ధరలతో ప్రస్తుత
అవసరాలు తీరే అవకాశంలేదన్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీకి ఇచ్చే
రెమ్మూనరేషన్ ఎక్కవగా ఉండటంతో ఇక్కడకు సమర్థులైన బోధకులు వచ్చే అవకాశం లేదన్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే యువతకు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో భోజన,
మెటీరియల్ వంటి అవసరాలు తీర్చుకోవడం కష్టం అని తెలిపారు.
ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను
ఉపయోగించుకోకుండా, ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో యువతకు కోచింగ్ ఇప్పించడం వల్ల
ప్రభుత్వానికి అధిక వ్యయం అవుతుందిన చెప్పారు. ఆ ఖర్చులో 25 శాతంతోనే ప్రభుత్వ స్టడీ
సర్కిళ్లలో సౌకర్యాలు మెరుగుపరిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. సొంత భవనం
నిర్మించడంతోపాటు స్టడీ సర్కిళ్లలో మెరుగైన ఆడియో, వీడియో వ్యవస్థని, జిరాక్స్
మిషన్ ని, గ్రంథాలయాన్ని, ప్రతి శిక్షణా తరగతిలో కూర్చొని రాసుకోవడానికి అనువుగా
బెంచీలు ఏర్పాటు చేయాలని, అధ్యయనానికి వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని శంకర
రావు కోరారు. స్టడీ సర్కిల్ నిర్వహణకు
గ్రూప్-1 స్థాయి డైరెక్టర్ ని నియమించాలని, కాంట్రాక్ట్ ప్రాతిపదిన నియమించి 15
ఏళ్లు పూర్తి అయిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ
యువత ప్రైవేటు హాస్టళ్ల ఉండి శిక్షణ పొందేందుకు స్టైఫండ్ నెలకు కనీసం రూ.4000
ఇవ్వాలన్నారు. సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్ బి తదితర ఉద్యోగాలతోపాటు గ్రూప్-1, II, III, IV సర్వీస్
ఉద్యోగాలకు మంచి కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. స్టడీ సర్కిళ్లలో ఇచ్చే
కోచింగ్ వివరాలు నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉంచాలన్నారు. స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మంచి ఫ్యాకల్టీని
నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శంకరరావు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సంక్షేమ సంఘం నాయకులు
కుమ్మర క్రాంతి కుమార్, నాగలింగం, దాసరి అప్పారావు, గోపి కృష్ణ, మేకా రవి, వెంకట్,
శేఖర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment