అల్లక
తాతారావుకు ఆత్మీయ సన్మానం
చేనేత బతుకు చిత్రాన్ని పాట రూపంలో
జైపూర్లో ఆలపించిన చేనేత కార్మికులు, కవి, రచయిత, మదుర గాయకుడు అల్లక తాతారావుకు
విశ్వశాంతి కళాపరిషత్ ఆధ్వర్యంలో పాత మంగళగిరిలోని పొట్లాబత్తుల లక్ష్మణరావు
వస్త్రాలయం పైన ఆదివారం రాత్రి ఆత్మీయ
సన్మానం జరిగింది. రాజస్థాన్లోని జైపూర్ ఫెయిర్మౌంట్ హోటల్లో అక్టోబర్ 4,5,6 తేదీలలో అత్యంత
ప్రతిష్టాత్మకంగా జరిగిన రేమాండ్ ఎంటీవీ ఇండియా మ్యూజిక్ సమ్మిట్-2019 సందర్భంగా
రేమాండ్ వారు చేనేత-ఖాదీ ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో
కశ్మీర్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్ చేనేత కళాకారులు చేనేత గీతాలను ఆలపించారు. ప్రముఖ
బిల్డర్ ఇంజమూరి శ్రీనివాసరావు
ప్రోత్సాహం, సహకారంతో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అల్లక తాతారావు రెండు తెలుగు రాష్ట్రాల తరపున ఆ కార్యక్రమంలో
పాల్గొని చేనేత బతుకు గీతం ఆలపించారు. ఆ
సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని కళాకారులు ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు.
సభా కార్యక్రమానికి ముందు పలువురు
కళాకారులు పాటలు, పద్యాలు ఆలపించారు. ఇంజమూరి శ్రీనివాసరావు, అల్లక తాతారావులను
జొన్నాదుల బాపూజీ శాలువలతో సన్మానించారు. సభానంతరం అల్లక తాతారావును పలువురు
పూలమాలతో, శాలువలతో సన్మానించారు. కథ,నాటక రచయిత, కవి, గాయకుడు, ప్రజా కళాకారుడు, చేనేత కార్మికుడు సందుపట్ల భూపతి అధ్యక్షత
వహించిన ఈ కార్యక్రమంలో ఇంజమూరి శ్రీనివాసరావు, పొట్లాబత్తుల లక్ష్మణరావు,
కృష్ణార్జున బోధి, రేఖా కృష్ణార్జున రావు, జొన్నాధుల బాపూజీ, గుత్తికొండ ధనుంజయ,
దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివ శంకరయ్య, గోలి
సీతారామయ్య, కంచర్ల కాశయ్య, గోలి మధు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment