May 12, 2017

‘ఉడా’లు అన్నిటిలో ఒక రకమైన నిబంధనలు

-     మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం
     
    రాష్ట్రంలోని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(ఉడా)లన్నింటిలో ఒకే విధమైన నిబంధనలు రూపొందించాలని మంత్రి వర్గ ఉపసంఘం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సమావేశంలో నిర్ణయించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. సచివాలయం రెండవ బ్లాక్ లో మంగళవారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పట్టణాభివృద్ధి సంస్థలో ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయని, వాన్నిటినీ ఒకే విధంగా రూపొందిస్తారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరగవలసిన అవసరం ఉందని, పెట్టుబడులు రావాలని, ఉద్యోగ అవకాశాలు పెరగాలని  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ విషయాలపై ఈ రోజు చర్చించినట్లు మంత్రి చెప్పారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునేందకు లేఅవుట్ల నిబంధనల్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. సీఆర్ డీఏ పరిధిలో అమరావతి రాజధాని లోపల ఇన్నర్ రింగ్ రోడ్డుకు బయట 10,255 ఎకరాల్లో లేఅవుట్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. లేఅవుట్ల నిబంధనలను సరళం చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి,  సెల్ నెంబర్ : 9949351604


No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...