Ø ప్రశ్న: రాజధాని ఏర్పాటులో శివరామకృష్ణణ్ కమిటీ నివేదిక అమలు చేయలేదు.
Ø సమాధానం
: శివరామకృష్ణన్కు వచ్చిన, సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం అత్యధికులు
అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని
కోరారు. మొత్తం 4,728
సూచనలు వచ్చాయి. విజయవాడ -గుంటూరు - అమరావతి
ప్రాంతంలో రాజధాని ఉండాలని 2,191 మంది కోరగా, విశాఖకు 507, కర్నూలుకు 360,
తిరుపతికి 113, దొనకొండకు 116 అభిప్రాయాలు వచ్చాయి. రాష్ట్ర నడిబొడ్డున, నది
ఒడ్డున ఉన్న అమరావతికి మించినది మరేమున్నది?
Ø ప్రశ్న: అమరావతిలో భవన నిర్మాణాలకు చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.8
వేలు ఖర్చు చేశారు.
Ø సమాధానం:
అసెంబ్లీ భవన నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.5,333, హైకోర్టు భవనాలకు చ.అ.కు రూ.3,666, సచివాలయం,
శాసనసభ, మండలి భవనాలు, పార్కింగ్,భూమి అభివృద్ధి, గ్రీనరీ, ఫర్నీచర్,
సెంట్రల్ ఏసీ తదితరాలన్నీ కలిపి చ.అ.కు రూ.7,101, ఎమ్మెల్యే, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాలు,
ఎన్జీఓ భవనాలకు చ.అ.కు రూ.3,459 ఖర్చు చేశారు.
ఈ లెక్కలన్నీ బొత్స గారి
వద్ద ఉన్నా, చ.అ.కు టీడీపీ ప్రభుత్వం రూ.8 వేలు ఖర్చు చేసిందని పదే పదే అబద్దాలు
చెబుతున్నారు
Ø ప్రశ్న
: ఒక సామాజిక
వర్గం కోసమే రాజధాని.
Ø సమాధానం: అమరావతి పరిధిలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు
75 శాతం ఉన్నారు. 29 పంచాయతీల్లో 15 పంచాయితీల్లో కాపులు గణనీయంగా
ఉన్నారు. రాజధానిలో 14 కులాలుంటే, రెడ్లు 17శాతం, కమ్మవారు 14 శాతమే ఉన్నారు. విజయవాడ, గుంటూరులలో
బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు గణనీయంగా
ఉన్నారు. అమరావతి ప్రజా రాజధాని. కులాల కాస్మోపాలిటన్. ప్రతిపాడు, తాడికొండ, తిరువూరు, నందిగామ నాలుగు
ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ప్రజారాజధాని అమరావతి ఉంది.
Ø ప్రశ్న
: అమరావతి ముంపు ప్రాంతమని తప్పుడు
ప్రచారం.
Ø సమాధానం : అమరావతి ముంపు ప్రాంతం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇస్రో నిర్ధారించాయి.
1850, 2009లో పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు జరగలేదని గ్రీన్ ట్రిబ్యునల్
తీర్పు పేరా 76లో పేర్కొంది.
Ø ప్రశ్న: ఇన్సైడర్ ట్రేడింగ్
Ø సమాధానం :. జూన్ 2, 2014 నుంచి అమరావతి పేరు రాజధానిగా ప్రకటించిన సెప్టెంబర్ 4న వరకు
నాలుగు నెలల్లో 128 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది.
వాటిలో కూడా వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు కొనుగోలు చేశారు.
వారు టీడీపీ వారు కాదు. మిగిలిన 28 ఎకరాలు ఇతరులు కొనుగోలు చేశారు. వాస్తవం ఇదైతే
మంత్రి బుగ్గన గారు 4070 ఎకరాలని శాసనసభ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారు. ప్రజలను
తప్పు దోవ పట్టిస్తున్నారు.
Ø ప్రశ్న: బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో 500 ఎకరాలు.
Ø సమాధానం : బాలకృష్ణ వియ్యంకునికి రాజధానిలో ప్రభుత్వం సెంటు భూమి కూడా
ఇవ్వలేదు. రాజధాని వెలుపల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది.
Ø ప్రశ్న:
అమరావతిలో ఫౌండేషన్ ఖర్చులు ఎక్కువ అని అబద్దాలు చెప్పారు.
Ø సమాధానం: హైదరాబాద్, చెన్నై కన్నా అమరావతిలో
ఫౌండేషన్ ఖర్చులు తక్కువ అని ఇంజనీరింగ్ నిపుణులు ప్రకటించారు. అమరావతిలో రాకీ
స్టార్టా ఎల్ 11 మీ. డెప్త్, చ.మీ.కు 150 టన్నుల బేరింగ్ కెపాసిటీ ఉన్నది.
