సచివాలయం,
మే 4: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఆర్ఇఆర్ఏ) బాధ్యతలను మునిసిపల్ పరిపాలన,
పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ‘రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్)
యాక్ట్ -2016’ చట్టం రూపొందించిన విషయం తెలిసేందే. దీనిని ఈ ఏడాది మే నుంచి అమలు
చేయాలని కేంద్రం సూచించిన నేపధ్యంలో
రాష్ట్ర ప్రభుత్వం ‘రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) నిబంధనలు-2017’ని
రూపొందించింది. ఆర్ఇఆర్ఏ ఏర్పడేంత వరకు ఈ చట్ట ప్రకారం నిర్వహించవలసిన బాధ్యతలను మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ
చేసింది. ఆర్ఇఆర్ఏ నిబంధనల ప్రకారం అథారిటీ సొంత వెబ్ సైట్ ని రూపొందిస్తుంది. డెవలపర్లు,
ప్రమోటర్లు తమతమ ప్రాజెక్టు వివరాలను ఆ వెబ్ సైట్ లో నమోదు చేయాలి. ఈ వెబ్ సైట్
రూపొందించే లోపల డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీ అండ్ సీపీ) www.dtcp.ap.gov.inలో వివరాలు నమోదు చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పిస్తారు. ‘రియల్
ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) నిబంధనలు-2017 ప్రకారం చేపట్టే
ప్రాజెక్టుల వివరాలు వెంటనే నమోదు చేసుకోవాలని డీటీ అండ్ సీపీ ఒక ప్రకటనలో
తెలిపింది. ప్రజలు, ప్రమోటర్లు తమ సమస్యలను వెబ్ సైట్ ద్వారా అథారిటీకి
తెలియజేయాలని పేర్కొంది. శాశ్విత ప్రాతిపదికన అథారిటీని ఏర్పాటు చేసే ప్రక్రియ
కొనసాగుతోంది. ఈ లోపు అథారిటీ తన విధులను తాత్కాలికంగా వెలగపూడిలోని సచివాలయం
రెండవ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ 107వ రూమ్
నుంచి నిర్వహిస్తుంది. ఇంకా వివరాలు కావలసినవారు apmaudosd@gmail.com, dtcp.ap@gmail.com ద్వారా
సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జారీ చేసినవారు : పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి
No comments:
Post a Comment