13-01-2020:
v హైకోర్టు చీఫ్
జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్ వ్యాఖ్యలు: ‘‘గ్రామాల్లో 200 మంది పోలీసులతో
కవాతు చేయిస్తారా? ఆ
గ్రామాల్లో ఏమైనా కర్ఫ్యూ విధించారా? ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు ఎందుకు
అడ్డుకుంటున్నారు? మహిళల్ని
మగ పోలీసులు అరెస్టు చేస్తారా? చట్ట నిబంధనలు ఇలా చేయమని చెబుతున్నాయా? ఇదంతా ప్రభుత్వానికి ఓ
నవ్వులాటలా ఉన్నట్లుంది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామనేది మరిచిపోయారా? పౌరులకు నిరసన తెలిపే
హక్కు ఉందన్న విషయం గుర్తుందా?’’
v
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమిస్తున్న రైతుల
పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
గర్హించింది.
v
చిన్నా, పెద్దా, మహిళలన్న తేడా లేకుండా అందరిపైనా పోలీసులు లాఠీచార్జ్
చేసి గాయపరిచిన ఘటనలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు
సుమోటోగా స్వీకరించింది.
v
144 సెక్షన్ అమలులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను
ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజయవాడ కమిషనర్ గుంటూరు పట్టణ, రూరల్ ఎస్పీలను
ఆదేశించింది.
v
చట్టం అమలులో ఇష్టానుసారం వ్యవహరించిన సహచర సిబ్బందిపై
ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించి.. దానిపై వివరణ ఇవ్వాలని
ఉత్తర్వులు జారీ.
v
శాంతియుత ఉద్యమాలను
అడ్డుకోవద్దు. రాజధాని గ్రామాల్లో ఇళ్లలోకి వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.
v
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని అమలు చేసే తీరు ఇదేనా? చట్టాన్ని ఎలా అమలు
చేయాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు తెలియదా? 144 సెక్షన్ను ఎప్పుడు
ప్రయోగించాలో కూడా తెలియదా? గ్రామాల్లో కవాతులు జరపడానికి అక్కడేమైనా కర్ఫ్యూ
విధించారా?
v
. ‘‘కనీసం మీరైనా ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు కదా?’’ అని అడ్వకేట్ జనరల్ను
నిలదీసింది.
v విచారణ 17వ తేదీ
శుక్రవారానికి వాయిదా. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం.
ఎనిమిది పిటిషన్ల దాఖలు
v రాజధాని ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్
విధించడాన్ని సవాల్ చేస్తూ అత్యవసర విచారణ కోసం రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, మరో ఆరు పిటిషన్లు
హైకోర్టులో దాఖలయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్
విధించారని,
దానివల్ల
సాధారణ జనజీవనానికి విఘాతం కలుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు.
v
సంక్రాంతి సెలవుల
కారణంగా హైకోర్టుకు సెలవులు ఇచ్చినప్పటికీ అత్యవసర కేసుల విచారణ కోసం సోమవారం
ప్రత్యేక బెంచీలు ఏర్పాటయ్యాయి.
v
చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిల
ధర్మాసనం ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది.