హైదరాబాద్ రాకీ స్టార్టా కారణంగా బ్లాస్టింగ్ చేయాలి. బేస్ మెంట్ 7.1 మీటర్లు,
బ్లాస్టింగ్ 4.5 మీటర్లు మొత్తం 11.6 మీటర్లు డెప్త్ – దీనికి తోడు కృష్ణా, గోదావరి
నీటి సరఫరా ఖర్చులు – చెన్నైలో బేరింగ్ కెపాసిటీ చ.మీ.కు 10 మెట్రిక్ టన్నులే.
ఫైల్ ఫౌండేషన్ 30 నుంచి 40 మీటర్ల లోతు నుంచి వేయాలి. రాజధానుల సాయిల్ స్ట్రెక్త్
కు సంబంధించి మద్రాసు ఐఐటీ నిపుణుల అంచనాలకు విరుద్దంగా మంత్రి బొత్స చేత జగన్ గారు అబద్దాలు చెప్పిస్తున్నది వాస్తవం కాదా?
Ø ప్రశ్న: అమరావతిలో తన
సామాజికవర్గ నేతలకు చంద్రబాబు భూములు కట్టబెట్టారు.
Ø సమాధానం: 130 సంస్థలకు 1293 ఎకరాలు
అత్యంత పారదర్శికంగా కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వే, విద్యా, ఆరోగ్య,
ఆధ్యాత్మిక సంస్థలు వంటివి ఇందులో ఉన్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమృత
యూనివర్సిటీలు, టీటీడీ తదితర సంస్థలకు భూములు కేటాయించారు.
Ø ప్రశ్న : రాజధానిలో
ఒక్క ఇటుక వేయలేదు, ఒక శాశ్విత కట్టడం లేదు.
Ø సమాధానం: సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు భవనాలు
శాశ్వితం కాదా? కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్ట్ గ్రాఫిక్సేనా? ఇటుకలు లేకుండా
నిర్మించారా? అమరావతిలో గ్రాఫిక్స్ రోడ్లపై తిరుగుతున్నారా? 29 గ్రామాల పేదలకు
నిర్మించిన 5వేల గృహాలు గ్రాఫిక్స్ యేనా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్,
ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలు గ్రాఫిక్స్ గానే ఉన్నాయా? ప్రైవేటు రంగంలో విట్,
ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, ఎయిమ్స్ నిర్మాణాలు గ్రాఫిక్సేనా?
Ø ప్రశ్న : రాష్ట్ర రాజధానికి గెజిట్
నోటిఫికేషన్ లేదు.
Ø సమాధానం: డిసెంబర్ 30, 2014న రాజధాని నగర ప్రాంతం(24
రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మున్సిపాలిటీలో కొంతభాగం)ని నోటిఫై చేస్తూ జీఓ
నెం.254 విడుదల. ఏపీ సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్ (3) సబ్ సెక్షన్ (3) ప్రకారం 122 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల
ప్రాంతం రాజధాని నగరంగా నోటిఫై చేశారు. ఏప్రిల్ 23, 2015న జీఓ ఎంఎస్ నెం.97
ప్రకారం రాజధానికి అమరావతి అని నామకరణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన
చేశారు.
§ అక్టోబర్ 29, 2018న సుప్రీం కోర్టు తీర్పు: 2018
నెం.డి.29890 కేసులో జస్టిస్ సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం తీర్పులోని
ప్రధాన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా అమరావతి అనే నగరాన్ని నిర్మించాలని
నిర్ణయించింది.
§ రాష్ట్రపతి ఆంధ్ర-తెలంగాణ ఉమ్మడి హైకోర్టును
విభజిస్తూ డిసెంబర్ 26, 2018న ఆర్డర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దానిని డిసెంబర్
27,2018న ప్రత్యేక గెజిట్ లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు’ అనే పేరుతో జనవరి 1, 2019న రాష్ట్రపతి ప్రత్యేక హైకోర్టు
ఏర్పాటు చేశారు. ఆ హైకోర్టు ప్రిన్సిపల్ సీటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో
ఉంటుందని ఆ ఆర్డర్ లో పేర్కొన్నారు.
భారత్ మ్యాప్లో అమరావతి
కేంద్రం విడుదల చేసిన భారతదేశం రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కల్పించారు. ఇంకా గజిట్
నోటిఫికేషన్ అడుతున్నారంటే ఏమనాలి?
Ø ప్రశ్న: రాజధాని వైకాపా మ్యేనిఫెస్టో.
