· ఉచిత విద్యుత్
50 నుంచి 75 యూనిట్లకు పెంపు
· ప్రభుత్వంపై
రూ.120.03 కోట్ల అదనపు భారం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం
కోసం ఎంతగానో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారికోసం మరో పథకం
ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివశించే వారికి ప్రస్తుతం నెలకు 50 యూనిట్ల
విద్యుత్ వరకు ఉచితంగా అందిస్తున్నారు. జూన్
1 నుంచి నెలకు వంద యూనిట్లు లోపల విద్యుత్ ఉపయోగించుకునే ఎస్పీ,ఎస్టీల కుటుంబాలకు
75 యూనిట్లు ఉచితంగా అందజేసే జగ్జీవన్ జ్యోతి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
జగ్జీవన్ రామ్ 110వ జన్మదినోత్సవం
సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రకటించారు. దీని వల్ల 14.23 లక్షల
కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ప్రభుత్వంపై రూ.206.14 కోట్ల
భారం పడుతుంది.
ఎస్సీ లబ్దిదారులు 10 లక్షల 29వేలు : నెలకు 50 యూనిట్ల లోపల విద్యుత్
ను వాడుకునే ఎస్సీ కుటుంబాలు 6,89,848, 51 నుంచి 75 యూనిట్ల లోపల వాడుకునే
కుటుంబాలు 2,19,100, 76 నుంచి 100 యూనిట్ల
లోపల వాడుకునే కుటుంబాలు 1,20,965 ఉన్నాయి. ఈ ప్రకారం మొత్తం 10,29,913 ఎస్సీ కుటుంబాలు 75 యూనిట్ల
ఉచిత విద్యుత్ ను పొందుతాయి. ఇందు కోసం ప్రభుత్వానికి రూ.113.06 కోట్లు ఖర్చు
అవుతుంది.
ఎస్టీ లబ్దిదారులు 3 లక్షల 92 వేలు: నెలకు 50 యూనిట్ల లోపల విద్యుత్ ను వాడుకునే
ఎస్టీ కుటుంబాలు 2,99,851, 51 నుంచి 75 యూనిట్ల వరకు వాడుకునే కుటుంబాలు 36,116,
76 నుంచి 100 యూనిట్ల లోపల వాడుకునే కుటుంబాలు 56,899 ఉన్నాయి. ఆ విధంగా 75
యూనిట్లు ఉచిత విద్యుత్ ను పొందే ఎస్టీ కుటుంబాలు మొత్తం 3,92,866 ఉన్నాయి. ఇందుకోసం
ప్రభుత్వానికి రూ. 40.59 కోట్లు ఖర్చవుతుంది.
రాష్ట్రంలో
ప్రస్తుతం నెలకు 50 యూనిట్ల లోపల విద్యుత్ ను వినియోగించుకునే ఎస్సీ కుటుంబాలు
6.89 లక్షలు, ఎస్టీ కుటుంబాలు 2.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు అందించే ఉచిత
విద్యుత్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రూ.86.11 కోట్లు ఖర్చు చేస్తోంది.
ఉచితంగా అందించే విద్యుత్ ను పెంచడంతో వంద
యూనిట్ల విద్యుత్ ని వాడుకునే మొత్తం 14,23,779 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు లబ్ది
పొందుతాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం 75
యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తుంది.
ఇందుకు అయ్యే రూ.206.14 కోట్ల ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది. ఉచిత
విద్యుత్ యూనిట్లు పెంచడం వల్ల 3.41 లక్షల
ఎస్సీలు, లక్ష మంది ఎస్టీలు అదనంగా
లబ్దిపొందుతారు. ప్రభుత్వానికి ఈ ఆర్థిక
సంవత్సరం (2017-18)లో రూ.120.03 కోట్లు అదనంగా ఖర్చవుతుంది.
విద్యుత్ ని వినియోగించుకోవడానికి ఆర్థిక
స్తోమతలేని నిరుపేద ఎస్సీ,ఎస్టీ కుటుంబాల వారు రాత్రుళ్లు కిరోసిన్ దీపాలతో కాలం
గడుపుతున్నారు. ఈ కారణంగా వాతావరణ కాలుష్యంతోపాటు ఆ కుటుంబాలకు హాని అని భావించిన
ప్రభుత్వం జగ్జీవన్ జ్యోతి ప్రథకం ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా పేద
ఎస్సీ,ఎస్టీ కుటుంబాల జీవన ప్రమాణ స్థాయి పెరిగే అవకాశం ఉంది.
జారీ చేసినవారు : పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి
No comments:
Post a Comment