బలీయమైన సంస్కృతి
Ø గార్బా, దాండియా నృత్యాలు
Ø దసరా సందర్భంగా 28న విజయవాడలో మెగా ఈవెంట్
Ø దుర్గాదేవి-మహిషాసురునికి మధ్య జరిగే యుద్ధానికి ప్రతీకగా దాండియా
సంస్కృతి, భాష చాలా బలీయమైనవి. ఏ ప్రాంతం వారైనా వారి సంస్కృతి, సంప్రదాయాలు, భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. జీవితాంతం వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, బతుకుదెరువు కోసం ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా వాటిని అనుసరిస్తూ ఉంటారు. మన తెలుగు వారు అమెరికా, దుబాయ్ .. వంటి దేశాలలలో నివాసం ఉంటున్నా సంక్రాంతి, బతకమ్మ వేడుకలు జరుపుకుంటుంటారు. అలాగే గుజరాత్, రాజస్థాన్ ల నుంచి వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవారు విజయవాడలో దసర ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడంతోపాటు వారి సంప్రదాయ గార్బా, దాండియా నృత్యాలను అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రదర్శిస్తుంటారు. ఈ కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు, మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటుంటారు. వారి సంస్కృతిని ముందు తరాలవారికి అందిస్తుంటారు. క్రియేటివ్ సోల్ నేతృత్వంలో దాండియా మెగా ఈవెంట్ పేరుతో రెండేళ్ల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం చిన్న పిల్లలు మొదలుకొని యువతీ యువకులకు
, పెద్దలకు బెంజి సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపడానికి లక్షల విలువైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. విలువైన బహుమతులు గెలుచుకునేందుకు వారు పోటీలుపడి మరీ వారి సంప్రదాయ నృత్యాలను అభ్యాసం చేస్తున్నారు. ఇందు కోసం జాతీయ స్ధాయిలో గుర్తింపు కొందిన శిక్షకులను రప్పించి వారికి 21 రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుత ప్రమోషన్ కార్యక్రమంలో పురుషుల విభాగంలో సౌరవ్, మహిళల విభాగంలో మయూరి, ఉత్తమ వేషధారణ విభాగంలో రితిక అగ్రభాగాన నిలిచి బహుమతులు అందుకున్నారు. మెగా ఈవెంట్ లో గుజరాతీ సంగీత కళాకారుల పాటలతోపాటు వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం వినిపిస్తారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులు, హోరెత్తించే వాద్యాలతోపాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన గుజరాతీ దుస్తులు, వస్త్రాలు, ఆభరణాలు, కళాకృతులు, చిత్రలేఖన ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు.
సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఈ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేస్తారు. కళలతో దేశసమైఖ్యతను చాటాలన్నది గుజరాతీ, రాజస్ధానీ పడతుల ముఖ్య ఉద్దేశం. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారు. అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి అత్యంత ఉత్సాహంగా ఈ నృత్యం చేస్తారు. క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహాజైన్, ప్రధాన టైటిల్ స్పాన్సర్ జిఎం మాడ్యులర్ ఈ ఈవెంట్ నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
- శిరందాసు నాగార్జున – 9440222914
No comments:
Post a Comment