Ø సమాధానం: అమరావతి రాజధానిగా తీర్మానం
చేసిన సమయంలో అప్పటి ప్రతి పక్షనేత జగన్మోహన రెడ్డి మన:స్పూర్తిగా మద్దతు
తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాజధానికి 30వేల ఎకరాలు కావాలన్నారు. రాజధానిని
అమరావతి నుంచి మార్చం అని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన
తరువాత రాజధానిని మార్చడంలేని మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో లిఖితపూర్వకంగా
సమాధానం ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి మార్చం, రైతులకు అండగా ఉంటానని నవంబర్
నెలలో ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. వాళ్లంతా మటా తప్పి ఇప్పుడు రాజధానిని విశాఖ
తరలిస్తామని చెబుతున్నారు.
Ø ప్రశ్న: దళితులకు అన్యాయం చేసిన టీడీపీ.
Ø సమాధానం: నాలుగు ఎస్సీ నియోజకవర్గాల
మధ్యన ఉన్న రాజధానిని విశాఖ నగరానికి తరలిస్తున్నారంటే ఎవరు దళితులకు అన్యాయం
చేశారో ఆలోచించుకోవాలి.
Ø ప్రశ్న : పీటర్ కమిషన్ పేరుతో లీకైన నివేదికలో రాజధానిలో రూ.30 వేల కోట్లు
దుబారా.
Ø సమాధానం: 28.6.2019న ఏపీసీఆర్డీఏపై జగన్ ప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేసింది.
అందులో రూ.9,165.76 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసినట్ల పేర్కొన్నారు.
ఖర్చు చేసిందే రూ.9,165.76 కోట్లు అయితే రూ.30 వేల కోట్లు దుబారా ఎలా అవుతుంది?
ఇది పచ్చి అబద్దం. పీటర్ వైఎస్ మేనత్త కుమారుడనేది వాస్తవం. అమరావతిపై అపోహలు
సృష్టించడానికి పీటర్ ని నియమించడం వాస్తవం కాదా?
Ø ప్రశ్న: 33 వేల ఎకరాలు తీసుకున్నారన్నారు.
Ø సమాధానం: రాజధాని నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ
హయాంలో జరిగిన భూసమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం- ఎల్పీఎస్) ఉత్తమమైనదని
ఏపీసీఆర్డీయే కమిషనర్ డాక్టర్ పి.లక్ష్మీ నరసింహం పేర్కొన్నారు.
Ø దేశంలో 6
దశాబ్దాల తర్వాత ఒక అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పడే అవకాశాలను కాలరాస్తూ
3 రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయం
లాంటిదని, ఇదొక జాతీయ విషాదం అని ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా పేర్కొన్నారు.
ప్రశ్న:
అమరావతికి రూ.1,09,023 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యయం
చేస్తుందంటారు.
సమాధానం: 2019 ఫిబ్రవరిలో విడుదలైన జీఓ 50 ప్రకారం అమరావతి నిర్మాణ వ్యయం రూ.55,343 కోట్లు. ఇది
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్ళలో ఖర్చు పెట్టేది కేవలం 6,629 కోట్లు మాత్రమే.
సీఆర్డీఏ
అప్పుగా 5,971 కోట్లు ఇస్తుంది. వివిధ బ్యాంకుల నుంచి వచ్చే రుణాల అంచనా 37,112 కోట్లు. అమరావతి మొదటి దశ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 51,687 +
వడ్డీ రూ.3,656 = రూ.55,343 కోట్లు మాత్రమే.
ఇప్పటి
వరకు వివిధ రూపాలలో మొత్తం వ్యయం రూ. 9,165.76 వేల కోట్లు.
ప్రశ్న
: అమరావతిలో ఒక వర్గానికి చెంది పెద్ద రైతులని ప్రచారం.
సమాధానం
: ‘రాజధాని’ రైతుల్లో
సన్నకారే అత్యధికం! 86 శాతం మంది రైతులది కష్టాల
జీవనమే. వారికి ఉన్న భూమి ఎకరం లోపే. ‘మూడు పంటలు’ 8 గ్రామాల్లోనే పండేది. -
తక్కిన గ్రామాలకు వర్షమే దిక్కు.
Ø అమరావతి కోసం 29,881 మంది రైతులు ఇచ్చిన భూమి 34,322 ఎకరాలు.
వారిలో
20,490 మంది పేదలే.
Ø 10 ఎకరాలకు మించి రైతులు 159 మంది. 2 ఎకరాలలోపు రైతులు 5227 మంది.
Ø ఎకరా లోపు ఉన్నవారు 20,490 మంది. ఎకరం, రెండెకరాలున్న
వారు 86 శాతం మంది.
- తెలుగుదేశం పార్టీ నాలెడ్జి సెంటర్
No comments:
Post a Comment