v
‘‘144 సెక్షన్ అమలు చేసే తీరు ఇలాగేనా? అసలు రాష్ట్రంలో ఏం
జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకవైపు జాతీయ మానవహక్కుల కమిషన్, మరోవైపు జాతీయ మహిళా
కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తూ విచారణ జరుపుతున్నాయి. దీనిని బట్టి రాష్ట్రంలో
పరిస్థితులు మాకు విస్మయానికి గురి చేస్తున్నాయి’’
v
పిటిషనర్ల తరఫు
న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, ఇంద్రనీల్ బాబు, భానుప్రసాద్, ఆనంద్ శేషు, సుధాకర్రావు అంబటి, ప్రణతి: ‘‘144 సెక్షన్ విధింపుకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు
జారీ చేయలేదు. మగపోలీసులు మహిళా రైతులపై దౌర్జన్యం చేస్తున్నారు. ఫోటోల్ని
చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. కొన్ని గ్రామాల్లో మహిళల్ని ఇళ్ల నుంచి బయటకు
రానీయడం లేదు. నిత్యావసరాల కోసం బతిమలాడుకున్నా అంగీకరించడం లేదు. పోలీసులు
ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారు. అడిగితే దాడులకు
దిగుతున్నారు’’
నిరసనకారులపై దాడులు చేస్తున్నారు. కులం పేరు
అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు. గ్రామ
దేవతల పూజలకు సైతం అనుమతించడం లేదు. సచివాలయంలో అధికారిక సమావేశం ఏదైనా ఉంటే, అక్కడికి సమీపాన ఉన్న
మందడంలో పోలీసులు బలవంతంగా షాపులు మూయిస్తున్నారు. రోడ్లపై ప్రజల్ని తిరగనివ్వడం
లేదు.
v
పత్రికల్లో వచ్చిన ఓ ఫొటోను చూడాలని ధర్మాసనం ఏజీని
కోరింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 354 కింద
పోలీసులపై కేసు నమోదు చేయడానికి ఈ ఫొటో ఒక్కటి చాలని ధర్మాసనం తీవ్ర స్వరంతో
వ్యాఖ్యానించింది.
v
ఇలాంటి ఆరోపణలు
ఎదుర్కొంటున్న పోలీసులపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఏజీ వివరించారు.
v ధర్మాసనం: ప్రభుత్వానికి, పోలీసులకు పలు
ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో అధికార యంత్రాంగం చట్టాన్ని అమలు
చేస్తుందని ఆశిస్తున్నాం. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు సీఆర్పీసీ
సెక్షన్ 46కు విరుద్ధంగా ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. పౌరుల ప్రాథమిక
హక్కులను,
మానవ
హక్కులను పరిరక్షించేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ
మధ్యంతర ఉత్తర్వులు
v జీవనోపాధి నిమిత్తం ప్రజలను వారి వారి ఇళ్ల నుంచి
స్వేచ్ఛగా బయట తిరగనివ్వాలి.
v
శాంతియుత నిరసనలకు
అనుమతి ఇవ్వాలి.
v
గ్రామ దేవతలకు, ఇతర దేవుళ్లకు తమ తమ
ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల
ప్రకారం పూజలు చేసుకునేందుకు ప్రజల్ని అనుమతించాలి.
v
సీఆర్పీసీ నిర్దేశించిన
నిబంధనల మేర తప్ప, గ్రామస్థుల
ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయరాదు.
v
అరెస్టుల విషయంలో సీఆర్పీసీ
సెక్షన్ 46ను విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు తూచా తప్పక పాటించాలి.
v
నిరసనకారులను అరెస్టు
చేసి పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ
జరపాలి.
v
గాయపడినట్లు పత్రికలు, టీవీల్లో కనిపించిన
వారికి తక్షణమే వైద్యసదుపాయం కల్పించాలి.
v
అరెస్టు చేసిన
వ్యక్తులను తక్షణమే సంబంధిత మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలి.
v
సుప్రీంకోర్టు
మార్గదర్శకాలు,
సీఆర్పీసీ
సెక్షన్ 46 తదితరాలను ఉల్లంఘించిన పోలీసులపై విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ
జరపాలి. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
v
చట్టాన్ని అమలు చేయని
సహచర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, జీఏడీ ముఖ్యకార్యదర్శి, డీజీపీలు కోర్టుకు వివరణ
ఇవ్వాలి.
v ప్రభుత్వ చర్యలపై
శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తుంటే 144 సెక్షన్ ఎందుకు విధించాల్సి
వచ్చిందో విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు, కృష్ణా, గుంటూరు కలెక్టర్లు వివరణ ఇవ్వాలి.
No comments:
Post a Comment