సచివాలయం, సెప్టెంబర్ 26: జాతీయ మహిళా పార్లమెంట్ తుది అమరావతి
ప్రకటన విడుదలకు సంబంధించి ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు
అధ్యక్షతన ఈ నెల 27
ఉదయం 11.30
గంటలకు వెలగపూడి శాసనసభా భవనంలోని సమావేశం మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు డాక్టర్ కోడెల
ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై అంతర్జాతీయ స్థాయిలో ‘అమరావతి ప్రకటన’ రూపొందించారు. మహిళా సాధికారితకు కావలసిన అన్ని అంశాలను,
గ్రామీణ మహిళ మొదలుకొని పట్టణ మురికివాడలలో నివసించే
మహిళలు, విద్యార్థులు
ఎదుర్కొంటున్న విద్య,ఆర్థిక, ఆరోగ్యపరమైన అన్ని అంశాలు ఆమూలాగ్రం
చర్చించి దీనిని సిద్ధం చేశారు. తుది ప్రకటన విడుదల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై ఈ
సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్,
రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునిత, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, పాఠశాల విద్య కమిషనర్
సంధ్యారాణి, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ(ఏపీఎస్ డీపీఎస్) డైరెక్టర్ వి.ప్రతిమ, సీనియర్ అసోసియేట్ అలెన్ జాన్, రోడ్లు భవనాల శాఖ
కన్సల్టెంట్ నీరజ్ ఆద్య, యునిసిఫ్ ఏ అండ్ సి స్పెషలిస్ట్ ప్రొసూన్ సేన్, టెక్నికల్ కన్సల్టెంట్
చావా లక్ష్మిసుధ, ఇవి స్వర్ణలత పాల్గొంటారు.
Subscribe to:
Post Comments (Atom)
30న తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక
ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment