ఆకురాతి
కిషోర్కు డాక్టరేట్
హైదరాబాద్: గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్కు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదాన చేసింది. యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్లో ఘనంగా జరిగింది. ‘వాలిడేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటిలిజెన్స్ విత్ ఆస్ట్రోలజీ’ అనే అంశంపై పరిశోధన చేసిన కిషోర్కు ఈ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆకురాతి వెంకట కృష్ణారావు, భారత స్వరాజ్యలక్ష్మిల కుమారుడైన కిషోర్ గుంటూరులోనే విద్యాభ్యాసం చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన కిషోర్ ఉద్యోగం చేస్తూనే ఆ తరువాత ప్రైవేటుగా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా సుందరం ఫైనాన్స్ కంపెనీలో దేశంలోని వివిధ ప్రాంతాలలో పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో సుందరం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్గా పని చేస్తున్నారు. కిషోర్-బాల సరస్వతిల కుమార్తె మానస గుంటూరులోనే ఎంబిబిఎస్ చదువుతోంది. ఈ వయసులో కూడా ఉద్యోగం చేస్తూ చదువు, పరిశోధన పట్ల ఆసక్తితో యూనివర్సిటీకి పరిశోధన పత్రం సమర్పించి కిషోర్ డాక్టరేట్ సాధించడం అభినందనీయం.
No comments:
Post a Comment