ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
కేంద్ర ప్రభుత్వం
ప్రవేశపెట్టనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల విధానం పట్ల దేశవ్యాప్తంగా
అనుకూలత వ్యక్తమవుతున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం రెండవ బ్లాక్ లో మంగళవారం మధ్యాహ్నం తన
ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ వల్ల నాలుగు రకాల వస్తువులు పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, సాఫ్ట్ డ్రింక్స్,
బొగ్గు(క్లీన్ ఎన్విరాన్ మెంట్ సెస్)పై 28 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని తెలిపారు. మిగిలినవాటిపై 5 శాతం, 12 శాతం,
18 శాతం చొప్పున పన్ను విధించే అవకాశం ఉందని చెప్పారు. కొత్త పన్నులకు సంబంధించి
కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ (సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ),
పరిహార బిల్లులను పార్లమెంటులో ఆమోదించినట్లు తెలిపారు. వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపార, ఆమోదించిన తరువాత గజిట్ నోటిఫికేషన్
వెలువడుతుందన్నారు. ఆ తరువాత రాష్ట్రాలు ఆమోదించవలసి ఉంటుందని చెప్పారు. ఈ
బిల్లులు ఆమోదించడం కోసం ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ రాష్ట్రంలో
ఉభయ సభల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈలోపు వివిధ రాష్ట్రాల్లో వస్తువులపై
పన్నులను అధ్యయనం చేసి నిపుణుల కమిటీ ఒక నివేదిక అందజేస్తుందని తెలిపారు. అయితే ఈ
కమిటీలో మన రాష్ట్రం నుంచి సభ్యుడు ఎవరూ లేరని చెప్పారు. ఈ నెల 18, 19 తేదీల్లో
శ్రీనగర్ లో జీఎస్ టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఏఏ వస్తువులపై ఎంత
పన్ను విధించాలి, నష్టపోయే రాష్ట్రాలను ఏ విధగా ఆదుకోవాలి.... వంటి అన్ని విషయాలను
ఈ సమావేశంలో చర్చిస్తారన్నారన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన తరువాత
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
ఒకే రకమైన పన్నుల
విధానాన్ని ప్రపంచంలో సగం దేశాలు ముఖ్యంగా యూరప్ లో అమలు చేస్తున్నట్లు
వివరించారు. నూతన పన్నుల విధానం పట్ల దేశవ్యాప్తంగా అనుకూలత వ్యక్తమవుతున్నట్లు
మంత్రి యనమల తెలిపారు. ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో రెవిన్యూ పెరుగుతుందని, స్వల్ప
కాలంలో నష్టాలు వస్తాయని చెప్పారు. అయితే నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం సెస్ ఫండ్
నుంచి ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి యనమల తెలిపారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ
మంత్రి నారాయణ, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు కూడా పాల్గొన్నారు.
జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి సెల్ నెంబర్ :
9949351604
No comments:
Post a Comment