నిపుణుల కమిటీ కన్వీనర్ మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు హైదరాబాద్
ప్రెస్ మీట్:
‘‘విశాఖ నగరానికి
ప్రతికూలతలు ఉండటం నిజం. తీరప్రాంతం కోతకు గురవుతుండటం వాస్తవం. అందుకే, రాజధానిని విశాఖపట్నం కోర్ ఏరియాలో కాకుండా, దూరంగా
పెట్టాలని చెప్పాం’’ తెలిపారు. ‘విశాఖలో
కొత్తగా, భారీ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించడం
వాంఛనీయం కాదు’ ‘‘తుఫాన్లు
అన్ని ప్రాంతాల్లో వస్తాయి. తీరం కోతకు గురవుతుంది. నేనేం చేయగలను? ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని... విశాఖ ప్రాంత పరిధిలో సముద్రానికి దూరంగా
కార్యనిర్వాహక రాజధాని నిర్మించాలని సూచించాం’’ ‘విశాఖ నగరం
లోపల కాదు! సముద్రానికి దూరంగా రాజధాని పెట్టాలన్నాం. ఒత్తిడి తగ్గాలంటే అదొక్కటే
మార్గం’ 13 జిల్లాలను నాలుగు జోన్ల కింద విభజించి, సీనియర్ ఐఏఎస్లను జోనల్ కమిషనర్లుగా నియమించి, ఆయా
జిల్లాల పరిధిలోని యంత్రాంగంపై పర్యవేక్షణ చేయిస్తే ప్రయోజనం ఉంటుందని నివేదికలో
పేర్కొన్నాం.
విశాఖ ప్రాంత అభివృద్ధి
మండలి పరిధిలో ప్రభుత్వ భూములున్నాయి. కాస్మోపాలిటన్ నగరం కాబట్టే విశాఖకు
ప్రాధాన్యం ఇచ్చాం. పెట్రో కారిడార్, విశాఖ కారిడార్ వంటివి కలిసి వస్తాయి.
విశాఖ మాత్రమే ప్రాంతీయ అసమానతలు సరిచేయగలదు. ‘‘అన్ని
ప్రాంతాలకూ ప్రతికూలతలున్నాయి. వాటిని నివేదికలో పొందుపరిచాం. కాస్మోపాలిటన్ నగరం
కాబట్టే విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి సిఫారసు చేశాం’’ అమరావతిలో
శాసనసభ ఉంటుంది. ప్రస్తుత భవనాలు
ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించుకోవచ్చు. అక్కడి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం
న్యాయం చేయాల్సిందే. ‘‘అమరావతిలో 20 వేల
ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నాగార్జున వర్సిటీ పరిసర ప్రాంతాల్లో మేలిరకం
భూములున్నాయి’’
‘నాకు హైదరాబాద్లో
కార్యాలయం లేదు. ఏపీకి ఫోన్ చేసి... సిబ్బందికి డిక్టేట్ చేసిన వివరాలే
చదువుతున్నా’. ‘నాకిక్కడ కార్యాలయం లేదు. ఇంకేం అడగొద్దు.
వదిలేయండి’ ‘వాళ్లంతా పెద్దపెద్దవాళ్లు. కమిటీలో ఉన్నది
చిన్నవాళ్లు కాదు. 40, 50 ఏళ్ల అనుభవం ఉన్నవారు. హైదరాబాద్,
ఢిల్లీ, చెన్నై, బెంగళూరు
నుంచి వచ్చినవారు’ సందేహాల నివృత్తికోసం విలేకరులు మరిన్ని
ప్రశ్నలు అడుగుతుండగా జీఎన్రావు అసహనం ప్రదర్శించారు. చివర్లో... ‘ఐటెమ్ బాగా రాశారు. నివేదికలో నేను చెప్పినవే రాశారు. అన్నీ కరెక్టే!
హెడ్డింగ్ మార్చితే బాగుండు’ అని ‘ఆంధ్రజ్యోతి’
ప్రతినిధితో అనడం కొసమెరుపు.
No comments:
Post a Comment